Ads
దక్షిణాది చిత్ర పరిశ్రమతోపాటు దేశవ్యాప్తంగా భారీ చర్చకు దారి తీసిన చిత్రం ది లెజెండ్. తమిళనాడులో శరవణన్ గ్రూప్ అధినేత శరవణన్ అరుల్ హీరోగా నటించిన ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా రిలీజైంది. అయితే ఈ సినిమా రిలీజ్కు ముందు సంపాదించుకొన్న క్రేజ్ను బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లుగా మలచలేకపోయింది.
Video Advertisement
ది లెజెండ్’ మూవీ జూలై 28 న రిలీజ్ అయ్యింది. ఇదేమీ సూపర్ హిట్ మూవీ కాదు. కానీ ఈ మూవీ ఇంకా ట్రెండింగ్ లో ఉండటానికి కారణం మాత్రం ఈ చిత్రం హీరో మరియు శరవణ స్టోర్స్ అధినేత అయిన అరుళ్ శరవణన్. 51 ఏళ్ల వయసులో ఇతను హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ‘శరవణ ప్రొడక్షన్స్’ అనే బ్యానర్ ను స్థాపించి మరీ రూ.80 కోట్ల బడ్జెట్ పెట్టి ఈ పాన్ ఇండియా సినిమాని తీశాడు.
ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ పరంగా రూ.25 కోట్లు కూడా చేయలేకపోయింది. కేవలం తన శరవణన్ స్టోర్స్ ప్రమోషన్ కోసం మాత్రమే అతను హీరోగా మారి ఈ సినిమా తీసినట్టు స్పష్టమవుతుంది. ఈ సినిమాకి ఇదివరకే ఓటీటీ కోసం భారీ ఆఫర్స్ రాగా అరుళ్ ఆసక్తి చూపలేదు. అయితే ఫైనల్ గా అతను ‘ది లెజెండ్’ ను ఓటీటీకి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. డిసెంబర్ నెలలో ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది అని సమాచారం.
ఇదిలా ఉండగా ఇప్పుడు రెండో సినిమాతో మరో సెన్సేషన్కు రెడీ అవుతున్నారు శరవణన్ అరుళ్. ఐదు పదుల వయసులో రొమాంటిక్ స్టార్ అనిపించుకునేందుకు తంటాలు పడుతున్నారు. త్వరలోనే ఓ యాక్షన్ రొమాంటిక్ కథతో సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా కోసం భారీ తారాగణాన్ని తీసుకోనున్నారట. హీరోయిన్ గా ఓ బాలీవుడ్ టాప్ బ్యూటీని కూడా పరిశీలిస్తున్నారట.
End of Article