Ads
యంగ్ హీరోలకు పోటీగా నందమూరి నటసింహం బాలకృష్ణ యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నారు. ఇటీవల అఖండ సక్సెస్ తో రికార్డులు తిరగ రాసిన బాలయ్య. ఇప్పుడు మరో మాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, గోపీచంద్ మలినేని దర్శకుడిగా తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘వీరసింహ రెడ్డి’. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శృతి హాసన్ కథానాయిక. ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగవంతం చేసింది.
Video Advertisement
బాలయ్య 107 చిత్రం గా రాబోతున్న ‘వీర సింహ రెడ్డి’ లో హానీ రోజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, కన్నడ స్టార్ దునియా విజయ్, మలయాళ నటుడు లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ప్రకటించినప్పటి నుంచే ఫాన్స్ ఈ చిత్రం పై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, వీడియోలు ఈ వీర సింహా రెడ్డిపై హైప్ పెంచేశాయి.
ఇప్పటికే వరుస అప్ డేట్స్ తో ఫాన్స్ లో పూనకాలు తెప్పిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ‘జై బాలయ్య’, ‘సుగుణ సుందరి’ పాటలు విడుదల చేయగా అవి ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. తమన్ బాణీలకు, శృతి హాసన్ తో స్టెప్పులు వేస్తూ బాలయ్య ఫుల్ ఎనర్జీ తో కనిపిస్తున్నారు. ఈ రెండు పాటలు ఇప్పటికే హైప్ పెంచేసాయి.
అయితే తాజాగా ఈ చిత్రం నుంచి మూడో పాటను విడుదల చేసారు మేకర్స్. ఈ చిత్రం లోని ప్రత్యేక గీతం అయిన “మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే”.. అంటూ సాగే గీతాన్ని విడుదల చేసారు. మాస్ ని ఉర్రుతలూగించేలా ఉన్న ఈ పాటని రామజోగయ్య శాస్త్రి రాయగా.. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ పాట లో బాలయ్య హీరోయిన్ హనీ రోజ్, చంద్రిక రవి తో కలిసి స్టెప్పులేశారు.
అయితే ఈ సాంగ్ పై నెట్టింట పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి.. వాటిపై ఓ లుక్కేయండి..
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
watch video :
End of Article