Ads
గత కొంతకాలం గా హీరో కళ్యాణ్ దేవ్, మెగా డాటర్ శ్రీజ ఇద్దరు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరూ విడిపోయారని.. వేరే పెళ్లిళ్లకు సిద్ధమయ్యారని వార్తలు వస్తున్నాయి. కానీ వీరిద్దరూ విడిపోయినట్లు అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడం తో వారి కోల్డ్ వార్ బయటపడింది.
Video Advertisement
ఒకప్పుడు కళ్యాణ్ దేవ్ మామయ్య చిరంజీవి ఇంట్లో ఉండేవాడు. గొడవలు అయ్యాక ఆయన తన ఇంటికి వచ్చేశాడు. శ్రీజ-కళ్యాణ్ దేవ్ ల కూతురు నవిష్క తల్లి వద్దే పెరుగుతుంది. వారిద్దరూ ఎందుకు దూరంగా ఉంటున్నారన్న విషయాలు వ్యక్తిగతం కాబట్టి బయటకి రాలేదు. అయితే ఒకరిపై మరొకరు కోపంగా ఉన్నారని తెలుస్తుంది. వాలెంటైన్స్ డే నాడు వారి సోషల్ మీడియా పోస్ట్స్ అతిపెద్ద చర్చలు దారితీశాయి.
కళ్యాణ్ దేవ్… ‘ఒకరిని ఎంత ఇష్టపడ్డాం అనేది కాదు, ఎలా ట్రీట్ చేశాం అనేది ముఖ్యం..’ అని ఇంస్టాగ్రామ్ స్టేటస్ పోస్ట్ చేశాడు. దానికి కౌంటర్ గా శ్రీజా ‘ఒకరి ప్రేమించడం అంటే అర్థం మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించేలా చేసుకోవడం కాదు. తమని తాము ఎక్కువగా ప్రేమించబడేలా చేయాలి. ప్రేమను గుర్తించాలి. ప్రతిచోటా దాని కోసం వెతక కూడదు’ అని శ్రీజా ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో కామెంట్ పెట్టారు. కళ్యాణ్ దేవ్ స్టేటస్ ప్రకారం.. ఎవరో తన పట్ల సరిగా వ్యవహరించలేదు. గౌరవం ఇవ్వలేదని పరోక్షంగా చెబుతుంది. దానికి సమాధానం చెబుతున్నట్లు శ్రీజా పోస్ట్ ఉంది. నా ప్రేమను గుర్తించలేకపోయావు. ప్రతి విషయంలో నన్ను ప్రేమించడం లేదని విమర్శించావని చెబుతున్నట్లుగా ఉంది.
దీంతో వీరిద్దరి విబేధాలకు ఈ పోస్ట్ లు స్పష్టతనిచ్చాయి. 2016లో చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ కళ్యాణ్ దేవ్ ని వివాహం చేసుకున్నారు. శ్రీజకు ఇది రెండో వివాహం. ఓ ఐదేళ్లు వీరి ప్రయాణం సాఫీగానే సాగింది. వివాహమైనప్పటికీ శ్రీజ తండ్రి వద్దే ఉండేవారు. చిరంజీవి అల్లుడి హోదాలో కళ్యాణ్ దేవ్ హీరోగా మారాడు. 2021 నుంచి శ్రీజతో కళ్యాణ్ దేవ్ కి విభేదాలు తలెత్తాయి. శ్రీజ తన సోషల్ మీడియా అకౌంట్స్ నుండి కళ్యాణ్ దేవ్ పేరు తొలగించడంతో ఈ విషయం బయటకు వచ్చింది.
End of Article