Home News ఆ రాష్ట్రంలో బస్సు ప్రయాణం రీస్టార్ట్…కానీ షరతులు ఇవే..!

ఆ రాష్ట్రంలో బస్సు ప్రయాణం రీస్టార్ట్…కానీ షరతులు ఇవే..!

by Anudeep

కోవిడ్-19 కరోనా కారణంగా యావత్ ప్రపంచం లాక్ డౌన్ చేసిన సంగతి తెలిసిందే..రోజు రోజుకి మహమ్మారి మరింతల విజృంభిస్తుండటం తో దిక్కు తోచని స్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయి.ఇలాంటి కఠిన సమయం లో బస్సు రవాణా ఎప్పుడు మొదలవుతుందో తెలియని స్థితి.అటు ప్రపంచం తో పాటు భారతవని కూడా లాక్ డౌన్ లో ఉండిపోంది.తిరిగి బస్సు రవాణా సంస్థ ఎప్పడు మొదలవుతుంది అనే దాని మీద అనిశ్చితి నెలకొంది.

పూర్తి స్థాయిలో కోలువుకోడానికి మరిన్ని నెలలు పట్టొచ్చు అని నిపుణులు భావిస్తున్నారు.అయితే అసోం రాష్ర్ట్రంలో మాత్రం మళ్ళీ బస్సులు రోడ్ బాట పట్టాయి.తోలి రోజు దాదాపు 12 600 మంది బస్సుల్లో తమ గమ్యాన్ని చేరుకోవచ్చు అని అక్కడి రవాణా శాఖ అంచనాలకి వచ్చింది.కానీ ఇక్కడ ఒక షరతు వర్తిస్తుంది ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు రాకపోకలు ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటది అక్కడి ప్రభుత్వం.

Image Source : ANI twitter

గువహటి నుంచి దాదాపుగా 1700 వేల బస్సులు ప్రజారవాణాకి సిద్ధంగా ఉన్నాయి.అందులో 551 బస్సులు బర్పేట 420 బస్సులు గోల్ పర 103 బస్సులు మోరీగావ్ 412 బస్సులు నాగావ్ 238 బస్సులు సొంటిపూర్ కు ప్రయాణం అవుతాయని ప్రకటించింది.కానీ రెడ్ జోన్ పరిధిలోని ప్రాంతాల్లో ప్రజలు ఎక్కడకి వెళ్లకుండా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటుంది.దేశంలో అతి తక్కువ కరోనా కేసులు నమోదు అయ్యాయి ఇప్పటి దాకా కేవలం 36 మాత్రమే నమోదుకాగా వీరిలో 19 మంది కరోనా నుంచి కోలుకున్నారు..ఒకళ్ళు చనిపోయారు

You may also like