Home Information ప్రస్తుత బర్డ్ ఫ్లూ నేపథ్యం లో మాంసం,గుడ్లు తినడం ఎంత వరకు సురక్షితం ? తప్పక తెలుసుకోండి !

ప్రస్తుత బర్డ్ ఫ్లూ నేపథ్యం లో మాంసం,గుడ్లు తినడం ఎంత వరకు సురక్షితం ? తప్పక తెలుసుకోండి !

by Anudeep

Ads

కొవిడ్ 19 నుంచి ఇంకా దేశం ఇంకా కోలుకోకముందే మరో వైరస్ విజృంభణ మొదలయ్యింది.మధ్యప్రదేశ్, కేరళ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ వంటి వివిధ భారతీయ రాష్ట్రాలు బర్డ్ ఫ్లూ కేసులను వస్తున్నట్టు నిర్ధారింపబడింది.గుజరాత్ లోని జనగ్ లో ఇటీవలే ఈ వైరస్ భారిన పడ్డ 53పక్షులు చనిపోయాయి.అలాగే రాజస్థాన్‌లో 170 కి పైగా పక్షులు చనిపోయినట్లు తెలిసింది.మరో వైపు కేరళలో లోని రెండు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వార్తలు రావటంతో అక్కడి అధికారులు హై అలెర్ట్ ప్రకటించారు.అంతే కాదు హిమాచల్ ప్రదేశ్‌లో సుమారు 1,800 వలస పక్షులు చనిపోయాయి.అసలు బర్డ్ ఫ్లూ అంటే హెచ్ 5 ఎన్ 1 వైరస్ వల్ల కలిగే వైరల్ వ్యాధి.ఒక్కసారిగా ఈ వ్యాధి గురించి వార్తలు రావటంతో దేశంలోని పలు పౌల్ట్రీల్లో ఉత్పత్తుల అమ్మకాలను నిషేధించారు. కానీ,ఇది ఎంతవరకు సురక్షితం ? ఇది బర్డ్ ఫ్లూ భారిన పడకుండా కాపాడుతుందా ?మరి ఇలాంటి సమయంలో మాంసం,గ్రుడ్డు తినడం ఎంతవరకు సేఫ్ ? తెలుసుకుందాం

Video Advertisement

WHO నివేదిక ప్రకారం “చికెన్ మరియు ఇతర పౌల్ట్రీల నుంచి వచ్చే ఏదైనా సరిగ్గా వండుకుంటే తినడానికి సురక్షితమే. కానీ పొరపాటున వైరస్ ఉన్న మాంసం కానీ,గ్రుడ్డు కానీ మీకు వచ్చినట్టు అయితే 165 F (74 C) యొక్క అంతర్గత ఉష్ణోగ్రతకు సరిగ్గా ఉడికించకపోతే, కోడి మరియు గుడ్లు తిన్న తరువాత ప్రాణాంతక పక్షుల ఫ్లూ సంక్రమించే ప్రమాదం ఉంది.మీరు గుడ్ల నుండి వైరస్ సంక్రమించకూడదనుకుంటే వాటిని ఆ ఉష్ణోగ్రతలు వరకు కచ్చితంగా వాటిని ఉడికించాలి.అలాగే, వాటిని వధించే ప్రక్రియలో కూడా హెచ్ 5 ఎన్ 1 వైరస్ వ్యాప్తి చెందుతుంది. కాబట్టి, ఈ ప్రక్రియలో పాల్గొన్న వ్యక్తి అదనపు జాగ్రత్తగా ఉండాలి.కొన్ని పరిస్థితులలో పౌల్ట్రీ తినడం సురక్షితం అని మేము చెప్పగలం, అయితే వ్యాధి వచ్చే ప్రమాదం లేకుండా ఉండటానికి కనీసం కొంతకాలం దాని నుండి దూరంగా ఉండాలని మేము సూచిస్తున్నాము
ఈ న్యూస్ ని ఇండియా.కామ్ నుంచి సేకరించడమైనది

 

 


End of Article

You may also like