పాతికేళ్ళు గా ఆమె గొంతులో ఈల ఉన్న విషయం ఆమెకు తెలియదు.. చివరకు ఏమి జరిగిందంటే..?

పాతికేళ్ళు గా ఆమె గొంతులో ఈల ఉన్న విషయం ఆమెకు తెలియదు.. చివరకు ఏమి జరిగిందంటే..?

by Anudeep

Ads

ఒక్కోసారి మనం చేసే పొరపాట్లు మనకు జీవితకాలం పాటు శిక్షను విధిస్తుంటాయి. కొన్నిటిని సరిచేసుకోవచ్చు. కొన్నిటిని సరిచేసుకోలేకపోతాము. ముఖ్యం గా చిన్నపిల్లలలు ఆడుకునేటప్పుడు వారిని కనిపెట్టుకుని ఉండాలి. వారి శరీరానికి ఏమైనా జరిగితే.. ఆ బాధ వారు జీవితాంతం పడాల్సి వస్తుంది. ఇలాంటి ఘటనే ఒక అమ్మాయి విషయం లో జరిగింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Video Advertisement

whistle feature

ఒకమ్మాయి.. పదిహేనేళ్ల వయసు లో పొరపాటున ఈలను మింగేసింది. ఆ తరువాత దాదాపు రెండు దశాబ్దాల పాటు ఆమె దగ్గుతో ఇబ్బంది పడింది. దాదాపు పాతికేళ్ళు ఆమెను దగ్గు, ఉబ్బసం వంటి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టాయి. కేరళలో కన్నూరు జిల్లాలోని మత్తన్నూరు కు చెందిన ఓ అమ్మాయి విషయం లో ఇలా జరిగింది. ఇప్పుడామెకు నలభై ఏళ్ళు. దాదాపు పాతికేళ్ళకు పైగా ఆమె ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడింది.

women swallowed whistel

డాక్టర్లు రకరకాల పరీక్షలు చేసి.. చివరికి ఆమె గొంతు లో ఏదో ఉందన్న విషయాన్నీ గుర్తించారు. స్కాన్ చేయగా.. ఆమె గొంతులో విజిల్ ఇరుక్కుందన్న విషయం తెలిసింది. పాతికేళ్ళు గా ఆమెకు ఈ విషయం తెలియనే లేదట. శ్వాస నాళం నుంచి ఊపిరితిత్తులకు వెళ్లే మార్గం లో ఈ విజిల్ చిక్కుకుంది. ఓ ప్రైవేట్ క్లినిక్ లో ఆమె చూపించుకుంది. వారు ఆమెను ప్రభుత్వాసుపత్రికి పంపించారు.

whistle removed by docs

అక్కడి వైద్యులు డాక్టర్ పద్మనాభన్, డాక్టర్ రాజీవ్ రామ్ ఆమెకు శస్త్ర చికిత్స చేసి ఆ విజిల్ ను తొలగించారు. మొదట్లో ఆమెకు కొంచం ఉబ్బసం ఉన్నట్లు అనిపించేది. క్రమం గా ఆమె కోలుకుంది. ఇప్పుడు ఆమెకు ఏ ఆరోగ్య సమస్యలు లేవు. ఈ విషయం గురించి మాట్లాడుతూ.. తానూ మంచినీళ్లు తాగుతున్నా సరే.. గొంతులో ఎదో తగులుతున్నట్లు అనిపించేది అని, కానీ అదేంటో తెలిసేది కాదని ఆ మహిళ చెప్పుకొచ్చింది.


End of Article

You may also like