భారత్ లో అందరికి వాక్సిన్ లు వేయడం ఎప్పటికి పూర్తవుతుందంటే..?

భారత్ లో అందరికి వాక్సిన్ లు వేయడం ఎప్పటికి పూర్తవుతుందంటే..?

by Anudeep

Ads

ప్రస్తుతం ఎక్కడ చూసినా.. కరోనా గురించే డిస్కషన్. వాక్సిన్ అందుబాటులో లేకపోవడం తో ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. మరికొన్ని చోట్ల వాక్సిన్ వేయించుకోవడానికి కూడా కొందరు ముందుకు రావడం లేదు. మరో వైపు ప్రతిపక్షాలు వ్యాక్సినేషన్ విషయమై కేంద్రం పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమం లో కేంద్రమంత్రి జవదేకర్ వ్యాక్సినేషన్ గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. కేంద్ర మంత్రి జవదేకర్ తన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీని విమర్శించారు మరియు ఈ ఏడాది డిసెంబర్ నాటికి భారతదేశం కనీసం 108 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇస్తుందని గమనించాలని అన్నారు.

Video Advertisement

vaccination in india

డిసెంబరులోగా దేశం 216 కోట్ల మోతాదులో కోవిడ్ -19 వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గత వారం స్పష్టం చేసింది. అంటే కనీసం 108 కోట్ల మంది ప్రజలు తమ వాక్సిన్ ను పొందగలుగుతారు. కాబట్టి, డిసెంబర్ 2021 నాటికి భారతదేశం లో ప్రజలకు టీకాలు వేయడం పూర్తవుతుందని రాహుల్ గాంధీ అర్థం చేసుకోవాలి ”అని జవదేకర్ విలేకరుల సమావేశంలో అన్నారు.


End of Article

You may also like