పెట్రోల్ ధర 100 కొట్టినా… అతను మాత్రం రోజుకి రూ.10 లతో రోడ్డుపై తిరిగేస్తున్నారు.! ఎలాగో తెలుసా.?

పెట్రోల్ ధర 100 కొట్టినా… అతను మాత్రం రోజుకి రూ.10 లతో రోడ్డుపై తిరిగేస్తున్నారు.! ఎలాగో తెలుసా.?

by Anudeep

Ads

రోజు రోజుకు పెట్రోల్ ఖర్చు ఎంత పెరుగుతుందో చూస్తూనే ఉన్నాం. కానీ.. జనగాం లో నివసించే కూరపాటి విద్యా సాగర్ కి మాత్రం అవేమి పట్టడం లేదు. రోజుకు పది రూపాయల ఖర్చుతో ధూమ్ ధామ్ గా తిరిగేస్తున్నారు. అదెలా అంటే.. పెట్రోల్ వాహనాలు.. పెట్రోల్ అవసరం లేకుండా బాటరీ తోనే నడిచే ప్రత్యామ్నాయాన్ని విద్యాసాగర్ కనుక్కున్నాడు. ఆ ప్రయోగం తన బండి పైనే చేసుకుని ఇప్పుడు ఎంచక్కా బాటరీ ఛార్జ్ చేసుకుని చక్కర్లు కొట్టేస్తున్నారు.

Video Advertisement

battery bike

విద్యాసాగర్ తన బైక్ కి నాలుగు 30ఏహెచ్ బ్యాటరీ లను అమర్చుకున్నాడు. ఇలా తన బండి కి బాటరీ ని కొని అమర్చుకోవడానికి అతనికి 7500 ల రూపాయలు ఖర్చు అయిందట. కానీ.. ఇలా అరెంజ్ చేసుకున్నప్పటినుంచి ఒక్కసారి ఛార్జ్ చేసుకుంటే 50 కిలోమీటర్ల మైలేజి ఇస్తోంది. ఇలా ఒకసారి ఛార్జ్ చేసుకోవడానికి ఒక యూనిట్ విద్యుత్ మాత్రమే అవసరం అవుతుందట. గతం లో బండిపైన తిరగాలంటే.. రోజుకు 200 ల రూపాయలు ఖర్చు అయ్యేదని.. ఇప్పుడు పది రూపాయల కరెంటు సరిపోతుందని చెబుతున్నాడు. ఐడియా అదుర్స్ కదా..


End of Article

You may also like