ఇప్పటికే అమ్మా నాన్న ను పోగొట్టుకున్నా.. ఇప్పుడు అన్నని కూడా.. ఇక మీరే దిక్కు..! వెంటనే స్పందించిన సోనూసూద్.. అసలేం జరిగిందంటే..?

ఇప్పటికే అమ్మా నాన్న ను పోగొట్టుకున్నా.. ఇప్పుడు అన్నని కూడా.. ఇక మీరే దిక్కు..! వెంటనే స్పందించిన సోనూసూద్.. అసలేం జరిగిందంటే..?

by Anudeep

Ads

కరోనా మహమ్మారి మానవ జీవితం లో ఎంత ఇబ్బందికర పరిణామాలను తీసుకొస్తోందో తెలుస్తూనే ఉంది. తాజాగా.. ఓ ఘటన మనసుని కలిచివేస్తుంది. తల్లితండ్రులను పోగొట్టుకున్న ఓ వ్యక్తి తన అన్న పరిస్థితి కూడా విషమించడం తో.. ఆందోళన చెందుతున్నాడు. సోనూసూద్ ని సాయం అడగడం తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సోనూసూద్ కూడా వెంటనే స్పందించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు.

Video Advertisement

sonusood

వివరాల్లోకి వెళితే, 44 సంవత్సరాల హితేష్ శర్మ కరోనా బారిన పడి నోయిడా లోని ఓ ఆసుపత్రి లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే.. పరిస్థితి విషమించింది. తన తల్లితండ్రులు మృతి చెందారన్న విషయం కూడా హితేష్ కు తెలియదు. లంగ్స్ మార్పిడి తప్ప మరో అవకాశం లేదని డాక్టర్లు తేల్చేసారు. అయితే.. ఇందుకోసం రూ .1,50,00,000 (ఒక కోటి యాభై లక్షలు) అవసరం అవుతాయని తేలింది. దీనితో హితేష్ భార్య క్రౌడ్ ఫండింగ్ ను ప్రారంభించారు. కానీ, అవసరమైన మొత్తం కలెక్ట్ కాలేదు. దీనితో హితేష్ సోదరుడు ట్విట్టర్ ద్వారా సోనూసూద్ ని ఆశ్రయించారు. తక్షణమే స్పందించిన సోనూసూద్ ఎయిర్ అంబులెన్స్ సాయం తో హితేష్ ను హైదరాబాద్ కు తరలించనున్నారు. కాగా.. ఆపరేషన్ కు అయ్యే ఖర్చుని కూడా ఆయనే భరించనున్నారని సమాచారం. ఈ మేరకు ప్రతి ఒక్క భారతీయుడి ఆశీస్సులు కావాలని సోనూసూద్ ట్వీట్ చేసారు.


End of Article

You may also like