Ads
పుట్టింటికి వస్తున్నా అంటూ కూతురు ఫోన్ చేయడం తో తల్లితండ్రులు సంతోషించారు. అదే రోజు రాత్రి ఆమె ఆత్మహత్య చేసుకుందంటూ అత్తింటివారు ఫోన్ చేయడం తో వారు షాకయ్యారు. వివరాల్లోకి వెళ్తే ఢిల్లీ కి చెందిన భారతి మాట్రిమోనీ ప్రొఫైల్ చూసి సులభ్ అనే వ్యక్తిని 2017 లో పెళ్లి చేసుకుంది. ఆస్తి పాస్తుల గురించి తల్లి తండ్రులు కూడా ఆరా తీశారు.. మాకు ఆయిల్ మిల్లులు ఉన్నాయంటూ సులభ్ కుటుంబం అబద్ధమాడింది.
Video Advertisement
అవన్నీ నమ్మి.. పెళ్లి జరిపించేసారు. పెళ్ళై కొన్ని రోజుల వరకు సులభ్ భార్యను బాగానే చూసుకున్నాడు. ఆ తరువాతే అసలు కథ మొదలైంది. అందరి వద్దా అప్పులు చేసి.. ఆ అప్పులు తీర్చాలి అంటూ భార్యను వేధించేవాడు. పుట్టింటికి వెళ్లి డబ్బులు తెమ్మనేవాడు. ఈ విషయమై వారిద్దరికీ చాలా సార్లు గొడవలు అయ్యాయి. మొన్న రక్షణబంధం కు బట్టలు అన్ని సర్దుకున్న భారతి పుట్టింటికి వస్తున్నా అంటూ ఫోన్ చేసి చెప్పింది.
ఆరోజు రాత్రే ఆమె అనుమానాస్పదం గా మృతి చెందింది. ఆమె అత్తింటివారు ఆమె ఆత్మహత్య చేసుకుంది అంటూ పుట్టింటివారికి చెపుతున్నారు. భారతి పుట్టింటి వారు మాత్రం తమ కూతురు ఆత్మహత్య చేసుకోలేదని.. వీరు అన్ని అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకున్నారని.. తీరా పరిస్థితి మారేసరికి హత్య చేసి ఆత్మహత్య గా చిత్రీకరిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు.
End of Article