Ads
ఒక్క పెళ్లి కోసం వెయ్యి అబద్ధాలు ఆడొచ్చు అంటారు.. కానీ ఆ అబద్ధాల వలన వాళ్ళ సంసారం ఏమవుతుంది అన్న సంగతి మాత్రం ఎవరూ చెప్పరు. ఓ అబ్బాయి తల్లి తండ్రులు అతనికి ఉన్న ఆరోగ్య సమస్యల్ని దాచి పెట్టి పెళ్లి చేసారు. ఏడాది తిరిగేసరికి అతను చనిపోవడం తో ఆ అమ్మాయి జీవితమే తలక్రిందులైంది. ఈ ఘటన నెల్లూరు లో చోటు చేసుకుంది.
Video Advertisement
వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా ధనలక్ష్మి పురానికి చెందిన విజయేంద్ర రెడ్డి అనే అబ్బాయికి చిత్తూరు జిల్లాకు చెందిన ఊహ రెడ్డి తో పెద్దలు వివాహం నిశ్చయించారు. అంతా బాగానే ఉంది అనుకుని పెళ్లి చేశారు. తీరా పెళ్లి అయ్యాక ఆ అబ్బాయికి ఉన్న అనారోగ్య సమస్యలు బయటపడ్డాయి. ఆ అమ్మాయి కన్న కలలన్ని కల్లలయ్యాయి. భర్త కు కిడ్నీ సమస్యలు ఉన్నాయి అన్న విషయం చెప్పకుండా పెళ్లి చేసేసారు.
అయినా సరే, ఆ బాధను దాచిపెట్టుకుని కాపురం చేసింది. ఈ క్రమం లో అతని ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఇటీవలే అతను బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడి కాలు, చెయ్యి పోగొట్టుకున్నాడు. ఆ బాధని భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటికి ఊహ రెడ్డి ఆరునెలల గర్భం తో ఉంది. ఒక్క అబద్ధం వల్ల తన జీవితం నాశనమైందని ఆమె కన్నీరు మున్నీరవుతోంది.
తాజాగా, ఆమె పండంటి ఆడబిడ్డను ప్రసవించింది. తనకు న్యాయం చెయ్యాలంటూ.. ఆమె అత్తవారింటికి వెళితే.. వారు ఆమెను ఆదుకోవాల్సింది పోయి ఆమె పై కర్రలతో దాడి చేసారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఆ అమ్మాయి పరిస్థితి ని చూసి నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తున్నారు.
End of Article