ఆ ఒక్క అబద్ధం.. ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది.. న్యాయం చెయ్యమని అడిగితె చితక్కొట్టిన అత్తింటివారు..అసలేమైందంటే..?

ఆ ఒక్క అబద్ధం.. ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది.. న్యాయం చెయ్యమని అడిగితె చితక్కొట్టిన అత్తింటివారు..అసలేమైందంటే..?

by Anudeep

Ads

ఒక్క పెళ్లి కోసం వెయ్యి అబద్ధాలు ఆడొచ్చు అంటారు.. కానీ ఆ అబద్ధాల వలన వాళ్ళ సంసారం ఏమవుతుంది అన్న సంగతి మాత్రం ఎవరూ చెప్పరు. ఓ అబ్బాయి తల్లి తండ్రులు అతనికి ఉన్న ఆరోగ్య సమస్యల్ని దాచి పెట్టి పెళ్లి చేసారు. ఏడాది తిరిగేసరికి అతను చనిపోవడం తో ఆ అమ్మాయి జీవితమే తలక్రిందులైంది. ఈ ఘటన నెల్లూరు లో చోటు చేసుకుంది.

Video Advertisement

uhha reddy 1

వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా ధనలక్ష్మి పురానికి చెందిన విజయేంద్ర రెడ్డి అనే అబ్బాయికి చిత్తూరు జిల్లాకు చెందిన ఊహ రెడ్డి తో పెద్దలు వివాహం నిశ్చయించారు. అంతా బాగానే ఉంది అనుకుని పెళ్లి చేశారు. తీరా పెళ్లి అయ్యాక ఆ అబ్బాయికి ఉన్న అనారోగ్య సమస్యలు బయటపడ్డాయి. ఆ అమ్మాయి కన్న కలలన్ని కల్లలయ్యాయి. భర్త కు కిడ్నీ సమస్యలు ఉన్నాయి అన్న విషయం చెప్పకుండా పెళ్లి చేసేసారు.

uha reddy 2

అయినా సరే, ఆ బాధను దాచిపెట్టుకుని కాపురం చేసింది. ఈ క్రమం లో అతని ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఇటీవలే అతను బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడి కాలు, చెయ్యి పోగొట్టుకున్నాడు. ఆ బాధని భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటికి ఊహ రెడ్డి ఆరునెలల గర్భం తో ఉంది. ఒక్క అబద్ధం వల్ల తన జీవితం నాశనమైందని ఆమె కన్నీరు మున్నీరవుతోంది.

uha reddy 1

తాజాగా, ఆమె పండంటి ఆడబిడ్డను ప్రసవించింది. తనకు న్యాయం చెయ్యాలంటూ.. ఆమె అత్తవారింటికి వెళితే.. వారు ఆమెను ఆదుకోవాల్సింది పోయి ఆమె పై కర్రలతో దాడి చేసారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఆ అమ్మాయి పరిస్థితి ని చూసి నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తున్నారు.


End of Article

You may also like