Ads
జీవితంలో ఉన్నత చదువులు చదవాలన్నా.. ఉన్నతమైన స్థానంలో ఉద్యోగం పొందాలన్నా పరీక్షలు తప్పనిసరి. మనం పరీక్షలు రాసి, మంచి మార్కులు తెచ్చుకుంటే.. మన ప్రతిభకు తగ్గ స్థానం లభిస్తుంది. అయితే.. పరీక్షకు హాజరు అవ్వడానికి ముందు కొన్ని విషయాలను కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. మనం తీసుకెళ్లాల్సిన హాల్ టికెట్, మన వస్త్ర ధారణ, మనతో పాటు తీసుకెళ్లే వాచ్, కాలిక్యులేటర్ లాంటివి అనుమతిస్తారో..లేదో ముందే తెలుసుకుని అందుకు తగ్గట్లుగా ప్రిపేర్ అయ్యి వెళ్లాల్సి ఉంటుంది.
Video Advertisement
ఇవేమి పట్టించుకోకుండా వెళ్తే.. ఎగ్జామ్ హాల్ కి వెళ్ళాక ఇక్కట్లు తప్పవు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. పరీక్ష సమయానికి కనీసం అరగంట ముందే వెళ్లడం మంచిది. ఎందుకంటే.. దారిలో ట్రాఫిక్ ఇబ్బందులు రావచ్చు.. లేక అక్కడికి వెళ్ళాక మరేదైనా సమస్య ఎదురవ్వచ్చు. వీటిని ఎదుర్కోవాలంటే ముందు మనకు సమయం కావాలి. లేదంటే ఈ అమ్మాయిలా ఇబ్బంది పడక తప్పదు. అస్సాంకు చెందిన 19 ఏళ్ల జూబ్లీ అనే విద్యార్థిని తేజ్పుర్లోని గిరిజానంద చౌదరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కాలేజీలో ఏఏయూ పరీక్ష రాయడం కోసం తన తండ్రితో పాటు కలిసి వెళ్ళింది.
ఆమె సమయానికే వెళ్ళింది.. కానీ ఆమె షార్ట్స్ ధరించి ఉంది. షార్ట్స్ ను ధరించి ఉన్నప్పటికీ.. సెక్యూరిటీ గార్డ్ ఆమెను లోపలకి అనుమతించడంతో ఆమెకు ఏ అనుమానం రాలేదు. కానీ.. ఎగ్జామ్ రూమ్ లోకి వెళ్తున్న టైంలో ఇన్విజిలేటర్ అడ్డుకున్నారు. షార్ట్స్ ధరిస్తే.. పరీక్షకు అనుమతించేది లేదని తేల్చి చెప్పడంతో.. చేసేది లేక ఆమె ఏడ్చుకుంటూ బయటకు వచ్చి తన తండ్రికి జరిగింది చెప్పింది. దీనితో ఆ తండ్రి వారిని ఎంతో ప్రాధేయపడ్డాడు.
చివరకు వారు ప్యాంటు ధరిస్తే తప్ప ఎగ్జామ్ కు అనుమతించేది లేదన్నారు. అప్పటికప్పుడు ఆ తండ్రి 8 కిలోమీటర్ల దూరం వెళ్లి ఓ ట్రూజర్ ను కొనుక్కొచ్చారు. ఆ లోపలే.. కిటికీలకు ఉన్న కర్టైన్ లను తొలగించి.. ఆమె కాళ్లకు చుట్టి పరీక్ష రాయించారు. బయటకు వచ్చిన తరువాత ఆ అమ్మాయి తన వేదనను మీడియాతో పంచుకుంది. గతంలో నీట్ పరీక్షకు ఇలానే వెళ్లానని.. వాళ్ళు ఏమి అభ్యంతరం పెట్టలేదని తెలిపింది. ఏఏయు సైతం నోటిఫికేషన్ లో డ్రెస్ కోడ్ ను పెట్టలేదని.. తనకు ఎలా తెలుస్తుంది? అని ప్రశ్నించింది. ఈ యాజమాన్యం డ్రెస్ పై పెట్టిన శ్రద్ధ కోవిడ్ నిబంధనలు పాటించడంలో పెట్టలేదని.. మాస్క్, టెంపరేచర్ వంటివి చెక్ చేయడం లేదని ఆవేదన చెందింది.
End of Article