Home Filmy Adda ఎట్టకేలకి “గుడ్ న్యూస్” చెప్పిన మంచు విష్ణు.! విషయం ఏంటంటే.?

ఎట్టకేలకి “గుడ్ న్యూస్” చెప్పిన మంచు విష్ణు.! విషయం ఏంటంటే.?

by Mohana Priya

రెండు రోజుల క్రితం గుడ్ న్యూస్ చెప్తాను అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మంచు విష్ణు, ఎట్టకేలకు ఆ విషయం గురించి చెప్పారు. మా అసోసియేషన్ లో ఈసారి మహిళలకి పెద్దపీట వేసినట్లు విష్ణు తెలిపారు. అందుకోసం ఒక కమిటీ నిర్మించినట్టు, సామాజిక కార్యకర్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత, సునీత కృష్ణన్ ఈ కమిటీకి గౌరవ సలహాదారుగా ఉంటారు అని చెప్పారు.

manchu vishnu ali tho saradaga

“ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ గ్రీవెన్స్ సెల్ అనే పేరుతో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో నలుగురు ఆడ వాళ్ళు, ఇద్దరు మగ వాళ్ళు ఉంటారు. భవిష్యత్తులో ఈ కమిటీలో ఇంకా సభ్యులు చేరుతూ ఉంటారు. ఈ కమిటీ యొక్క మొదటి లక్ష్యం “మా” కుటుంబాన్ని కాపాడడం అని, ఆడవాళ్లు ఇంకా శక్తివంతంగా ఉండాలి” అని మంచు విష్ణు తన ట్వీట్ లో పేర్కొన్నారు.

You may also like