Ads
ఇటీవల ఆత్మహత్యలు ఎక్కువ అవుతున్నాయి. చిన్న వయసులోనే.. క్షణికావేశాలకు ప్రాణాలు బలిచ్చేస్తున్నారు. తాజాగా.. బోయినపల్లి గ్రామానికి చెందిన 14 సంవత్సరాల సాభావత్ శిల్ప అనే బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఆమె మూడు చింతలపల్లి మండలం పోతారం గ్రామంలో కూరగాయల తోటలో కూలి గా పనిచేస్తూ ఆమె జీవిస్తోంది. ఈ క్రమం లో ఆమెకు మధు అనే అబ్బాయి తో పరిచయం అయింది. వీరిద్దరి మధ్య స్నేహం ఫోన్ నంబర్లు మార్చుకునే వరకు వచ్చింది. ఇద్దరు చాటింగ్ లు.. ఫోన్ లో ముచ్చట్లు చెప్పుకునేవారు.
Video Advertisement
అయితే.. తమ స్నేహం గోప్యం గానే ఉంచాలని శిల్ప మధుని కోరింది. అందుకు మధు కూడా ఒప్పుకున్నాడు. వీరిద్దరూ మధు ఫోన్ లో ఫోటోలు దిగేవారు. కానీ.. అవి ఎవ్వరికి చూపించేవారు కాదు. ప్రతి రోజూ రొమాంటిక్ లవ్ సాంగ్స్ స్టేటస్ గా పెట్టె మధు ఓ రోజూ శిల్ప ఫోటో ను స్టేటస్ లో షేర్ చేసాడు. అది చూసి శిల్ప షాక్ అయింది. తన కాంటాక్ట్స్ లో అందరు చూస్తారని.. ఈ అమ్మాయి ఎవరు అంటూ అడుగుతారని శిల్ప బాధపడింది. మధు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా.. శిల్ప వినిపించుకోలేదు. క్షణికావేశం లో తోటలోని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. శిల్ప ఆత్మహత్య కు మధునే కారణం అంటూ శిల్ప తల్లి జయమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
End of Article