Ads
పెళ్లి చెప్పుకోవడానికి వేడుకే అయినా.. దాని వెనక బోలెడంత కష్టం, ఖర్చు ఉంటాయి. అలాంటి వేడుక ఉన్నట్లుండి ఆగిపోతే.. ఎవరికైనా మనసు కలుక్కుమంటుంది. సరైన కారణం ఉంటె అది వేరే సంగతి. కానీ.. ఓ పెళ్లి చాలా విచిత్రమైన పరిస్థితుల్లో ఆగిపోయింది. ఉత్తరప్రదేశ్ లోని మహోబా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Video Advertisement
మాయ అనే అమ్మాయికి.. మహోబాకు చెందిన రంజిత్ తో పెద్దలు వివాహం నిశ్చయించారు. పెళ్లి సమయం దగ్గరపడింది. అందరు పెళ్లి వేదిక కి చేరుకున్నారు. అయితే.. పెళ్ళిలో వరుడు రంజిత్ ప్రవర్తనను చూసేసరికి పెళ్లికూతురు మాయకి అనుమానం కలిగింది. దీనితో.. ఆమె వరుడిని రెండో ఎక్కం చెప్పాలని కోరింది. అతని నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడం తో.. కనీసం రెండో ఎక్కం కూడా చెప్పడం రాని వ్యక్తిని పెళ్లి చేసుకోనని.. ఆమె లేచి వెళ్ళిపోయింది. ఇలా పెళ్లి చేయడానికి అయినా ఖర్చు వరుడు కుటుంబం వారే చెల్లించాలని.. ఆమె పోలీసులని ఆశ్రయించింది.
End of Article