Ads
ఆన్ లైన్ వ్యాపారాలు వచ్చాక మనం చాలా వరకు ఆన్ లైన్ లోనే కొనుగోలు చేస్తున్నాం. అయితే.. కొన్ని కొన్ని సార్లు మనం ఆర్డర్ చేసినవి కాకుండా వేరేవి వస్తూ ఉంటాయి. అలాంటివి మనకు నచ్చకపోతే రిటర్న్ పెట్టడం లాంటివి చేసేస్తుంటాం. మరి మనం ఆర్డర్ పెట్టినవాటికంటే ఖరీదైనవి వస్తేనో..? అలా ఎప్పుడు జరగలేదు కదా.. కానీ ఓ వ్యక్తికి అలానే జరిగింది. అతను మౌత్ వాష్ ఆర్డర్ పెడితే.. అతనికి ఖరీదైన రెడ్ మీ నోట్ 10 వచ్చింది. అతను సైలెంట్ గా తీసేసుకోలేదు.. నిజాయితీ గా అమెజాన్ కి మెయిల్ రాసి ట్విట్టర్ లో ట్వీట్ చేసాడు.
Video Advertisement
ఇప్పుడు ఆ ట్వీట్ వైరల్ అవుతోంది. “నేను మౌత్ వాష్ ఆర్డర్ చేస్తే మొబైల్ వచ్చింది. పార్సెల్ పైన నా పేరే ఉన్నప్పటికీ.. లోపల ఉన్న ఇన్వాయిస్ వేరే వారి పేరు పైన ఉన్నది. నేను కొన్నది ఎసెన్షియల్ వస్తువు కావడం తో రిటర్న్ పెట్టడానికి అవకాశం లేదు.. అందుకే మెయిల్ చేశా.. దయచేసి ఇది రిటర్న్ తీసుకుని.. ఆర్డర్ పెట్టినవారికి ఇవ్వాలని కోరుతున్నా..” అంటూ సదరు వ్యక్తి చేసిన ట్వీట్ క్షణాల్లో వైరల్ అయింది. వందలాది మంది నెటిజన్లు అతని నిజాయితీని ప్రశంసిస్తున్నారు.
End of Article