Ads
ఆంధ్రా కమల్ హాసన్ గా పేరు తెచ్చుకున్న నరసింహ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పూర్తి పేరు వేటుకూరి నరసింహ రాజు. వెస్ట్ గోదావరి జిల్లాలో జన్మించగా… ఆయన తండ్రి ఎంతో దానగుణం కలిగిన వారు. దీంతో మెల్లగా చెన్నైకి చేరుకున్న నరసింహ రాజు, నటన మీద ఆసక్తితో సినీ రంగంలోకి ప్రవేశించారు.
Video Advertisement
ఇవి కూడా చదవండి:“అలీ” కూతురికి కాబోయే భర్త ఎవరో తెలుసా..? అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే..?
ఈ తరుణంలో ఒకరోజు విఠలాచార్య డైరెక్టర్ కు పరిచయమయ్యారు. అలా ఆయన దర్శకత్వం వహించిన జగన్మోహినీ సినిమాలో మెయిన్ లీడ్ గా నరసింహ రాజు కీలక పాత్రను పోషించారు. ఇక అక్కడి నుంచి నరసింహ రాజు వెనక్కి తిరిగి చూసే అవసరం లేకపోయింది. దాని తర్వాత పున్నమి నాగు, నీడ లేని ఆడది, తూర్పు పడమర, ఇలా దాదాపు 110 సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో నటించి జానపద హీరో అని పేరు తెచ్చుకున్నాడు.
తరువాత కాలంలో తండ్రి, బాబాయి, నాన్న పాత్రల్లో కూడా నటించారు. ఇక వెండితెరలో అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో… బుల్లి తెర, టీవీ సీరియల్స్ లో కూడా నటించారు. అయితే ఇన్ని సినిమాలు చేసినప్పటికీ నరసింహ రాజుకి ఆస్తి అంతగా లేకపోవడంతో… అతని కొడుకు అయినా సినీ పరిశరమలోకి ప్రవేశించి బాగా సంపాదించాలి అనుకున్నాడు. కానీ తండ్రి వొద్దు అండంతో కెనేడాకి వెళ్లి, బ్యాంక్ ఆఫ్ మొనిట్రీల్ లో ప్రాజెక్ట్ డైరెక్టర్ గా స్థిరపడ్డాడు. మరోవైపు నరసింహ రాజు కూతురు వివిధ కళాశాలకు హెచ్ఆర్ గా వ్యహరిస్తున్నారు.
ఇక తన పిల్లలతో, చక్కని జీవితాన్ని గడుపుతూ ఉంటారు నరసింహ రాజు. అటు కేనేడాలో 10 ఎకరాల గార్డెన్, 2 ప్యాలెస్ లు ఉండగా… వేసవి కాల సెలవులకి తన కొడుకు దగ్గరకి వెళ్లి సంతోషంగా కాలాన్ని గడుపుతారు నరసింహ రాజు.
ఇవి కూడా చదవండి:“గిడుగు రామ మూర్తి ” ఎవరో తెలుసా…? ఆయన జయంతిని “తెలుగు భాష దినోత్సవం”గా ఎందుకు జరుపుకుంటారు? అసలు కారణం ఇదే!
End of Article