మొదటి సినిమా రిలీజ్… కానీ అప్పుడే..? అసలు ఏం జరిగిందంటే..?

మొదటి సినిమా రిలీజ్… కానీ అప్పుడే..? అసలు ఏం జరిగిందంటే..?

by kavitha

Ads

కన్నడ యంగ్ హీరో, శాండిల్‌వుడ్ లెజెండరీ యాక్టర్ రాజ్‌కుమార్ బంధువు అయిన సూరజ్ కుమార్ యాక్సిడెంట్ కు  గురయ్యారు. జూన్ 24న (శనివారం) మైసూర్, ఊటీ మధ్య హైవే పై  బైక్​పై వెళుతుండగా బేగూర్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది.

Video Advertisement

సూరజ్ కుమార్ కు ధ్రువన్ అనే మరో పేరు కూడా ఉంది. ఆయన హీరోగా నటించిన మొదటి చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. ఇంతలోనే శనివారం రోడ్డు ప్రమాదానికి గురైన హీరో సూరజ్​ కుమార్​ రైట్ లెగ్ ను డాక్టర్లు తొలగించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
suraj-kumarప్రముఖ నిర్మాత ఎస్​ ఏ శ్రీనివాస్​ కుమారుడు సూరజ్​ కుమార్​.  24ఏళ్ల సూరజ్​, ధ్రువన్  గా కన్నడ ఆడియెన్స్ కి పరిచయం అయ్యారు. తారక్​, ఐరావత లాంటి చిత్రాలకు అసిస్టెంట్​ డైరక్టర్​గా సూరజ్ పనిచేశారు. అతను హీరోగా చేసిన తొలి ఇనిమా త్వరలోనే విడుదలకు సిద్ధం అయ్యింది. కానీ శనివారం మైసూరు-గుండ్లుపేట్ హైవేపై బైక్‌పై  సూరజ్ కుమార్ వెళ్తుండగా, ట్రాక్టర్​ను ఓవర్​టేక్​ చేయడం కోసం వేగంగా వెళ్తున్న క్రమంలో కంట్రోల్ తప్పి ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టాడు​.
యాక్సిడెంట్ జరిగిన వెంటనే సూరజ్ ను మైసూరు మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంలో ఆయన కుడికాలు బాగా నుజ్జునుజ్జవడంతో సూరజ్ ను కాపాడటం కోసం డాక్టర్లు ఆయన కుడికాలును తొలగించారని తెలుస్తోంది. 24 సంవత్సరాల సూరజ్ కుమార్, లెజెండరీ యాక్టర్ రాజ్‌కుమార్‌కు దగ్గరి బంధువు. ఆయన భార్యకు సూరజ్ మేనల్లుడు. యాక్సిడెంట్ జరిగిన విషయాన్ని తెలిసిన వెంటనే శాండిల్‌వుడ్ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్, మరియు ఆయన భార్య మణిపాల్ హాస్పిటల్‌ కు చేరుకుని సూరజ్‌ను పరామర్శించారు. సూరజ్‌ హెల్త్ కండిషన్  గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇక ధృవన్ ప్రస్తుతం హీరోగా  ‘రథ’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో ధృవన్ పక్కన హీరోయిన్ గా ప్రియా ప్రకాష్ వారియర్ నటిస్తున్నారు.

https://www.instagram.com/p/CqF5aUJvpcn/

Also Read: ఈ 10 సినిమాల్లో మొదటగా మనం ఒకరిని విలన్ అనుకుంటాము…కానీ క్లైమాక్స్ లో ట్విస్ట్.?


End of Article

You may also like