Ads
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్లలో ఒకరిగా రాణిస్తున్నారు. ఆయన తెరకెక్కించిన సినిమాలలో ఒక నటుడు దాదాపు ఆయన ప్రతి సినిమాలోనూ కనిపిస్తుంటాడు. ఆ నటుడి పేరు పమ్మి సాయి. అతడు నుండి అల వైకుంఠపురంలో వరకు త్రివిక్రమ్ సినిమాలలో నటించాడు.
Video Advertisement
సినిమాలలో నటించే అవకాశాల కోసం ఎంతోమంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటే పమ్మి సాయికి మాత్రం ఎలాంటి ప్రయత్నం చేయకుండానే, ప్రముఖ డైరెక్టర్ పరిచయం రూపంలో సినిమాలో నటించే అవకాశం వచ్చింది. పమ్మి సాయి అసలు పేరు శ్రీనివాస్ సాయిరామ్. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సొంతూరు భీమవరం అనే విషయం తెలిసిందే. పమ్మి సాయి ఊరు కూడా అదే కావడంతో అతనికి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చిన్నతనం నుండి పరిచయం ఉంది. పమ్మి సాయికి ఆ పరిచయాన్నితోనే సరదాగా మహేష్ బాబు నటించిన ‘అతడు’ మూవీలో త్రివిక్రమ్ మొదటి ఛాన్స్ ఇచ్చారు. ఆ విధంగా సరదాగా మొదలైన పమ్మి సాయి కెరీర్ ప్రస్తుతం కొనసాగుతోంది.
మొదటి ఛాన్స్ ఇచ్చి వదిలిపెట్టకుండా త్రివిక్రమ్ వరుసగా తన చిత్రాలన్నిటిలోనూ పమ్మి సాయికి మంచి పాత్రలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. ‘నువ్వే నువ్వే’ సినిమాలో తప్ప పమ్మీ సాయి త్రివిక్రమ్ దర్శకత్వం చేసిన అన్నిచిత్రాలలో నటించాడు. అలాగే ఇతర డైరక్టర్ల సినిమాలలో కూడా మంచి ఆఫర్స్ లభించాయి. అలా పమ్మి సాయి ఛలో, చల్ మోహనరంగా, శతమానం భవతి, ఎవరు లాంటి సుమారు 60 పైగా సినిమాలలో మంచి కామెడీ పాత్రలు చేశారు.
త్రివిక్రమ్ మూవీ చివరగా రిలీజ్ అయ్యి, సంచలన విజయాన్ని సాధించిన ‘అల వైకుంఠపురంలో పోషించిన పాత్రతో కూడా పమ్మి సాయికి మంచి పేరు తెచ్చింది. అల్లు అర్జున్, పూజా హెగ్డే పోలీస్ స్టేషన్ కి వెళ్ళినపుడు వచ్చే ఒక్క సన్నివేశంలో మాత్రమే కనిపించి నవ్వులు పూయించాడు.
Also Read: హాలీవుడ్ సినిమాని బాగా పొగుడుతున్నారు..! కానీ సైన్స్ మీద వచ్చిన మన సినిమా చూశారా..?
End of Article