“చాలా ఈజీగా హీరోయిన్ గా ఎదిగింది” అంటూ హీరోయిన్ పోస్ట్… ఆ డైరెక్టర్ కూతురుని టార్గెట్ చేసిందా?

“చాలా ఈజీగా హీరోయిన్ గా ఎదిగింది” అంటూ హీరోయిన్ పోస్ట్… ఆ డైరెక్టర్ కూతురుని టార్గెట్ చేసిందా?

by Anudeep

Ads

ఈమధ్య రీసెంట్ గా జరిగిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణం తరువాత బాలీవుడ్ లో నెపోటిజం సంచలనాన్ని సృష్టించడం మనందరికీ తెలిసిందే. ఎక్కువగా బాలీవుడ్ లో మాత్రమే వినిపించే ఈ నెపోటిజం అన్న పేరు ఇప్పుడు దక్షిణాదిలో సైతం సందడి చేస్తూ అక్కడక్కడ వినిపిస్తోంది. ఇదిలా ఉన్న నేపథ్యం లో తాజాగా సోషల్ మీడియాలో ఒక నటి చేసిన ట్వీట్ ఈ మధ్య అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ లో వైరల్ అయ్యి సందడి చేస్తుంది.

Video Advertisement

ప్రస్తుతం ఆ నటి చేసిన ట్వీట్ కోలీవుడ్ లో ప్రస్తుతం తీవ్ర చర్చకు దారి తీసి హడావుడి చేస్తోంది. ఆ నటి ట్వీట్ వివరాల్లోకి వెళ్తే “సౌకర్యం ఉన్నవాళ్లు నిచ్చెన ఎక్కేసి సులువైన మార్గంలో పైకి వెళ్లడం చూస్తే చాలా బాగుంటుంది కదా.మరి మిగతావాళ్ల సంగతేంటి” అన్నది దాని సారాంశం. అయితే ఆ ట్వీట్ డైరెక్టర్ శంకర్ కూతురు అతిథి శంకర్ ను టార్గెట్ చేస్తూ పోస్ట్ చేసిందా అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇటీవలె సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఈ నటి కోలీవుడ్‌ బంధుప్రీతి (నెపోటిజం) పై మొదట సారి నోరు విప్పారు. అంత ధైర్యం కనబరిచిన ఆ నటి ఎవరో కాదు “మిసాయి మురుకు” అనే కోలీవుడ్‌ సినిమా ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ పరిచయమైన ఆత్మిక. తన సినిమా మంచి హిట్ సాధించినప్పటికీ తనకు తగిన గుర్తింపు దక్కలేదు.

మరోపక్క కేవలం ఒకే సినిమా చేసినప్పటికీ అతిథి శంకర్ మాత్రం నటిగా మంచి ఆఫర్లు అందుకోవడమే కాకుండా సింగర్‌గా కూడా రాణించడం విశేషం. అందుకే ఆత్మిక పరోక్షంగా అతిథి శంకర్ ను టార్గెట్ చేసిందంటూ నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు.


End of Article

You may also like