Ads
రామాయణం ఆధారంగా తెరకెక్కిన పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్’. ఈ మూవీ జూన్ 16న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ లాంటి వివిధ భాషలలో 2డి మరియు 3డిలలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.
Video Advertisement
ఈ చిత్రం తొలి షో నుండే ఆడియెన్స్ మరియు క్రిటిక్స్ నుండి విమర్శలు వస్తున్నాయి. ఫస్ట్ డే బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టినప్పటికీ, వివాదాలు మాత్రం ఈ మూవీని వదలడం లేదు. తాజాగా ఓం రౌత్ హనుమంతుడి గురించి చేసిన పాత ట్వీట్ వైరల్ గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన ‘ఆదిపురుష్’ సినిమాలో ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్లు నటించారు. ఈ మూవీ రిలీజ్ కు ముందు డైరెక్టర్ ఓం రౌత్ ఆదిపురుష్ థియేటర్లలో హనుమంతుడికి కోసం ఒక సీటు కేటాయించాలని నిర్మాతలను, డిస్ట్రిబ్యూటర్లను కోరడం ద్వారా ఆదిపురుష్ మూవీ ప్రమోషన్లను మొదలుపెట్టారు. రామాయణ పారాయణం చేసినా, రాముడి కథను ప్రదర్శించినప్పుడు ఆ స్థలంలో హనుమంతుడు ఉంటాడని తన తల్లి చెప్పేదని, ఆ విషయాన్ని తాను బలంగా విశ్వసిస్తున్నట్లు చెప్పాడు.
ఓం రౌత్ చెప్పినట్లుగానే థియేటర్లలో హనుమంతుడి కోసం సీటును కేటాయించడం, ఆ సీటులో హనుమంతుడి ఫోటో పెట్టి పూజించడం తెలిసిందే. ఈ మూవీ రిలీజ్ అయినప్పటి నుండి విజువల్ ఎఫెక్ట్స్, పాత్రల వేషధారణను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓం రౌత్ 2015లో చేసిన ఒక ట్వీట్ వైరల్ గా మారింది.
ఓం రౌత్ ‘హనుమంతుడు చెవిటివాడా? నా బిల్డింగ్ చుట్టు ఉన్న వాళ్ళు హనుమాన్ జయంతి రోజు చాలా పెద్ద సౌండ్ పెట్టి మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. దానికి తోడు అన్నీ అసంబద్ధమైన పాటలు.” అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై ప్రస్తుతం నెటిజెన్లు మూవీ ప్రమోషన్ కోసం హనుమంతుడు కోసం ఒక సీటు రిజర్వ్ అని చెప్పిన ఓం రౌత్, అప్పుడేమో ఇలా అన్నాడని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: “అసలు ఈ 2 సీన్స్ ఏంటి…?” అంటూ… “ఆదిపురుష్” పై ట్రోల్స్..! అవి ఏంటంటే..?
End of Article