అర్ధరాత్రి లేపి అడిగినా చెప్పేస్తా… ఆరోజు ఏమి జరిగిందంటే.. ఎమోషనల్ అయిపోయిన అదితిరావు హైదరి..!

అర్ధరాత్రి లేపి అడిగినా చెప్పేస్తా… ఆరోజు ఏమి జరిగిందంటే.. ఎమోషనల్ అయిపోయిన అదితిరావు హైదరి..!

by Anudeep

Ads

అదితిరావు హైదరి అందరికి సుపరిచితురాలైన నటే. సమ్మోహనం సినిమాతో తెలుగువారిని అలరించిన ఈ బ్యూటీ “వి” సినిమాతో ప్రేక్షకులకు మరింత చేరువైన సంగతి తెలిసిందే. తెలుగులోనే కాదు మలయాళంలో కూడా ఈ బ్యూటీ సినిమాలు చేసింది. ప్రస్తుతం తెలుగులో “మహాసముద్రం” అనే సినిమాలో నటిస్తోంది.

Video Advertisement

adithi 1

శర్వానంద్, సిద్ధార్థ హీరోలుగా నటిస్తున్న ఈ మూవీ లో అదితి రావు, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా.. ఈ నెల 14 న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సందర్భం ఈ చిత్ర యూనిట్ ప్రస్తుతం ప్రమోషన్స్ పనిలో బిజీగా ఉంది. నటి అదితిరావు హైదరి కూడా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భం గా ఈ సినిమా షూటింగ్ టైంలో జరిగిన పలు ఆసక్తికర విషయాలను ఆమె పంచుకున్నారు.

adithi 2

తనకు ఛాలెంజింగ్ పాత్రలు అంటే చాలా ఇష్టమని ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చారు. అయితే.. తనకు తెలుగు అంతగా రాదనీ.. అయినా డైలాగ్స్ ను బట్టీపట్టి చెప్పేస్తూ ఉంటానని.. షూటింగ్ కి ముందే డైలాగ్స్ ను బాగా ప్రాక్టీస్ చేస్తానని చెప్పుకొచ్చారు. నిద్దర్లో లేపి అడిగినా ఏ డైలాగ్ ఏ పేజీ లోదో కూడా చెప్పేయగలనని చెప్పుకొచ్చారు.

adithi 3

డైలాగ్స్ ను బాగా ప్రాక్టీస్ చేసి షూటింగ్ జరుగుతున్నప్పుడు టైం వేస్ట్ అవ్వకుండా చూసుకుంటానని చెప్పుకొచ్చింది. కానీ, ఓ రోజు “మహా సముద్రం” షూటింగ్ జరుగుతున్నప్పుడు నా ప్రాక్టీస్ పూర్తికాకుండానే షూటింగ్ లో పార్టిసిపేట్ చేయాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు. వెంటనే చెప్పాల్సి రావడంతో చెప్పలేకపోయానని.. ఆరోజు సెట్స్ లోనే ఏడ్చేసానని చెప్పుకొచ్చారు.


End of Article

You may also like