గుర్తు పట్టలేనంతగా మారిపోయిన “ఐ” మూవీ హీరోయిన్..! ఇలా అయిపోయిందేంటి..?

గుర్తు పట్టలేనంతగా మారిపోయిన “ఐ” మూవీ హీరోయిన్..! ఇలా అయిపోయిందేంటి..?

by kavitha

Ads

సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఎందరో హీరోయిన్స్ చాలా తక్కువ సమయంలో క్రేజ్ సొంతం చేసుకుని, స్టార్ డమ్ పొందారు. కానీ వారిలో కొంతమంది ఎక్కువకాలం సినీ పరిశ్రమలో నిలువలేకపోయారు. ఇండస్ట్రీ దూరం అయ్యారు.

Video Advertisement

అలాంటి హీరోయిన్లలో అమీ జాక్సన్ ఒకరు. బ్రిటన్ కు చెందిన మోడల్, ఆ తరువాత సినీ రంగంలో అడుగుపెట్టి, పలు తమిళ, తెలుగు, హిందీ చిత్రాలలో నటించింది. రోబో 2.0 మూవీ తరువాత ఇండస్ట్రీకి దూరం అయ్యింది. ప్రస్తుతం ఆమె గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం..
హీరోయిన్ అమీ జాక్సన్ 2010 లో రిలీజ్ అయిన ‘మద్రాసపట్టినం’ అనే తమిళ మూవీతో హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ మూవీ విజయం సాధించడంతో వరుస అవకాశాలు వచ్చాయి. తక్కువ కాలంలోనే క్రేజ్, స్టార్ డమ్ సంపాదించుకుంది. ఐ, 2.ఓ, తేరి లాంటి సినిమాలలో నటించింది. ఆ తరువాత ఎవడు మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. కనిపించింది కొంతకాలం అయినా వరుసగా స్టార్ హీరోలతో నటించింది.
రజినికాంత్, విజయ్ దళపతి, విక్రమ్, ధనుష్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో నటించింది. 2018లో రిలీజ్ అయిన కన్నడ మూవీ ‘ది విలన్’ లో శివ రాజ్‌కుమార్, సుదీప్‌లతో కలిసి అమీ జాక్సన్ నటించింది. శంకర్ చిత్రాలలో నటించింది. కానీ అవి అంతగా కలిసిరాలేదు. రోబో 2.0 తరువాత ఆమె సినిమాలకు దూరం అయ్యింది. కానీ తన వ్యక్తిగత జీవితంతో పెళ్లి అవకుండానే తల్లి కావడం, అతనితో బ్రేకప్, మళ్లీ లవ్ లో పడటం లాంటి వాటితో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యింది.
కొడుకుతో, తన లవర్ తో సంతోషంగా గడుపుతోంది. వాటికి సంబంధించిన  ఫోటోలను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. చాలా కాలం తరువాత ‘మిషన్ చాప్టర్ 1: అచ్చమ్ ఎన్బతు ఇల్యాయే’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీలో అరుణ్ విజయ్ హీరో గా నటిస్తున్నారు. తాజాగా అమీ లండన్ ఫ్యాషన్ వీక్‌లో రెడ్ కలర్ దుస్తుల్లో హాజరైంది. దానికి సంబంధించిన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అందులో ఆమె లుక్ కనిపించి అందరికి షాక్ ఇచ్చింది. వాటిని చూసిన నెటిజెన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Also Read: “విజయ్ ఆంటోనీ” తో పాటు… తమ పిల్లల్ని కోల్పోయిన 7 నటులు..!


End of Article

You may also like