భార్య చనిపోయిన 5 నెలలకే మరో పెళ్లి.? సమాధిలో శవం మిస్సింగ్.?

భార్య చనిపోయిన 5 నెలలకే మరో పెళ్లి.? సమాధిలో శవం మిస్సింగ్.?

by Anudeep

Ads

ఎప్పటికప్పుడు మన మధ్య జరుగుతున్న వింత సంఘటనలు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంటాయి. అలాంటి సంఘటన జరిగినప్పుడు అవి వాస్తవమా లేక కల్పితమా అన్న అనుమానం మనకు కలుగుతుంది. చాలా సందర్భాల్లో దెయ్యాల గురించి భూతాల గురించి ఎన్నో కథలుగా మనుషులు చెప్పుకోవడం విన్నాం. కానీ సమాధి నుంచే శవం మాయం అవ్వటం…ఎక్కడ వినలేదు కదూ…అయితే మీరు కచ్చితంగా ఈ విషయం గురించి తెలుసుకోవాల్సిందే.

Video Advertisement

మామూలుగా మరణించిన వ్యక్తి శరీరాన్ని ఖననం చేస్తారు. కానీ ఆ మరణించిన వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించినట్లయితే అవసరాన్ని పట్టి ఆ మృతదేహాన్ని తిరిగి వెలికి తీసి మరొకసారి పోస్ట్ మార్టం కూడా నిర్వహిస్తారు. అలాంటి సంఘటన ఎదురవ్వడం తో కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సమాధి తవ్విన పోలీసుల కు లోపల శవం మాయం అవడంతో మైండ్ బ్లాక్ అయ్యింది.

anantapur

అసలు వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ,యాడికి మండలం , తుట్రళ్లపల్లి వాస్తవ్యుడు అయిన లింగాల గుర్రప్పకు యల్లనూరు మండల లో నివాసమున్న సుంకులమ్మ రెండవ కుమార్తె అయిన గంగాదేవితో 2009 లో వివాహం జరిగింది. పెళ్లయిన తర్వాత తమ ఇద్దరి సంతానంతో కలిసి తాడిపత్రిలో నివాసం ఉంటున్న వీరికి గత ఏడాదిన్నారని నుంచి తీవ్రస్థాయిలో గొడవ జరుగుతూ వచ్చింది. ఒకరోజు జరిగిన భయంకర వాగ్వివాదం అనంతరం గురువప్ప డ్యూటీకి వెళ్ళిపోగా అతనికి ఫోన్ చేసిన అతని భార్య గంగాదేవి పురుగుల మందు తాగుతున్నట్టు బెదిరించి ఫోన్ పెట్టేసింది.

women sucide 2

representative image

వెంటనే ఇంటికి చేరుకొని భార్యను ఆసుపత్రికి తరలించిన ఆమెను అతను కాపాడుకోలేకపోయాడు. చివరకు గంగాదేవి మృతదేహాన్ని తుట్రళ్లపల్లికి తమతోపాటు తీసుకుని వచ్చిన కుటుంబ సభ్యులు.. ఆమెను అక్కడే ఖననం చేశారు. ఈ క్రమంలో భార్య చనిపోయిన 5వ నెలకే గుర్రప్ప మరొక మహిళను పెళ్లి చేసుకున్నారు. దానితో ఆగ్రహించిన గంగాదేవి తల్లి తానిచ్చిన కట్న కాలుకను తిరిగి ఇవ్వమని నిలదీసింది. అదే క్రమంలో తన కుమార్తెకు జరిగిన హత్య పై అనుమానాలు ఉన్నాయని గుర్రప్ప దానికి కారణం అని అతని మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది.

representative image

ఆమె ఫిర్యాదుకు స్పందించిన రెవెన్యూ అధికారులు మరియు అనంతపురం వైద్య కళాశాల డాక్టర్లు పోలీసుల సహాయంతో తుట్రాళ్లపల్లికి వెళ్లి గంగాదేవి మృతదేహాన్ని ఖననం చేసిన చోట తవ్వించి చూశారు. వెంకటేష్ నటించిన దృశ్యం సినిమాలో లాగా ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఘట్టం గంగాదేవి మృతదేహం పూడ్చిన చోట లేక పోవడం తో అందరినీ షాక్ కి గురి చేసింది. అసలు ఆమెను అక్కడే కారణం చేశారా? లేక తరువాత మృతదేహాన్ని అక్కడ నుంచి మాయం చేశారా అని అందరికీ అనుమానం కలుగుతుంది. అసలు నిజాలు పూర్తి దర్యాప్తు తర్వాత తెలియాల్సి ఉంది.


End of Article

You may also like