Ads
వివాహమై ఇద్దరు పిల్లలున్న తల్లి… ఇంజనీరింగ్ చదివిన యువకుడు త ఇంట్లో ఎవరికి తెలియకుండా పారిపోయిన వైనం ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారింది.
Video Advertisement
ఇదేమీ తెలియని ఆమె భర్త పాపం తన భార్య కనపడటం లేదు…..కాపాడండి….అని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని కంప్లైంట్ అందుకుని రంగంలోకి దిగిన పోలీసులు ఆమె కోసం దర్యాప్తు స్టార్ట్ చేశారు. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు…ఇన్వెస్టిగేషన్ లో అసలు సంగతి బయటకు వచ్చింది. దీంతో ప్రియుడితో కలిసి కారవార్ పారిపోయిన ఆమెను ,ఆమె ప్రియుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇటీవల ఇంజినీరింగ్ను పూర్తి చేసిన బీర్ మోహిద్దీన్ చెన్నైకి చెందినవాడు. అతను పెళ్లి సంబంధాల విషయంలో దూరపు బంధువైన అబ్దుల్ ఖాదర్ ను కలవడానికి అప్పుడప్పుడు ఖాదర్ ఇంటికి వెళ్ళేవాడు. ఆ అబ్దుల్ ఖాదర్ కోడలే అయిషా. ఆమెతో బీర్ మోహిద్దీన్ కు బాల్యం నుండి పరిచయం ఉండేది.ఆ ఇద్దరు తరచుగా కలుసుకోవడం తో ఇద్దరి మధ్య చిన్ననాటి ప్రేమ తిరిగి చిగురించింది.ఆ పరిచయం అతి తక్కువ కాలం లోనే ప్రేమగా మారింది. దాంతో ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఇద్దరు కారవారకు పారిపోయారు.
ఇద్దరు కారవార్ లో నే ఎవరికి తెలియకుండా ఆరు నెలల నుంచి భార్య భర్తలా కలిసి నివాసం ఉంటున్నారు. అయిషా కోసం వెతుకుతన్న పోలీసుల కారవార్ చేరడంతో అసలు నిజం బయటకు వచ్చింది. స్థానిక పోలీసుల సాయంతో తమిళనాడు పోలీసులు ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. గత ఫిబ్రవరి నుండి ఇద్దరు కారవార్ లో ఒక అద్దె ఇంటిలో ఉంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ సంగతి తెలిసి ఇద్దరు పిల్లల్ని ,భర్తను కాదు అని ఒక అబ్బాయితో అయిషా అలా చేయడం తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు.
End of Article