Ads
అనుమానం పెనుభూతం అయ్యింది. భార్య ప్రవర్తన అతనిలో అనుమానాన్ని కలిగించింది. భర్త ఇంట్లో నుంచి వెళ్లగానే ఆమె కొందరితో చనువుగా ఉండటం అతను తట్టుకోలేకపోయాడు. తనకు తెలియకుండా ఏదో జరుగుతోందని అనుకున్నాడు. అదే కోపంతో భార్యను హత్య చేసి కసి తీర్చుకున్నాడు.
Video Advertisement
చివరకు అతను చావు, బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. కట్టుకున్న భార్య అని కూడా చూడకుండా ఆమెతో గొడవ పడి, అదే క్షణికావేశంలో ఆమెపై దాడి చేశాడు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం నోముల గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే 29 సంవత్సరాల వ్యక్తి అదే మండలం పాలెం గ్రామానికి చెందిన స్వాతి అనే మహిళను ఏడేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు.
వారికి ఒక పాప, ఓ బాబు ఉన్నారు. శ్రీకాంత్ ప్లంబర్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత ఆరేళ్లుగా కాపురం సాఫీగానే సాగుతోంది. ఏడాది నుంచి శ్రీకాంత్ భార్య స్వాతికి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. అదే విషయంలో తరచూ వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. రెండ్రోజుల క్రితం స్వాతి, శ్రీకాంత్ ఉదయం పిల్లలు స్కూల్కి వెళ్లిన తర్వాత మరోసారి గొడవపడ్డారు. ఆ సమయంలో విచక్షణ కోల్పోయిన శ్రీకాంత్ భార్యను దిండుతో ముఖంపై అదిమి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు.
ఆ తర్వాత 9.30 గంటల సమయంలో నకిరేకల్లోనే ఉంటున్న స్వాతి అక్క పల్ల స్వప్నకు శ్రీకాంత్ ఫోన్ చేసి మీ చెల్లెను చంపేశానని చెప్పి ఇంట్లోంచి పారిపోయాడు. మృతురాలి సోదరి వెంటనే అక్కడికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భార్య స్వాతిని హత్య చేసి ఇంటి నుంచి పారిపోయిన శ్రీకాంత్ వెంటనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.
అనంతరం తనంతట తానే ఆసుపత్రికి వెళ్లడంతో అతని పరిస్థితి విషమంగా ఉండటంతో నల్లగొండ ఆసుపత్రికి వెళ్లమని సూచించారు. నల్లగొండ ఆసుపత్రిలో శ్రీకాంత్కి వైద్యులు చికిత్స చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన నకిరేకల్ సీఐ వెంకటయ్య స్వాతి మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు కోలుకున్న తర్వాత అతనిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. తల్లి చనిపోయి.. తండ్రి ఆసుపత్రిలో చేరడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. కుటుంబ సభ్యులు పిల్లలను చేరదీశారు. కేవలం అనుమానంతోనే స్వాతిని శ్రీకాంత్ హత్య చేశాడని మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు.
End of Article