“కళ్ళు మూసుకో సర్ ప్రైజ్ ఇస్తా” అంటూ.. కాబోయే భర్త గొంతు కోసేసింది.. అసలేం జరిగిందంటే..?

“కళ్ళు మూసుకో సర్ ప్రైజ్ ఇస్తా” అంటూ.. కాబోయే భర్త గొంతు కోసేసింది.. అసలేం జరిగిందంటే..?

by Anudeep

Ads

పెళ్లి ఇష్టం లేని ఓ అమ్మాయి దారుణానికి ఒడిగట్టింది. నిశ్చితార్ధం పూర్తి అయ్యాక.. కాబోయే భర్తని తమ ఊరు రావాలంటూ పిలిచింది. తల్లి తండ్రులకు తెలియకుండా అతని గొంతు కోసి దారుణానికి ఒడిగట్టింది. పెళ్లి ఇష్టం లేదని తల్లి తండ్రులకి చెప్తే అయిపోయేదానికి.. కాబోయే వ్యక్తి ప్రాణాల మీదకి తీసుకొచ్చింది.

Video Advertisement

అసలేం జరిగిందో తెలుసుకుందాం. బీబీసీ కధనం ప్రకారం విశాఖకు చెందిన రామానాయుడు అనే యువకుడు CSIR లో సైంటిస్ట్ గా పని చేస్తున్నాడు. కాగా రావికమతం మండలంలోని కొమ్మల పూడి గ్రామానికి చెందిన అమ్మాయితో వివాహం చేయాలనీ పెద్దలు నిశ్చయించుకున్నారు.

anakapalli 1

అయితే.. వచ్చే నెల 29 న వీరిద్దరికి పెళ్లి చేయాలనీ డేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఇంతలో ఆ అమ్మాయి ఒకరోజు ఫోన్ చేసి మా ఊరు రావచ్చు కదా అంటూ రామానాయుడ్ని అడిగింది. ఆమె రమ్మని అడగడంతో కొమ్మలపూడి గ్రామానికి వెళ్లానంటూ చెప్పుకొచ్చాడు. అయితే.. ఆమె మాట్లాడాలని చెప్పి అక్కడ నుంచి కొండపైన ఉన్న సాయిబాబా టెంపుల్ కు తీసుకు వెళ్లిందని చెప్పుకొచ్చారు.

anakapalli 2

అక్కడకి వెళ్ళాక నీకు ఒక సర్ ప్రైజ్ ఇస్తా కళ్ళు మూసుకోమని చెప్పిందని.. కళ్ళు మూసుకోగానే కత్తితో గొంతు కోసేసింది అని చెప్పుకొచ్చారు. రక్తం కారుతున్నా ఆమె అక్కడే ఉండి చూస్తూ ఉందని చెప్పుకొచ్చారు. అతి కష్టం మీద తాను 108 కి ఫోన్ చేసానని.. వారు వచ్చి నన్ను ఆసుపత్రికి తీసుకొచ్చారని చెప్పుకొచ్చారు. అయితే.. ఆ అమ్మాయి మాత్రం కొండ మీద నుంచి వస్తుంటే బండి మీద నుంచి పడిపోయినట్లు చెబుతోంది. అందుకే అతనికి గాయం అయిందని చెబుతోంది. ఇందులో ఏది నిజం అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఇప్పటి వరకు ఆ అమ్మాయి పై కేసు అయితే నమోదు చేయలేదని బుచ్చయ్యపేట ఎస్సై రామకృష్ణ బీబీసీ కి తెలిపారు.


End of Article

You may also like