యాంకర్ అనసూయ ఇంట విషాదం నెలకొంది. ఆమె తండ్రి సుదర్శన్ రావు (63 ) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన క్యాన్సర్తో పోరాడుతున్నారు. తార్నాకలోని నివాసం ఉండే సుదర్శనరావు ఈ రోజు ఉదయం అస్వస్ధతకు లోనయ్యారు. అనంతరం కొద్దిసేపటికే ఆయన తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. సుదర్శన్ రావు గారు కాంగ్రెస్ పార్టీలో చాలాకాలం పాటు పనిచేశారు. ఆయన ఆకస్మిక మరణం కుటుంబ సభ్యులను కలచివేసింది.
Video Advertisement
Also Read: ‘జబర్దస్త్ స్టేజి మీద అనసూయ కి చేదు అనుభవం! యాంకర్ శివ ప్రశ్నకు అనసూయ ఏమన్నారంటే !
అనసూయ తండ్రి సుదర్శన్ రావు గారు పలు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గోన్నారు. రాజీవ్ గాంధీ హయాంలో యూత్ కాంగ్రెస్ పబ్లిసిటీ సెక్రటరీగా వ్యవహరించారు. ఆయనకు భార్య, అనసూయ, వైష్ణవి సహా ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన తన తల్లి పేరునే అనసూయకు పెట్టుకున్నారు.
అనసూయని ఆర్మీ లోకి పంపించాలి అనుకున్నారు అంట ఆయన. కానీ అనసూయకి యాంకరింగ్ వైపు ఆసక్తి ఉండడంతో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అలాగే పలు సినిమాల్లో కూడా నటిస్తూ నటిగా కూడా గుర్తింపు పొందారు అనసూయ.