Ads
రణబీర్ కపూర్ రష్మిక మందన కలిసి నటించిన తాజా చిత్రం యానిమల్. ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్ లో రూపొందిన ఈ సినిమా తాజాగా నేను డిసెంబర్ 1న థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమా విడుదలకు ముందే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై బోలెడు ఆశలను పెట్టుకున్నారు. దానికి తోడు సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ టీజర్ పోస్టర్లు ఆ అంచనాలను మరింత పెంచేశాయి. విడుదలకు ముందే బుకింగ్స్ సమయంలోనే ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బుకింగ్స్ జరిగాయి.
Video Advertisement
అయితే బాలీవుడ్ లో పర్సేంటేజ్ బేస్ తో రిలీజ్ అవుతున్న ఈ సినిమా అక్కడ ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉండగా తెలుగు రాష్ట్రాలలో మాత్రం మంచి రేటుకి సినిమా బిజినెస్ జరిగింది ఇప్పుడు, ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలలో వాల్యూ బిజినెస్ రేంజ్ 14 కోట్లకు పైగా సొంతం చేసుకుంది ఈ సినిమా. రణబీర్ కపూర్ కెరీర్ లో ఇది ఒక రికార్డ్ అని చెప్పవచ్చు. నైజాంలో భారీ లెవల్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఆంధ్ర సీడెడ్ లలో కూడా ఒక పెద్ద సినిమా ఏ రేంజ్ లో రిలీజ్ కానుందో అలాంటి థియేటర్స్ కౌంట్ ను సొంతం చేసుకోబోతుంది. ఇక తెలుగ లో సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే 15 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో యానిమల్ మూవీ 14 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలిసింది. 15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో శుక్రవారం ఈ యాక్షన్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంకా ఈ సినిమా 15 కోట్ల వరకు షేర్స్ ని రాబట్టాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు ఉన్న పాజిటివ్ టాక్ ని బట్టి చూస్తే ఈ సినిమా తప్పకుండా సక్సెస్ ని సాధించడం ఖాయం అని తెలుస్తోంది. ఒకవేళ ఈ సినిమా సూపర్ హిట్ అయింది అంటే బ్రేక్ ఈవెన్ అందుకోవడం ఏమాత్రం కష్టం కాదని చెప్పవచ్చు. తాజాగా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ స్పందన లభిస్తోంది.
End of Article