వాళ్ళ మాటలు నన్ను ఎంతో బాధ పెట్టాయి :సీఎం జగన్

వాళ్ళ మాటలు నన్ను ఎంతో బాధ పెట్టాయి :సీఎం జగన్

by Anudeep

Ads

ఏపీ లో బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి.గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మాణాణం లో మాట్లాడుతూ..తమ పాలన చేపట్టిన తర్వాత సగర్వంగా మాట్లాడుతున్నామని సీఎం జగన్ ప్రసంగం మొదలు పెట్టారు.కొవిడ్ బాధితులకి కొద్దిసేపు మౌనం పాటించిన అసెంబ్లీ అనంతరం తన ప్రసంగాన్ని కొనసాగించారు.ప్రాణం విలువ నాకు తెలుసు అధ్యక్షా.!

Video Advertisement

వ్యాక్సినేషన్ కి సంబంధించి కొన్ని వివరాలని ప్రజలకి ఈ సందర్భగా తెలిపారు..దేశంలో 45 ఏళ్ల పైబడినవారు 26 కోట్ల మంది ఉన్నారని వారికి రెండు డోసుల టీకా అంటే మొత్తం 52 కోట్ల టీకాలు వారికే అవసరం అని, 18 నుంచి 45 ఏళ్ల వారు సంఖ్య 60 కోట్లని వారికి అవసరం అయ్యే టీకా 120 కోట్లని, చెప్పారు, అలాగే మొత్తం మీద 172 కోట్ల టీకాలు అవసరం ఉండగా మన దేశం కేవలం 7 కోట్ల డోసులు మాత్రమే ఉత్పత్తి సామర్థ్యం ఉన్నట్టుగా గుర్తు చేసారు.సీరం సంస్థ 6 కోట్ల డోసులు,కోటి డోసులు భారత్ బయోటెక్ అందిస్తున్నట్టుగా గుర్తుచేశారు.దేశం మొత్తం 172 కోట్ల డోసులు అవసరం ఉండగా ఇప్ప్పటి వరకు 18 కోట్ల 44 లక్షల మందికి మాత్రమే టీకా అందిందని చెప్పారు.

also read : కాలి చూపుడు వేలికి, మధ్య వేలికి రాత్రి పూట టేప్ వేసి పడుకుంటే ఏం జరుగుతుందో తెలుసా.?

మన రాష్ట్ర విషయానికి వస్తే 45 ఏళ్ల పైబడిన వారి సంఖ్య 1 .48 కోట్లని అని వారికి ౩ కోట్ల డోసులు అవసరం అని 18 -45 వయసు కలవారు 2 కోట్ల మంది ఉండగా వారికి 4 కోట్ల డోసులు అవసరం అని చెప్పారు.కేంద్రం నుంచి వచ్చిన టీకాల సంఖ్య కేవలం 76 లక్షల 29 వేల 580 డోసులు మాత్రమే.ఈ లెక్కలు అన్ని తెలిసి కూడా ప్రతి పక్షాలు వాక్సిన్ లు కొనడం లేదంటూ నిందలు వెయ్యటం సరికాదు అంటూ చెప్పారు.వీళ్ళ వక్రీకరణలు చూస్తూ ఉంటె మనసుకు బాధేస్తుంది ఆంటూ చెప్పారు.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ముందున్న ఏకైక మార్గం గ్లోబల్ టెండర్లేన్ని. అయితే గ్లోబల్ టెండర్లకు వెళ్లిన కొద్దీ రాష్ట్రాల్లో ఏపీ ముందు వరసలో ఉంటుందని, తప్పకుండ ప్రహి ఒక్కరికి వ్యాక్సిన్ ని ఆడించే ప్రయత్నం చేస్తాం అంటూ ప్రకటించారు.టీకా తీసుకునేవరకు సామజిక దూరం,మాస్క్ తప్పనిసరిగా పాటించాలంటూ విజ్ఞప్తి చేసారు,

also read :ఆ ఘనత మా ప్రభుత్వానికే దక్కింది : సీఎం జగన్


End of Article

You may also like