ఇండియాలో అత్యంత ఇష్టపడే క్రీడలలో క్రికెట్ అగ్ర స్థానంలో ఉంటుంది. క్రికెట్ కెరీర్ గా ఎంచుకోవడానికి కూడా చాలా పోటీ ఉంది. భారత జట్టులో స్థానం సంపాదించాలని ఎంతోమంది కల కంటూ ఉంటారు. ఎంతో టాలెంట్ ఉంటే తప్ప భారత జట్టులో చోటు సంపాదించలేరు.
అయితే కొంతమంది క్రికెటర్లకు ఎంతో ప్రతిభ ఉన్నప్పటికి, వారికి నిరూపించుకోవడానికి తగిన అవకాశాలు రావడం లేదు. అలా ఛాన్స్ లు లేక టన్నుల కొద్దీ ప్రతిభ, క్రికెట్ పట్ల ఎంతో ఆసక్తి ఉన్నా, కొందరు దురదృష్టం కొద్ది లెజెండరీ క్రికెటర్లుగా ఎదగలేకపోయారు. అలాంటి 5 గురు ఇండియన్ క్రికెటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1. అంబటి రాయుడు:
అంబటి రాయుడు 2019 ప్రపంచకప్కు ముందు, జరిగిన మ్యాచ్ లలో అద్భుతంగా రాణించాడు. కానీ సెలక్టర్లు త్రీడీ ఆటగాడికి ప్రాధాన్యత ఇస్తూ, రాయుడును జట్టు నుంచి సడెన్ గా తొలగించారు. అయితే ప్రపంచకప్లో ఆటగాళ్లకు గాయపడ్డారు. అయినా , స్టాండ్బై ప్లేయర్గా ఉన్న రాయుడుని సెలెక్టర్లు జట్టులోకి తీసుకోలేదు. దీంతో అంబటి రాయుడు విచారంగా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. అలా అతని కల చెదిరిపోయింది.
2. కరుణ్ నాయర్:
వీరేంద్ర సెహ్వాగ్ తరువాత 2016లో కరుణ్ నాయర్ ఇంగ్లండ్ జట్టు పై ట్రిపుల్ సెంచరీ చేసి, ఇండియన్ క్రికెట్ చరిత్రలో రెండో బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. కానీ దురదృష్టం నాయర్ ను వెంటాడింది. ట్రిపుల్ సెంచరీని చేసిన తర్వాత, జట్టులోకి తీసుకోలేదు. సాధారణంగా సెంచరీ చేసిన ఆటగాడు తరువాతి ఆటలో అయినా జట్టులో స్థానం దొరికే అవకాశం ఉంటుంది. కానీ ట్రిపుల్ సెంచరీ బాదిన నాయర్కు చోటు దక్కలేదు. క్రికెట్ చరిత్రలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదు.
3. వసీం జాఫర్:
వసీం జాఫర్ ‘ది లెజెండ్ ఆఫ్ డొమెస్టిక్ క్రికెట్’ గా పేరు గాంచాడు. జాఫర్ దేశవాళీ క్రికెట్లో ఇప్పటి వరకు ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్మన్ గా నిలిచాడు. అతను 186 ఫస్ట్-క్లాస్ మ్యాచ్ల్లో ముంబైకి ఆడుతున్న సమయంలో 14609 పరుగులు చేశాడు. అంతే కాకుండా ఫస్ట్ క్లాస్ కెరీర్లో 46 సెంచరీలు చేశాడు.
2000లో అరంగేట్రం చేసిన జాఫర్ 31 టెస్టు మ్యాచ్ల్లో 34.11 రన్స్ సగటుతో 1944 రన్స్ చేశాడు. అప్పట్లో ఇది గౌరవప్రదమైన రికార్డు. అయితే, భారత జట్టుకు కఠిన సమయం రావడంతో, ప్లేయర్స్ రొటేషన్స్ లో మారుతుండడంతో అద్భుతమైన బ్యాటింగ్ టెక్నిక్ ఉన్నప్పటికీ, దురదృష్టం కొద్ది అతను జట్టులో స్థానం
కోల్పోయాడు.
4. ఇర్ఫాన్ పఠాన్:
ఇర్ఫాన్ పఠాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. పాకిస్థాన్తో జరిగిన టెస్టు మ్యాచ్లో మొదటి ఓవర్లోనే హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టి రికార్డును సృష్టించాడు. 23 ఏళ్ల వయసులో పఠాన్ మూడు ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తుండడంతో అతనికి జూనియర్ కపిల్ దేవ్ గా పేరు వచ్చింది. అయితే అతనిని దురదృష్టం అనేది గ్రెగ్ చాపెల్ రూపంలో వెంటాడింది.
చాపెల్ టీమ్ ఇండియా కోచ్ గా మారిన తరువాత అతను పఠాన్ను బలవంతంగా ఆల్ రౌండర్గా మార్చే ప్రయత్నం చేశాడు. చాపెల్ పఠాన్ ను బౌలింగ్ కన్నా బ్యాటింగ్ పై ఎక్కువ దృష్టి ఉంచేలా చేశాడు. దాంతో రెండింటిని సమానంగా కొనసాగించడంలో పఠాన్ తడబడ్డాడు. దాంతో జట్టులో స్థానం కోల్పోయాడు. 173 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నప్పటికి అతని కెరీర్ 27 సంవత్సరాల వయస్సులో ముగిసింది.
5 . దినేష్ కార్తీక్:
దినేష్ కార్తీక్ పేరు వినగానే నిదాహాస్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో అతని బ్యాటింగ్ అందరికి గుర్తుకు వస్తుంది. కార్తీక్ దేశవాళీ క్రికెట్ లో అద్భుతంగా రాణించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ అతను భారత క్రికెట్ జట్టులో స్థానం పొందలేకపోయాడు. ఓపెనర్ గా మొదటి మ్యాచ్ ఆడటమే అతనికి శాపంగా మారింది.
అప్పటికే జట్టులో సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ లాంటి టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఉన్నారు. దాంతో కార్తీక్ ఎక్కువగా అవకాశాలు రాలేదు. ఇక ధోనీ ఉండడం వల్ల అతను వికెట్ కీపర్గాను రెండవ స్థానంలో ఉండేవాడు. ఎంతో ప్రతిభ ఉన్నా దినేష్ కార్తీక్ భారత అత్యంత దురదృష్టకర క్రికెటర్లలో ఒకరిగా నిలిచాడు.

మరణించిన వారు బ్రతికి ఉన్నప్పుడు ఎంత సంపాదించినప్పటికీ, చనిపోయిన తరువాత వారు ఒక్క రూపాయిని కూడా తీసుకెళ్లలేరు అని చెప్పడానికే ఇలా డబ్బులు చల్లుతారు. రేపు మీ పరిస్థితి కూడా ఇదే కాబట్టి న్యాయంగా, ధర్మంగా జీవించమని చెప్పడానికి కూడా ఇలా చేస్తారని కొందరు చెబుతారు. ఏ ప్రశ్నకైనా జవాబు దొరికే కోరాలో
“చనిపోయినవారి అంతిమయాత్రలో డబ్బులు చల్లటం అనేది పది, పదిహేను సంవత్సరాల నుంచే చూస్తున్నాం. ఇలా చల్లిన డబ్బులను ఎక్కువగా యాచకులు, చిన్నపిల్లలు ఏరుకుంటారు. ఈ విధంగా చేస్తే, నిరుపేదలకు మరణించిన వారి పేరు మీదుగా సహాయం చేశామనే తృప్తి వారి కుటుంబసభ్యులకు వుంటుంది. శవ యాత్రలో పూలు, పేలాలు చల్లటం వంటివి చాలా కాలం నుండి వుంది.
పూలు చల్లడం అంటే మరణించిన వారిని గౌరవించడం, దేవునిగా భావించడం కావచ్చు. పేలాలు చల్లడం వల్ల పక్షులు, క్రిమి కీటకాలకు ఆహారం వేసినట్టు భావన. ఇవి మనుషులకు కాదు అనడానికి గుర్తుగా ‘ హాస్యబ్రహ్మ ‘ జంధ్యాల గారు ఓ సినిమాలో ” శవం మీద పేలాలు ఏరుకుని తినే మొహం” అంటూ ఓ తిట్టు చేర్చారు!” అని వెంకట్ రమణ సూరంపూడి తెలిపారు.
ట్రై యాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. యూట్యూబ్ స్టార్గా పాపులర్ అయిన వైష్ణవి ఈ మూవీలో తన నటనలోని మరో కోణాన్ని తెరపై ఆవిష్కరించింది. వైష్ణవి నటనకు యువత ఎంతగా కనెక్ట్ అయ్యారంటే, మూవీ చూసిన వారు ఆమె క్యారెక్టర్ ని దారుణంగా తిడుతున్నారు. అద్భుతమైన నటనతో ఆనంద్ దేవరకొండ ఆడియెన్స్ కి కన్నీళ్లు తెప్పించాడు.
వీరిద్దరికీ కొంచెం కూడా తగ్గకుండా విరాజ్ అశ్విన్ తన నటనతో మెప్పించాడు. దాంతో 2 రోజులకే బ్రేక్ ఈవెన్ అయ్యి, ఫస్ట్ వీక్ పూర్తయ్యేసరికి రూ.23.07 కోట్లు షేర్ ను సాధించింది. బ్రేక్ ఈవెన్ అవడమే కాకుండా ఈ మూవీ రూ.16.87 కోట్ల లాభాలను రాబట్టి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా అయ్యింది. ఇంతగా ఆకట్టుకున్న వీరికి ఇచ్చిన పారితోషికం గురించి తెలిసి, ఇంత తక్కువా? అని నెటిజన్లు ఆశ్యర్యపోతున్నారు.
దాదాపు పది కోట్ల బడ్జెట్తో బేబీ మూవీని తెరకెక్కించారని తెలుస్తోంది. ఈ మూవీలో హీరోగా నటించిన ఆనంద్ దేవరకొండకు దాదాపు రూ.80 లక్షల వరకు రెమ్యునరేషన్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. హీరోయిన వైష్ణవికి రూ.30 లక్షలు మాత్రమే రెమ్యునరేషన్గా ఇచ్చారని, ఇక విరాజ్ అశ్విన్కు కేవలం రూ.20 లక్షలు ఇచ్చారని నెట్టింట్లో ప్రచారం జరుగుతుంది. అయితే డైరెక్టర్ సాయి రాజేష్ కోటికి పైగా తీసుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.
1. పోకిరి:
2. అ మూవీ:
3. రంగస్థలం:
4. బాహుబలి: ద బిగినింగ్:
5. అనుకోకుండా ఒక రోజు:
6. క్షణం:
7. గూఢచారి:
8. కేర్ అఫ్ కంచెరపాలెం:
9. కుమారి 21F:
10. ప్రస్థానం:
11. మిస్సమ్మ:
12. నేనొక్కడినే:
13. జెంటిల్ మెన్:
ఈ మూవీ కథ విషయనికి వస్తే, జీవితంలో ఎన్నో కష్టాలు పడి, ఉన్నత స్థానానికి ఎదిగిన కోటీశ్వరరావు(సాయికుమార్) సడెన్ గా చనిపోవాలని అనుకుంటాడు. ఆ టైంలో కోటీశ్వరరావు ఉండే గ్రామానికి వచ్చిన ఒక స్వామిజీ అతని కష్టాన్ని విని ఒక వరమిస్తాడు. అయితే ఆ విషయం ఎవరికి చెప్పవద్దని అంటాడు. స్వామిజీ కోటేశ్వరరావుకు ఇచ్చిన వరం ఏమిటి? వరం పొందిన తరువాత కోటేశ్వరరావు జీవితంలో కష్టాలు పోయాయా? కోటేశ్వరరావు జీవితంలో నాగలక్ష్మీ (దీపాళీ), దీప (ఐశ్వర్య) ఎవరు అనేవాటికి సమాధానమే మిగిలిన కథ.
మనిషి అనే దానికన్నా డబ్బు మీదే ఆధారపడి జీవితం నడుస్తోంది అనే కథతో తెరకెక్కిన సినిమా. 20, 40, 60 వయసు స్టేజ్ ల వారీగా సాగిన ఈ స్టోరీలో సాయికుమార్, సాయి శ్రీనివాస్, ఆదిత్యా ఓం, పాత్రలను మలచిన తీరు బావుంది. ఆ సీన్స్ ను దర్శకుడు నడిపించిన విధానం బాగుంది. మంచి చేసినపుడు అది ఎక్కడికి పోదు అనే విషయాన్ని చక్కగా చూపించారు. కోటీశ్వరుడిగా సాయికుమార్ అద్భుతంగా నటించారు. సాయికుమార్ డైలాగ్లు బాగున్నాయి.
ప్రేమించిన అమ్మాయి చేతిలో మోసపోయిన వ్యక్తిగా ఆదిత్య ఓం, బ్రేకప్ అయిన యువకుడిగా సాయి శ్రీనివాస్ చక్కగా నటించారు. రాజీవ్ కనకాల, సీవీఎల్ నరసింహరావు బాగా నటించారు. సాయి శ్రీనివాస్, ఐశ్వర్య క్యారెక్టర్లు యువతకి బాగా కనెక్ట్ అవుతాయి. తొలిసారి డైరెక్షన్ చేసిన శాంతి కుమార్ స్టోరీనే బాగా రాశారు. కానీ తెరపై చూపించడంలో కాస్త తడబడ్డారు. ఫీల్ గుడ్ మూవీ అందించేందుకు ప్రయత్నించారు. ఎంత డబ్బు సంపాదించిన మనిషికి మన అనుకునే తోడు లేకపోతే వారి జీవితంలో సంతోషంగా ఉండదు అనడానికి నిదర్శనమే ‘నాతో నేను’ మూవీ.
ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ ‘కల్కి 2989 AD’. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీ గ్లింప్స్ తాజాగా రిలీజ్ అయ్యింది. ఈ గ్లింప్స్ పై ఆడియెన్స్ నుండి సినీ ప్రముఖుల వరకు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇండియన్ హాలీవుడ్ మూవీలా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే దర్శకధీరుడు రాజమౌళి ఈ మూవీ గురించి ట్వీట్ చేశారు.
ఆ ట్వీట్ లో, ‘గ్రేట్ జాబ్ నాగి మరియు వైజయంతి మూవీస్. ఒక ఫ్యూచరిస్టిక్ సినిమాని తెరకెక్కించడం చాలా కష్టమైన పని, మీరు దీన్ని సాధ్యం చేసారు. ప్రభాస్ లుక్ అదిరిపోయింది. ఇక మిగిలింది ఒక్క ప్రశ్న మాత్రమే, మూవీ రిలీజ్ ఎప్పుడు’ అని రాసుకొచ్చారు. ఇక ఈ ట్వీట్ పై జక్కన్న సన్నిహితులు, ఫాలోవర్స్, నెటిజెన్లు కౌంటర్లు వేస్తున్నారు. బాహుబలి మూవీ నిర్మాత శోభు యార్లగడ్డ ‘రిలీజ్ డేట్ గురించి అడుగుతోంది ఎవరో చూశారా అని సరదాగా ట్వీట్ పెట్టారు. రాజమౌళి కుమారుడు కార్తికేయ స్మైల్ ఎమోజీలు పెట్టాడు.
రాజమౌళి శోభు యార్లగడ్డ ట్వీట్ కి ‘అంటే అది’ అని పాపులర్ అయిన లక్ష్మి సినిమాలోని బ్రహ్మానందం మీమ్ తో రిప్లై ఇచ్చారు. ఈ ట్వీట్ చూసిన డైరెక్టర్ హరీష్ శంకర్ రాజమౌళిని ఉద్దేశించి ‘మీరు చాలా స్వీట్. చాలా హంబుల్. మీ నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంది’ అని ట్వీట్ చేశారు.
భార్యను పూలమాలతో, శాలువాతో సత్కరించాడు. ఆ తరువాత కేక్ కట్ చేయించి, స్వీట్లు పంచిపెట్టాడు. భర్త చేసిన ఏర్పాట్లను చూసి దీనా ఆనంద భాష్పాలు రాల్చింది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది చూసిన వారు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రతి ఆడదాని సక్సెస్ వెనుక ఒక అర్థం చేసుకునే భర్త ఉంటాడని ఒకరు కామెంట్ చేశారు. అంతగా ప్రేమించి భార్య కోసం ఎఫర్ట్ పెట్టే వాళ్లు దొరకాలంటే రాసి పెట్టి ఉండాలని ఒకరు కామెంట్ చేశారు.
ప్రభాస్, దీపికా పదుకొనే ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘కల్కి 2898AD’. ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ గ్లింప్స్ పై ఆడియెన్స్ మాత్రమే కాకుండా సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. నాగ్ అశ్విన్ ఈ మూవీతో బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించడం ఖాయం అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
భవిష్యత్తులో రాబోయే యుగాంతానికి సంబంధించిన స్టోరీ అని తెలుస్తుంది. సూపర్ పవర్స్ ఉన్న ఒక హీరో ప్రజలను ఎలా కాపాడాడు అనే థీమ్ తో తెరక్కెకుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ గ్లింప్స్ లో ఒక రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న సైన్యం కనిపిస్తుంది. వాళ్ళందరికి లీడర్ గా నటించిన నటుడి పేరు శాశ్వత ఛటర్జీ.
ప్రముఖ బెంగాలీ నటుడు. ఈ యాక్టర్ ఈ మూవీతోనే టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. హిందీ సీరియల్ ద్వారా కెరీర్ ప్రారంభించిన శాశ్వత ఛటర్జీ, ఎన్నో సీరియల్స్ లో, వెబ్ సిరీస్ లలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. విద్యాబాలన్ నటించిన కహానీ మూవీ ద్వారా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత జగ్గా జాసూస్, దిల్ బేచారా, దోబారా, ధాకడ్ వంటి హిందీ చిత్రాలలో నటించారు.