చాలామంది అమ్మాయిలు ట్రైన్ లో ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి అనుకోకుండా సడన్ గా ప్రయాణాలు పెట్టుకోవాల్సి వస్తుంది. తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఎవరూ లేకుండా చాలామంది అమ్మాయిలు ఒంటరిగానే వెళ్తుంటారు.
అయితే అందరు అమ్మాయిలు ధైర్యంగా ఉండకపోవచ్చు. ట్రైన్ లో ఒంటరిగా వెళ్లే సమయంలో అనుకొని ఆపదలు చుట్టుముట్టవచ్చు… అలాంటి అమ్మాయిలు ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి…మీకు చాలా ఉపయోగపడుతుంది…

ఒంటరిగా ఆడపిల్లలు కనిపిస్తే పోకిరి వెధవలు ఎక్కడైనా సరే అదునుగా చూసుకుని ఏడిపిస్తూ ఉంటారు. అలాంటిది ట్రైన్ లో ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురైతే వాళ్ళు రెచ్చిపోతూ ఉంటారు. మీతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఇబ్బందులకు గురిచేస్తారు. మీ సీట్లలో కూర్చుని లేవకుండా ఇబ్బందులకు గురిచేసిన లేదా మీతో అసభ్య పదజాలంతో మాట్లాడిన ఇకపైన మీరు భయపడాల్సిన పనిలేదు. మీకోసమే రైల్వే డిపార్ట్మెంట్ రైల్వే సెక్యూరిటీ హెల్ప్ లైన్ నెంబర్ ను తీసుకువచ్చింది. ప్రతి ట్రైన్ బోగి లోను ఈ నెంబర్ ను అందుబాటులో ఉంచుతారు.

ఆ నంబరే 182. మీకు ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి ఎదురైన ఈ నెంబర్ కి ఫోన్ చేసి కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ స్టేషన్ లో మీకు సహాయం దొరుకుతుంది. ఈ నెంబరు డివిజనల్ సెక్యూరిటీ కంట్రోల్ రూమ్ ఫర్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ద్వారా 24 గంటలు ఏడు రోజులు పనిచేస్తూనే ఉంటుంది. ఈ నెంబర్ మీ ఫోన్లలో సేవ్ చేసుకోవడం లేదా గుర్తుపెట్టుకోవడం ద్వారా మీకు ఎటువంటి ఇబ్బందికరమైన తక్షణ సహాయం అంది మీ ప్రయాణం సుఖంగా ఉంటుంది. ఒంటరిగా ప్రయాణించే ఆడవాళ్లు, మహిళలు, అమ్మాయిలు దీన్ని మీ దృష్టిలో పెట్టుకోండి.





నిఖిల్ విజయేంద్ర సింహ పేరు సోషల్ మీడియా మరియు యూట్యూబ్ ఫాలో అయ్యేవారికి సుపరిచితం. యూట్యూబర్గా కెరీర్ ప్రారంభించి, కాస్కో అనే సెలబ్రిటీ టాక్ షోతో అతి తక్కువ సమయంలోనే పాపులర్ అయ్యారు. ఈ ప్రోగ్రామ్ హిట్ కావడంతో నిఖిల్ పాపులారిటీ అనూహ్యంగా పెరిగింది. మెగాడాటర్ నిహారిక, మంచు లక్ష్మి, వితిక, హారిక వంటివారికి నిఖిల్ ఫ్రెండ్ కూడా. సినీ సెలెబ్రెటీ పార్టీల్లో నిఖిల్ కనిపిస్తూ ఉంటాడు. నిఖిల్ మూవీ ప్రమోషన్స్ మూవీ యూనిట్ ను ఇంటర్వ్యూలు ఇస్తారు. నిఖిల్ సోషల్ మీడియా మరియు యూట్యూబ్ లో యాక్టివ్ గా ఉంటారు.
నిఖిల్ విజయేంద్ర సింహ 1996లో సెప్టెంబర్ 18న విశాఖపట్నంలో జన్మించారు. అతని తండ్రి రియల్ ఎస్టేట్ రంగంలో ఉండగా, తల్లి ఒక ఎన్జీవో కోసం పనిచేయడమే కాకుండా, ఖాజాగూడలో దిబ్బరోట్టి అనే రెస్టారెంట్ను కూడా నిర్వహిస్తోంది. నిఖిల్ 2018లో గీతం యూనివర్శిటీ నుండి బికాం (ఆనర్స్) పూర్తి చేసిన తర్వాత హైదరాబాద్కు వచ్చారు. తమ్మడ మీడియాలో పని చేయడం ప్రారంభించాడు. అలా ‘మహతల్లి’ ఛానెల్లో షార్ట్ ఫిల్మ్లలో కనిపిస్తూ యాక్టింగ్ లో ప్రవేశించాడు.
2019లో, నిఖిల్ తన సొంత యూట్యూబ్ ఛానెల్ ‘కాస్కో’ని మొదలుపెట్టి, తక్కువ సమయంలోనే నాలుగు లక్షలమంది సబ్స్క్రైబర్లను సంపాదించాడు. అందులో కంటెంట్, ఛాలెంజ్ వీడియోలు, ఫన్నీ వీడియోలు, సెలబ్రిటీ హోమ్ టూర్లతో పాటు సెలబ్రిటీలతో ఎంగేజింగ్ వీడియోలతో చాలా పాపులర్ అయ్యారు. 2020లో, నిఖిల్ తన ఫ్రెండ్ భానుతో కలిసి సొంత ప్రొడక్షన్ హౌస్ ‘రాయుడు చిత్రాలు’ స్థాపించాడు. నిహారిక కొణిదెల, అనసూయ భరద్వాజ్ వంటి ప్రముఖ నటీనటులు లీడ్ రోల్స్ లో వెబ్ సిరీస్ని నిర్మించారు. అంతేకాకుండా ‘హాయ్ నాన్న’ దర్శకుడు శౌర్యువ్ యువరాజ్ సింహ నిఖిల్ కి సొంత అన్నయ్య అని సమాచారం.



అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట అంగరంగ వైభవంగా ప్రధాని మోడీ చేతులమీదుగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమనికి సంబంధించిన ఫొటోలు, రాముడి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ప్రస్నవదనంతో చిరునవ్వును కలిగి, బాల రాముడి విగ్రహం ముగ్ద మనోహరంగా భక్తులకు దర్శనం ఇస్తోంది. రెండవ రోజు నుండి సాధారణ భక్తులకు అనుమతి ఇవ్వడంతో అయోధ్య రాముడిని చూడడానికి భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తుతున్నారు.
తాజాగా అయోధ్య రాముడి గురించిన ఒక వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. తమిళనాడులో హీరోహీరోయిన్ల పై వారి ఫ్యాన్స్ అభిమానం హద్దులు దాటి ఉండడం సాధారణ విషయమే. అయితే ఇప్పుడ ఆ అభిమానం పరిధులు దాటి వెళ్తోంది. తమిళ లెజెండరి యాక్టర్ కెప్టెన్ విజయ్ కాంత్, అయోధ్య బాల రాముడి విగ్రహానికి పోలికలు ఉన్నాయని ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.
రామ్ లల్లా సుందర ముఖారవిందం పై కోలీవుడ్ లో రచ్చ జరుగుతోంది. బాలక్ రామ్ విగ్రహం కళ్ళు మరియు నవ్వు తమ అభిమాన హీరో విజయ్ కాంత్ ను పోలి ఉన్నట్టు చెబుతున్నారు. కళ్లు అచ్చుగుద్దినట్టుగా తమ హీరో కళ్ళలా ఉన్నాయని, విజయ్ కాంత్ కళ్ళను, రాముడి కళ్ళను పోల్చుతూ కెప్టెన్ ఫ్యాన్స్ ఈ ఫోటోను వైరల్ చేస్తున్నారు.


