మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ భోళా శంకర్ గత శుక్రవారం రిలీజ్ అయ్యి, ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పై సోషల్ మీడియాలో జరుగుతున్న ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది. ఎక్కడ చూసిన ఈ మూవీ పైన మీమ్స్ కనిపిస్తున్నాయి.
ఈ మూవీ పైన తీవ్రంగా విమర్శలు కూడా చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవికి, నిర్మాత అనిల్ సుంకర మధ్య గొడవలు వచ్చాయని ఆ వార్తల సారాంశం. అది చూసిన వారు చిరంజీవిని విమర్శిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.. తమిళంలో హిట్ అయిన వేదళం మూవీ రీమేక్ గా భోళా శంకర్ మూవీని మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ తెరకెక్కించారు. ఈ మూవీలో తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ నటించారు. ఆగస్ట్ 11 న రిలీజ్ అయిన ఈమూవీ ఫస్ట్ షోతోనే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ మూవీని విమర్శిస్తూ నెట్టింట్లో ట్రోల్స్ వస్తున్నాయి. కలెక్షన్స్ కు కూడా దారుణంగా ఉన్నాయని కామెంట్ చేస్తున్నారు.
తాజాగా ఈ మూవీ పారితోషికం విషయంలో మెగాస్టార్ చిరంజీవికి, నిర్మాత అనిల్ సుంకరకు మధ్య గొడవలు జరిగాయనే వార్త వైరల్ గా మారింది. ఇండస్ట్రీలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై బేబీ దర్శకుడు సాయి రాజేశ్ తాజాగా స్పందించాడు. ‘నిజం చెప్పులు వేసుకునేలోపు, అబద్ధం ఊరంతా చుట్టి వస్తుంది. మరో వారం రోజులు చిరంజీవి డబ్బులు ఎలా వసూలు చేశాడో కథలు కథలుగా వస్తాయి. ఇటు వైపు నిజం చెప్పే మనిషి ఎలాగో ఉండడు.
మేము ఉన్న సమయంలోనే అనిల్ సుంకర గారు వచ్చారని, ఆయనను వెయిట్ చేయించొద్దని స్టాఫ్తో చెప్పి, ఆయన పైకి రాగానే పక్కన ఉన్న ఐరన్ సోఫాని పక్కకు జరిపి కూర్చోబెట్టారు. పనిమనిషి తెచ్చిన కాఫీని ముగ్గురికి ఆయనే స్వయంగా ఇచ్చారు. ప్రొడ్యూసర్ కు ఆయన ఇచ్చే గౌరవం అలాంటిది. ఈ వార్తలతో బాధపడి, అసలు విషయం తెలుసుకునేందుకు అనిల్ గారి వద్ద పని చేసే వ్యక్తికి కాల్ చేసి నిజం ఏమిటో తెలుసుకున్నాను. మా బాస్ మీరనుకునేలా కాదు. ఆయన వేరే, మా అభిమాన హీరో చిరంజీవిని చూసి గర్విస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశాడు.
Also Read: సినిమాల్లో ఒక వెలుగు వెలిగి… ఆ తర్వాత ఎందుకు వెనుకబడ్డాడు..! దాని వెనుక ఇంత విషాదం దాగి ఉందా..?