Ads
తొలిప్రేమ సినిమా గుర్తుండే ఉంటుంది. అంత తొందరగా మర్చిపోలేం. ఈ సినిమా హీరోయిన్ కీర్తి రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రస్తుత పరిస్థితుల ధాటికి అనేక మంది అసువులు బాస్తున్నారు. తాజాగా.. కీర్తి రెడ్డి తండ్రి కూడా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.
Video Advertisement
కీర్తి రెడ్డి తండ్రి, టీఆరెస్ నాయకుడు కేశ్పల్లి (గడ్డం) ఆనందరెడ్డి(60) ఈరోజు ఉదయం గుండెపోటు తో మరణించారు. ఆయన గుండెపోటు తో బాధపడుతూ ఆసుపత్రి లో చేరారు. ఆసుపత్రి లో చేరిన కొద్దీ సేపటికే ఆయన ఈ లోకాన్ని వీడారు. నిజామాబాద్ మాజీ ఎంపీ కేశ్పల్లి గంగారెడ్డి కుమారుడే ఆనంద్ రెడ్డి. యూత్ లీడర్ గా రాజకీయాల్లోకి వచ్చి రాజకీయం గా ఎదిగారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు కాగా.. ఒకరే కీర్తి రెడ్డి. కీర్తి రెడ్డి ని హీరో సుమంత్ కి ఇచ్చి వివాహం చేసారు. కాగా, 2006 లో వీరిద్దరూ విడిపోయారు. ఆ తరువాత కీర్తి రెడ్డి మరొకరిని వివాహం చేసుకుని బెంగళూర్ లో సెటిల్ అయింది. అయితే.. తండ్రి మరణ వార్త తెలియడం తో.. ఆమె తిరిగి హైదరాబాద్ కు రానున్నదని సమాచారం.
End of Article