Ads
అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు వస్తుండడం సాధారణం గా జరుగుతున్నదే. కానీ ఈ అన్నదమ్ముల మధ్య భార్యకు సంబంధించి తగాదా వచ్చింది. నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ పట్టణం లో మక్కల రాజు, మక్కల శీను (అన్న) నివసిస్తున్నారు. కొన్నేళ్ల క్రితమే శీను కు వివాహం అయిపొయింది. అయితే.. రాజు కు మాత్రం తనకు పెళ్లి కాదేమోనన్న బెంగ పట్టుకుంది. తన స్నేహితుల వద్ద కూడా ఇదే విషయాన్నీ ప్రస్తావిస్తూ వాపోయే వాడు.
Video Advertisement
ఈ క్రమం లో రాజు బుద్ధి మందగించింది. దీనితో.. అతను అన్న భార్య (వదిన) వద్దకు వచ్చి వెకిలి చేష్టలు వేసేవాడు. ఎన్ని సార్లు నచ్చచెప్పినా వినిపించుకునేవాడు కాదు. అంతకంతకు వేధింపులు ఎక్కువ అవుతుండడం తో.. ఆ వేధింపులు భరించలేక ఆమె ఈ విషయాన్నీ తన భర్త శీను తో చెప్పింది. దీనితో.. శీను కు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రాత్రి 12 గంటలు అవుతున్న సమయం లో రాజు మద్యం తాగి వచ్చి తనకు పెళ్లి చేయాలంటూ అన్న వదినలతో పోట్లాట కు దిగాడు. అన్న ముందరే.. వదిన తో అసభ్యం గా ప్రవర్తించాడు. ఈ క్రమం లో శీను మర్యాదగా ప్రవర్తించాలంటూ తమ్ముడికి నచ్చ చెప్పాడు. కానీ మాట వినకపోవడం తో ఘర్షణకు దిగాడు. ఈ క్రమం లో.. రాయి పెట్టి కొట్టగా.. రాజు తలకి గట్టిగా దెబ్బ తగిలి అక్కడిక్కడే మృతి చెందాడు.
End of Article