14
బాలీవుడ్ స్టార్ కపుల్ కరీనా, సైఫ్ అలీఖాన్ లు తమ పిల్లలతో కలిసి పర్యటనకు బయలుదేరారు. కాగా.. వీరికి ముంబై ఎయిర్పోర్ట్ లో చేదు అనుభవం ఎదురైంది. ముందుగా సైఫ్, తైమూర్ లు వెళ్లిపోగా.. వెనకాల కరీనా, కుమారుడు జహంగీర్, కేర్ టేకర్లు వస్తున్నారు. కాగా… కరీనా వెనక వస్తున్న కేర్ టేకర్ ను సీఐఎస్ఎఫ్ అధికారులు అడ్డుకున్నారు. పాస్ పోర్ట్ ను చూపించాలని కోరారు. వెనక్కు వచ్చిన కరీనా ను కూడా పాస్ పోర్ట్ ను చూపించాలని అడగ్గా.. కరీనా కూడా చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. స్టార్ లు అయినప్పటికీ.. సీఐఎస్ఎఫ్ అధికారులు తమ బాధ్యత చక్కగా నిర్వర్తించారంటూ నెటిజన్లు కితాబిస్తున్నారు.
Video Advertisement