Ads
సింహ, లెజెండ్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన మూడవ సినిమా అఖండ. దాంతో ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. అసలు ముందే రావాల్సిన అఖండ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది.
Video Advertisement
ఈ సినిమాతో వారిద్దరూ హ్యాట్రిక్ విజయం సాధిస్తారేమో అని అందరూ ఎదురుచూస్తున్నారు. సినిమాకి ముఖ్య హైలెట్ మాత్రం బాలకృష్ణ. రెండు పాత్రల్లో, అది కూడా ముఖ్యంగా అఖండ పాత్రల్లో బాలకృష్ణ చాలా పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అఖండ మొదటి షో అయిన తర్వాత నుండే హిట్ టాక్ తెచ్చుకుంది. బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాతో వారిద్దరు హ్యాట్రిక్ విజయం సాధించారు అని అంటున్నారు.
ఈ నేపధ్యంలో సినిమా బృందం నిన్న సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. అందులో హీరో బాలకృష్ణతో పాటు, దర్శకుడు బోయపాటి శ్రీను, సంగీత దర్శకుడు తమన్, అలాగే సినిమాకి పని చేసిన బృందం అంతా పాల్గొన్నారు. వారందరూ మాట్లాడి, సినిమాని ఇంత ఆదరించినందుకు ప్రేక్షకులకి థాంక్స్ చెప్పారు. ఈ క్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ, సినిమాకి ఇంత మంచి రెస్పాన్స్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.
Also Read: “ఆ నలుగురు” సినిమాను మొదట సీరియల్ గా తీయాలనుకున్నారట.. కానీ ఏమి జరిగిందంటే..?
అలాగే తాను సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు జరిగిన ఒక సంఘటన గురించి బాలకృష్ణ మాట్లాడారు. సినిమా హాల్ లో ప్రేక్షకులు సినిమాని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో బాలకృష్ణ చెప్పారు. బాలకృష్ణ మాట్లాడుతూ, “ఇంటర్వెల్ లో బయటికి వచ్చినప్పుడు చిన్న చిన్న పిల్లలు వచ్చి సినిమా బాగుంది అంకుల్ అన్నారు. ఆలా అనడం నాకు నచ్చలేదు. అంకుల్ ఏంటి అంకుల్? అంకుల్ , తాతా ఇలా పిలవడం ఎందుకు? అని అర్ధం వచ్చేలాగా బాలకృష్ణ సరదాగా మాట్లాడారు.
watch video :
End of Article