ఏరికోరి అందమైన అమ్మాయిని తెచ్చి కొడుక్కి పెళ్లి చేశారు.. కానీ అలా జరిగేసరికి…?

ఏరికోరి అందమైన అమ్మాయిని తెచ్చి కొడుక్కి పెళ్లి చేశారు.. కానీ అలా జరిగేసరికి…?

by Anudeep

ఏ అత్తా తన కోడలికి తల్లి కాలేదు. అలాగే.. ఏ కూతురు అత్తింటికి వచ్చాక తన అత్తని తల్లిలా భావించలేదు. కానీ, ఈ అత్తా కోడళ్ళు మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. మిగతా వారి సంగతి ఎట్లా ఉన్నా.. ఈ అత్త మాత్రం తన కోడలిని సొంత కూతురిలానే చూసుకుంది. చివరకు మరో వ్యక్తితో పెళ్లి కూడా చేసి పంపించింది.

Video Advertisement

ఆశ్చర్యంగా ఉంది కదా.. అసలు స్టోరీ ఏంటో మీరే చదవండి. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌ సికార్‌లో కమలా దేవి, దిలావర్‌ దంపతులు నివసిస్తున్నారు. వీరికి శుభమ్ అనే ఒక కొడుకు ఉన్నాడు.

kamaladevi 1

2016 లో వీరు తమ కొడుక్కి పెళ్లి చేయాలనుకున్నారు. చాలా సంబంధాలను చూసారు. చివరకు ఓ నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన సునీతను పెళ్లి చేసుకున్నారు. సునీత చాలా అందగత్తె. ఇద్దరు ఈడు జోడు బాగున్నారు అంటూ బంధువులంతా మెచ్చుకున్నారు. ఘనంగా వారి పెళ్లి జరిగింది. పేద కుటుంబం కావడంతో.. కమలా దేవి రూపాయి కట్నం కూడా తీసుకోకుండానే పెళ్లి జరిపించారు.

kamaladevi 2

అయితే, వారిని చూసి విధి కుళ్ళుకుంది. కొడుకు మరణం రూపంలో విధి వారిని వెక్కిరించింది. పెళ్లి జరిగిన ఆరు నెలలకే శుభమ్ మరణించాడు. దీనితో సునీతకు సూటి పోటి మాటలు ఎక్కువ అయ్యాయి. ఆమె నష్టజాతకురాలు కావడం వల్లే భర్త మరణించాడు అంటూ బంధువులంతా ఆడిపోసుకున్నారు. కానీ కమలా దేవి వారందరిని వారించింది. శుభమ్ బ్రెయిన్ డెడ్ తో మరణించాడు. కొడుకు చనిపోతే.. అందులో కోడలి తప్పు ఏముందని కమలాదేవి ప్రశ్నించింది.

kamaladevi 3

బంధువుల నోర్లు మూయించి సునీతను కన్న కూతురిలా చూసుకుంది. ఆమెది పేద కుటుంబం కావడంతో తల్లి తండ్రుల వద్దకు పంపకుండా తన వద్దే ఉంచుకుని ఆమెను చదివించింది. తాజాగా, ఎంఏ బీఈడీ ను పూర్తి చేసిన సునీత జూనియర్ లెక్చరర్ గా ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా సంపాదించుకుంది. తాజాగా శనివారం నాడు కమలాదేవి ఆమెకు ముఖేష్‌ అనే వ్యక్తితో వివాహం కూడా చేయించింది. కమలాదేవి, దిలావర్ దంపతులే కాళ్ళు కడిగి కన్యాదానం చేసారు. తాజాగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


You may also like