అక్కాచెల్లెలను పెళ్లి చేసుకున్న ఈ వరుడి గురించి న్యూస్ వైరల్ అయ్యింది…కానీ వెనకున్న ఈ కథ తెలుసా.?

అక్కాచెల్లెలను పెళ్లి చేసుకున్న ఈ వరుడి గురించి న్యూస్ వైరల్ అయ్యింది…కానీ వెనకున్న ఈ కథ తెలుసా.?

by Anudeep

Ads

ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు అన్నిటి తో పాటు మొగుడిని కూడా పంచుకున్నారు. వారిద్దరూ ఒకే వ్యక్తి ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కర్ణాటక లోని కోలార్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కరోనా కాలం లో పెళ్లిళ్లే ఆగిపోతున్నాయి. చేసుకున్న ఒక్క అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితి లో ఆ అక్క చెల్లెళ్లను పెళ్లి చేసుకోవడానికి ఉమాపతి అనే వ్యక్తి ముందుకొచ్చాడు. ఇంతకీ ఆ అక్క చెల్లెళ్ళ కథ ఏంటో చూడండి.

Video Advertisement

supriya,lalitha, umapathi

తిమ్మరావుతనహళ్ళి గ్రామ పంచాయతీ వేగమడుగు గ్రామం లో రాణెమ్మ, నాగరాజప్ప లది రైతు కుటుంబం. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. ఈ అక్క చెల్లెళ్ళు ఎంతో ప్రేమగా పెరిగారు. అయితే చెల్లెలు లలిత పుట్టకతోనే మూగ, చెవుడు సమస్య తో బాధపడుతోంది. దీనితో.. ఆమెకు పెళ్లి ఎలా అవుతోంది అని అక్క బాధపడేది. అయితే.. తామిద్దరం ఒకరినే పెళ్లాడాలని నిర్ణయించుకున్నారు. దీనితో..వీరికి పెళ్లి చేయడం తల్లి తండ్రులకు ఇబ్బందికరం గా మారింది. ఈ క్రమం లో భాగేపల్లి కి చెందిన ఉమాపతి సుప్రియను పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చాడు. ఆమె తన చెల్లిని కూడా పెళ్లి చేసుకోవాలని.. లేకుంటే ఈ పెళ్లి జరగదని.. అతడిని ఒప్పించింది. అలా పెద్దల సమక్షం లో.. అందరి అంగీకారం తో వారిద్దరి తో ఉమాపతి వివాహం జరిగింది. ఈ సంగతి తెలియకుండానే.. ఈ ఫోటో వైరల్ అయింది. మరో వైపు లలిత కు 18 సంవత్సరాలు నిండకపోవడం తో.. పోలీసులు ఉమాపతి తో పాటు మరో 7 గురి పై కేసు నమోదు చేసారని తెలుస్తోంది.


End of Article

You may also like