Ads
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భోళా శంకర్’. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించగా, తమన్నా హీరోయిన్గా నటించింది. మరో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలుగా నటించింది. యంగ్ హీరో సుశాంత్ కీలక పాత్రలో నటించాడు.
Video Advertisement
నిర్మాత అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రం తాజాగా రిలీజ్ అయ్యింది. అయితే ఈ మూవీకి యూఎస్లో వేసిన ప్రీమియర్స్ షోలలో ఊహించని కలెక్షన్స్ వచ్చాయని తెలుస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.. మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ మూవీ ఆగస్ట్ 11 న ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఓవర్సీస్ తో పాటు చాలా ఏరియాలలో ఈ మూవీకి డీసెంట్ టాక్ వచ్చింది. మ్యాట్నీ షో నుండి బుకింగ్స్ పెరిగినట్లు తెలుస్తోంది. అందువల్ల ఈ మూవీకి మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే మిగిలిన ప్రాంతాలతో పోల్చితే ఓవర్సీస్లో ముందుగానే ‘భోళా శంకర్’ మూవీ షోలకు సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.
అయితే ఈ మూవీకి ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో కలెక్షన్ రావడం లేదని సమాచారం. ఎందుకంటే ఓవర్సీస్లో అతి తక్కువ ఏరియాలలోనే ఈ మూవీ రిలీజ్ చేశారు. ప్రధానంగా యూఎస్లో 309 లొకేషన్లలో ఈ మూవీ ప్రీమియర్ షోలను వేశారు. దాంతో 308K డాలర్లు మాత్రమే కలెక్ట్ చేసిందని తెలుస్తోంది. అంటే ఇండియన్ కరెన్సీలో 2.54 కోట్ల రూపాయల గ్రాస్ను వసూలు చేసింది.
మెగాస్టార్ చిరంజీవి సినిమాలలో రీఎంట్రీ ఇచ్చిన తరువాత నటించిన సినిమాలు ప్రీమియర్స్ ద్వారా ఓవర్సీస్లో మంచి కలెక్షన్స్ సాధించాయి. వాటితో పోలిస్తే ‘భోళా శంకర్’ సినిమా తక్కువ వసూళ్లను రాబట్టిందని అంటున్నారు. ఈ క్రమంలోనే హీరో బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ ప్రీమియర్ వసూళ్లతో ‘భోళా శంకర్’ కలెక్షన్స్ పొలుస్తున్నారు. ప్రీమియర్స్ ద్వారా బాలయ్య సినిమా 708k డాలర్లను కలెక్ట్ చేసిందని, చిరంజీవి మూవీ దానిలో సగం కూడా వసూల్ చేయలేదని అంటున్నారు.
Also Read: OTT లో ఈ వారం స్ట్రీమింగ్ అవుతున్న 16 సినిమాలు..! ఏ సినిమా / సిరీస్ ఎందులో స్ట్రీమ్ అవుతుంది అంటే..?
End of Article