“నేను ప్రేమించిన అబ్బాయి చనిపోయాడు.. “అంటూ కన్నీళ్లు పెట్టిన సిరి.. షణ్ముఖ్ కూడా…?

“నేను ప్రేమించిన అబ్బాయి చనిపోయాడు.. “అంటూ కన్నీళ్లు పెట్టిన సిరి.. షణ్ముఖ్ కూడా…?

by Anudeep

Ads

ప్రతి ఒక్కరికి తొలిప్రేమ మర్చిపోలేని జ్ఞాపకాలను మిగులుస్తుంది. అది పెళ్లి వరకు వెళ్లినా.. ఓడిపోయినా… ఆ ప్రేమ తియ్యని జ్ఞాపకాలనే మిగులుస్తుంది. తాజాగా.. బిగ్ బాస్ హౌస్ లో పార్టిసిపేట్ చేస్తున్న కంటెస్టెంట్ లు కూడా తమ తొలి ప్రేమ జ్ఞాపకాలను తలుచుకుని ఉద్వేగభరితమయ్యారు. కంటెస్టెంట్ లు అందరు తమ ఫస్ట్ లవ్ ఎక్సపీరియెన్స్ గురించి అందరితో పంచుకున్నారు.

Video Advertisement

bigboss 1

సింగర్ శ్రీ రామ చంద్ర మాట్లాడుతూ తాను ప్రేమించిన అమ్మాయికి ఇప్పటికే పెళ్లి అయిపోయి పిల్లలు కూడా ఉన్నారని చెప్పుకొచ్చారు. జెస్సి కూడా తాను ప్రేమించిన అమ్మాయి గురించి చెప్పాడు. ఆమె సింగల్ అయితే.. మింగిల్ అవడానికి తాను సిద్ధం గా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. శ్వేతా వర్మ మరింత ఎమోషనల్ అయిపోయారు. తనలో ఇన్ని షేడ్స్ ఉన్నాయని తనకి చూపించింది తన ఫస్ట్ లవ్వేనని చెప్పుకొచ్చింది.

bigboss 2

ఇప్పుడు నేను మ్యారీడా? సెపరేటా..? విడాకులు తీసుకున్నానా ? అన్నది తనకే తెలియదని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తరువాత సిరి ఓపెన్ అవుతూ.. తాను ప్రేమించిన అబ్బాయి ఇక లేడు.. అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తరువాత షణ్ముఖ్ కూడా ఓపెన్ అయ్యాడు. దీప్తి సునయన కంటే తనకి ముందే ఓ లవర్ ఉన్నట్లు చెప్పాడు. ఇక ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ కూడా ఓపెన్ అయ్యారు. తాను ప్రేమించిన అబ్బాయి బండి పై వెళ్లిపోతుంటే.. వెనకాలే పరిగెత్తిన రోజులని గుర్తు చేసుకుని బాధపడ్డారు. ఇలా.. అందరు తమ లవ్ స్టోరీలను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.

Watch Video:


End of Article

You may also like