ఫస్ట్ నైట్ కి భయపడి దారుణానికి పాల్పడ్డ కొత్త పెళ్ళికొడుకు.. షాక్ లో మునిగిపోయిన కుటుంబం..

ఫస్ట్ నైట్ కి భయపడి దారుణానికి పాల్పడ్డ కొత్త పెళ్ళికొడుకు.. షాక్ లో మునిగిపోయిన కుటుంబం..

by Anudeep

Ads

పెళ్లి అంటే నూరేళ్ళ పంట. ఓ జంట కొత్తగా పెళ్లి చేసుకున్న తరువాత ఎన్నో కలలతో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. కానీ ఈ కొత్త పెళ్లి కొడుకు మాత్రం ఆ కలలని ఆదిలోనే తుంచేశాడు. పెళ్లి చేసుకుని వారం రోజులు కూడా అవ్వకుండానే ప్రాణాలు తీసుకుని కుటుంబ సభ్యులకి.. కొత్తగా వచ్చిన భార్యకి విషాదాన్ని మిగిల్చాడు.

Video Advertisement

ఈ దారుణం మాచర్ల సాగర్ రింగ్ రోడ్డు వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మాచర్ల సాగర్ రింగ్ రోడ్డు నివాసులైన సత్యనారాయణ విజయలక్ష్మి దంపతులకు కిరణ్ అనే కుమారుడు ఉన్నాడు. అతని వయసు 32 సంవత్సరాలు. ఈ నెల 11 వ తేదీన అతనికి వివాహం అయ్యింది. ఈ క్రమంలోనే అతనికి 16 వ తేదీన శోభనానికి ముహూర్తం పెట్టారు. సాధారణంగా పెళ్లి అయిన తరువాత యువకులు ఫస్ట్ నైట్ విషయంలో కొంత కంగారు ఉన్నప్పటికీ.. సంతోషంతో ఎదురు చూస్తూ ఉంటారు.

bridegroom 1

కానీ, కిరణ్ కుమార్ కు మాత్రం ఫస్ట్ నైట్ అంటే గుబులు పట్టుకుంది. దీనితో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించేసుకున్నాడు. ఇటీవలే గుంటూరు బస్టాండ్ లో నాలుగు గంటల సమయంలో బస్సు దిగిన కిరణ్ ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళాడు. ఎంత సేపు గడుస్తున్నా అతను ఇంటికి రాలేదు. అతని సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో గాబరా మొదలైంది. బంధువులకు సమాచారం అందించారు. అతని గురించి ఎంత వెదికినా అతని ఆచూకీ దొరకలేదు.

bridegroom 2

ఈ విషయమై పోలీసుల సాయం కూడా తీసుకున్నారు. చివరకు కృష్ణా నది ఎగువ ప్రాంతంలో మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది. అక్కడ దొరికిన మొబైల్ ఆధారంగా అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా.. కిరణ్ తల్లి తండ్రులు అక్కడకు చేరుకున్నారు. కిరణ్ మృతదేహాన్ని చూసిన తల్లి అది కిరణ్ దేనని గుర్తుపట్టింది. ఫస్ట్ నైట్ అంటే భయపడ్డాడని.. తాము, అతని సన్నిహితులు ఎంతగానో ధైర్యం చెప్పి చూశామని కానీ ఇంతటి పని చేస్తాడని ఉహించలేకపోయామని, మమ్మల్ని ఆ కట్టుకున్న పిల్లని అన్యాయం చేసాడని.. ఆ తల్లి భోరున విలపించడం చూసి చుట్టుపక్కల వారంతా కంటతడి పెడుతున్నారు.


End of Article

You may also like