మత్తు వదలరా సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు శ్రీ సింహ. ఈ సినిమా సైలెంట్ గా రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత నుండి శ్రీ సింహ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇప్పుడు ఉస్తాద్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
- చిత్రం : ఉస్తాద్
- నటీనటులు : శ్రీ సింహ కోడూరి, కావ్య కళ్యాణ్రామ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, అను హాసన్, రవీంద్ర విజయ్, వెంకటేష్ మహా.
- నిర్మాత : రజనీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు
- దర్శకత్వం : ఫణిదీప్
- సంగీతం : అకీవా బి
- విడుదల తేదీ : ఆగస్ట్ 12, 2023

స్టోరీ :
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా కథ మొదలవుతుంది. సూర్య (శ్రీ సింహ) అక్కడే పుట్టి పెరిగిన ఒక అబ్బాయి. చిన్నప్పుడే సూర్య తండ్రి (వెంకటేష్ మహా) చనిపోవడంతో, తల్లి (అను హాసన్) సూర్యని పెంచుతుంది. అయితే సూర్యకి ఎత్తైన ప్రదేశాలు అంటే భయం. అంతే కాకుండా కోపం కూడా విపరీతంగా ఉంటుంది. జీవితంలో ఏ విషయం మీద క్లారిటీ ఉండదు. డిగ్రీలో ఉన్నప్పుడు సూర్య ఒక బైక్ కొనుక్కుంటాడు. ఆ బైక్ కి ఉస్తాద్ అని పేరు పెడతాడు.

ఆ తర్వాత మేఘన (కావ్య కళ్యాణ్రామ్) తో ప్రేమలో పడతాడు. అయితే సూర్య తర్వాత పైలట్ అవ్వాలని నిర్ణయించుకుంటాడు. అసలు ఎత్తైన ప్రదేశాలు అంటే భయం ఉన్న సూర్య పైలట్ అవ్వాలని నిర్ణయించుకోవడంతో కథ మలుపు తిరుగుతుంది. సూర్య తన భయాన్ని ఎలా అధిగమించాడు? పైలట్ అయ్యాడా? ఆ తర్వాత సూర్య ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? తన ప్రేమ కథలో ఎలాంటి సమస్యలు వచ్చాయి? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
కీరవాణి గారి కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన శ్రీ సింహ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఆయన మొదటి సినిమా అయిన మత్తు వదలరా, ఆ తర్వాత వచ్చిన తెల్లవారితే గురువారం సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. ఇటీవల వచ్చిన భాగ్ సాలే సినిమా మాత్రం ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. ఇంక ఉస్తాద్ సినిమా విషయానికి వస్తే కథ కోసం దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగుంది. అది కూడా ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా రూపొందించారు అనంగానే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగాయి.

సినిమాలో చాలా మంది మంచి యాక్టర్లుగా పేరు పొందిన నటీనటులు ఉన్నారు. అందుకే ప్రతి పాత్ర తెరపై చూపించిన విధానం బాగుంది. హీరో హీరోయిన్లుగా నటించిన శ్రీ సింహ, కావ్య కూడా బాగా నటించారు. సినిమా చూస్తున్నంత సేపు ప్రతి ఒక్క యాక్టర్ నటనలో సహజత్వం కనిపిస్తుంది. అలాగే పవన్ కుమార్ పప్పుల అందించిన సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. కానీ కథని తెరపై చూపించే విషయంలో మాత్రం ఇంకా జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది. సినిమా చాలా సాగదీసినట్టు అనిపిస్తుంది.

చిన్న పాయింట్ ని చాలా ఎక్కువ సేపు చూపించడానికి ప్రయత్నం చేశారు. కొన్ని సీన్స్ అయితే ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయి. అసలు ఒక పాయింట్ తర్వాత సినిమా ఎటో పోతుంది ఏమో అనిపిస్తుంది. హీరో హీరోయిన్స్ కి మధ్య వచ్చే డైలాగ్స్, కామెడీ బాగానే ఉన్నాయి. అంత మంచి ఎమోషన్స్ ఉన్న స్టోరీ సినిమా ల్యాగ్ కారణంగా ప్రేక్షకులకి కనెక్ట్ అవ్వదు. స్క్రీన్ ప్లే ఇంకా కొంచెం ఫాస్ట్ గా ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- దర్శకుడు ఎంచుకున్న పాయింట్
- సినిమాటోగ్రఫీ
- నటీనటులు
- కొన్ని కామెడీ సీన్స్
మైనస్ పాయింట్స్:
- సినిమా నిడివి
- సాగదీసినట్టుగా ఉండే స్క్రీన్ ప్లే
రేటింగ్ :
2.5 / 5
ట్యాగ్ లైన్ :
దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నా కూడా చూపించడంలో విఫలం అయ్యారు ఏమో అనిపిస్తుంది. ఇంత సాగదీయకుండా ఉన్నట్టు అయితే సినిమా ఫలితం వేరేగా ఉండేది ఏమో. ఇప్పుడు అయితే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూస్తే ఉస్తాద్ సినిమా ఒక్కసారి చూడగలిగే యావరేజ్ సినిమాగా నిలుస్తుంది.
watch trailer :
ALSO READ : “సినిమాలో వీటి అవసరం ఏం ఉంది..?” అంటూ… చిరంజీవి “భోళా శంకర్” మూవీపై కామెంట్స్..!

పైన ఫోటోలో సైకిల్ మీద కూర్చున్న చిన్నోడు ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ టాలీవుడ్ స్టార్ హీరో మాత్రమే కాకుండా ఇతని తమ్ముడు కూడా హీరోనే. అతని తండ్రి టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్ గా రాణిస్తున్నారు. ఈ హీరో తండ్రి నాన్న కూడా ఒకప్పుడు తెలుగులో ప్రముఖ నటుడిగా రాణించి, కాలం చేశారు. ఈ హీరో తన స్టైల్ తో ఆకట్టుకుని స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు.
ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన ఈ హీరోకి అమ్మాయిల ఫోలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీతో బిజీగా ఉన్న ఈ స్టార్ హీరో మరెవరో కాదు అల్లు అర్జున్. అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీతో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. ఈ మూవీ సంచలన విజయం సాధించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు అందరూ ‘పుష్ప 2’ సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలకపాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ సమకూరుస్తున్నారు. ఈ మూవీ నుండి రిలీజ్ అయిన టీజర్ తో మూవీ పై మరిన్ని అంచనాలు పెరిగాయి.
కొత్త తరహ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీ కథ విషయానికి వస్తే, హైదరాబాద్లో అమ్మాయిలు వరుగా అపహరణకు గురవుతుంటారు. సుమారు 16 మంది కనిపించకపోవడంతో ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం కేరళ నుండి ఐపీఎస్ ఆద్య (నందితా శ్వేతా)ను సిటీకి రప్పిస్తారు. అప్పటికే ఈ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసు ఆఫీసర్ అభయ్ (అశ్విన్ బాబు) తో పాటు ఆద్య కూడా విచారణ మొదలుపెడుతుంది.
తప్పిపోయిన అమ్మాయిలకు ఏమైంది? అమ్మాయిలను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఈ కేసుకు అండమాన్ దీవుల్లో నివసించే గిరిజన తెగ హిడింబాలకు ఉన్న సంబంధం ఏంటి? ఆద్య, అభయ్ ఈ కేసును చేధించారా? అనేదే మిగతా కథ. ఎంచుకున్న కథ ఎంత గొప్పది అయినా, ఎంత క్రియేటివ్గా చూపించినా ఆడియెన్స్ కి అర్థం కాకపోతే ఆ మూవీతో కనెక్ట్ కాలేరు. ఈ మూవీలో అదే జరిగింది.
నిజానికి ఈ మూవీ కాన్సెప్ట్ కొత్తది. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ చూపిస్తూ, వర్తమానంలో జరిగే సీన్స్ చూపించడంతో స్టోరీ ఎక్కడ నడుస్తుందో అర్థం కాకపోవడం ఆడియెన్స్ ను గందరగోళానికి గురి చేస్తుంది. ఇంటర్వెల్ సన్నివేశం సెకండాఫ్ పై ఇంట్రెస్ట్ ను పెంచుతుంది.
అసలు స్టోరీ సెకండాఫ్లో చూపించారు. హిడింబ తెగ నేపథ్యం, హైదరాబాద్ లో జరుగుతున్న కిడ్నాపులకు, హిడింబ తెగకు కనెక్షన్ ఉండడం, క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టులు ఆడియెన్స్ ను థ్రిల్ కు గురిచేస్తుంది. అయితే డైరెక్టర్ పలు చోట్ల సినిమాటిక్ లిబర్టీ ఉపయోగించుకున్నాడు. థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడే వారికి ఈ మూవీ నచ్చుతుంది.
మెగాస్టార్ చిరంజీవి మూవీ అంటే ఇష్టపడని ఆడియెన్స్ ఉండరు. ముఖ్యంగా మెగా అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ ఈరోజు (ఆగస్టు 11) థియేటర్లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీ కోలీవుడ్ సూపర్ హిట్ వేదళం మూవీకి రీమేక్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే. సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ మూవీలో చిరంజీవి, కీర్తి సురేష్ అన్నాచెల్లెళ్ళుగా నటించారనే విషయం తెలిసిందే.
భోళా శంకర్ మూవీ నుండి రిలీజ్ అయిన టీజర్, పాటలు, ట్రైలర్ కి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో కామెంట్ల రూపంలో తెలియచేస్తున్నారు. కొందరు సినిమా ఫస్ట్ హాఫ్ బాగుందని, మెగాస్టార్ చిరంజీవి లుక్స్ మరియు యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. కామెడీ సన్నివేశాలు పర్వాలేదని చెబుతున్నారు. ఇంటర్వెల్ బాంగ్ తో ప్రధమార్ధం పర్వాలేదని అంటున్నారు
అయితే ఈ చిత్రంలో చిరంజీవి, హీరోయిన్ తమన్నా మధ్యలో పెట్టిన లవ్ ట్రాక్ అంతగా ఆకట్టుకోలేదని, అలాగే ఖుషి నడుము సీన్ కూడా అంతగా సెట్ అవలేదని, భోళా శంకర్ సినిమాలో ఇలాంటి సన్నివేశాలు పెట్టడం అవసరమా అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.
అయితే ఈ మూవీకి ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో కలెక్షన్ రావడం లేదని సమాచారం. ఎందుకంటే ఓవర్సీస్లో అతి తక్కువ ఏరియాలలోనే ఈ మూవీ రిలీజ్ చేశారు. ప్రధానంగా యూఎస్లో 309 లొకేషన్లలో ఈ మూవీ ప్రీమియర్ షోలను వేశారు. దాంతో 308K డాలర్లు మాత్రమే కలెక్ట్ చేసిందని తెలుస్తోంది. అంటే ఇండియన్ కరెన్సీలో 2.54 కోట్ల రూపాయల గ్రాస్ను వసూలు చేసింది.
మెగాస్టార్ చిరంజీవి సినిమాలలో రీఎంట్రీ ఇచ్చిన తరువాత నటించిన సినిమాలు ప్రీమియర్స్ ద్వారా ఓవర్సీస్లో మంచి కలెక్షన్స్ సాధించాయి. వాటితో పోలిస్తే ‘భోళా శంకర్’ సినిమా తక్కువ వసూళ్లను రాబట్టిందని అంటున్నారు. ఈ క్రమంలోనే హీరో బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ ప్రీమియర్ వసూళ్లతో ‘భోళా శంకర్’ కలెక్షన్స్ పొలుస్తున్నారు. ప్రీమియర్స్ ద్వారా బాలయ్య సినిమా 708k డాలర్లను కలెక్ట్ చేసిందని, చిరంజీవి మూవీ దానిలో సగం కూడా వసూల్ చేయలేదని అంటున్నారు.
#1 జీ 5




గతంలో మెహర్ రమేష్ ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, విక్టరీ వెంకటేష్ లాంటి అగ్ర హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలను తీసినప్పటికీ, అవి హిట్ అందుకోలేకపోయాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ తో మంచి కమ్ బ్యాక్ కావాలని భావిస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే షోలు పడడంతో మూవీ చూసిన ఆడియెన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.
భోళా శంకర్ సినిమాను చూసినవారు కొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు ఈ మూవీ లోని సీన్స్ కు సంబంధించిన ఫోటోలతో కూడిన మీమ్స్ తో ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మీమ్స్ సామాజిక మధ్యమాలలో ట్రెండ్ అవుతున్నాయి. అవి ఏమిటో మీరు చూసేయండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.








భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన జైలర్ మూవీకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీలో రజనీకాంత్ భార్య పాత్రలో సీనియర్ నటి రమ్యకృష్ణ నటించింది. ఈ మూవీలో కీలకమైన రజిని కాంత్ కొడుకు అర్జున్ పాత్రలో తమిళ హీరో వసంత్ రవి నటించారు. ఈ చిత్రం వసంత్ నటించిన నాలుగవ చిత్రం. ఇటీవల రిలీజ్ అయిన తమిళ డబ్బింగ్ మూవీ అశ్విన్స్ లో హీరోగా వసంత్ రవి నటించారు.
వసంత్ రవి అసలు పేరు వసంత్ కుమార్ రవి. ఇతను హీరో మాత్రమే కాదు డాక్టర్ కూడా. చెన్నై లో ఫేమస్ రెస్టారెంట్ అయిన ‘నమ్మ వీడు వసంత భవన్ చైన్ ఆఫ్ రెస్టారెంట్స్’ చైర్మన్ రవి ముత్తుకృష్ణన్ కుమారుడు వసంత్ రవి. 2017లో మొదటిసారి అతను ‘తారామణి’ అనే చిత్రంలో నటించాడు.
ఆ మూవీ హిట్ అయ్యింది. ఆ మూవీలోని నటనకు గాను వసంత్ ఉత్తమ నటుడుగా విజయ్ అవార్డ్ మరియు ఫిల్మ్ఫేర్ అవార్డ్ ను అందుకున్నాడు. అతను నటించిన రెండవ సినిమా ‘రాకీ’ ఈ మూవీకి ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుండి ప్రశంసలు లభించాయి. ఆ తరువాత హర్రర్ మూవీ ‘అశ్విన్స్’ లో హీరోగా నటించిన వసంత్ ‘జైలర్’ మూవీలో అర్జున్ అనే ఏసీపీ పాత్రలో మెప్పించారు.






