సూపర్ స్టార్ మహేష్ బాబు, పరశురామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ మూవీ గత ఏడాది మే 12న రిలీజ్ అయ్యి, మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం మహేష్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ సినిమాగా నిలిచింది.
ఈ మూవీలో మహేష్ బాబు చెప్పే డైలాగ్స్ ఆడియెన్స్ ను అలరించాయి. దర్శకుడు పరశురామ్ ఈ చిత్రానికి డైలాగ్స్ ను రాశారు. అయితే ఈ మూవీలో బ్యాంక్ గురించి మహేష్ చెప్పిన డైలాగ్ ను అంతకుముందే మరో హీరో చెప్పారట. మరి ఆ హీరో ఎవరో? ఏ మూవీలో చెప్పారో ఇప్పుడు చూద్దాం..
మహేష్ బాబు, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘సర్కారు వారి పాట’. ఈ మూవీలో మహేష్ నటన, డైలాగ్స్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించగా, సాంగ్స్ అన్ని హిట్ అయ్యాయి. ముఖ్యంగా ‘కళావతి’ పాట అయితే ఒక ఊపు ఊపిందని చెప్పవచ్చు.
ఈ పాటకు చాలా మంది సెలెబ్రిటీలు కూడా రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఈ మూవీలో మహేష్ బాబు బ్యాంక్ గురించి చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. అయితే ఈ డైలాగ్ ను గతంలో వచ్చిన ఒక మూవీలో వేరే హీరో చెప్పడం విశేషం. ఆ హీరో చెప్పిన డైలాగ్ కు సంబంధించిన వీడియోను ట్రోల్ ప్లాజా అనే ఇన్ స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు.
ఆ డైలాగ్ చెప్పిన హీరో శ్రీకాంత్, నిన్నే ప్రేమిస్తా మూవీలో బ్యాంక్ మేనేజర్ పాత్రలో శ్రీకాంత్ నటించారు. అక్కడి ప్రజలకి “డబ్బు అంటే లక్ష్మీ, ఆ లక్ష్మీ కొలువై ఉండేది బ్యాంక్ లో కదా! ఆ బ్యాంక్ గుడి లాంటిది. అంటే ఎంత పవిత్రంగా చూసుకోవాలి” అని చెప్తారు. ఈ వీడియో చూసిన నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
https://www.instagram.com/reel/CtQeMD8pR7L/?igshid=NjZiM2M3MzIxNA%3D%3D
Also Read: “తలైవా ఈజ్ బ్యాక్..!” అంటూ… రజనీకాంత్ “జైలర్” రిలీజ్పై 15 మీమ్స్..!

గత కొంతకాలం నుండి ‘గుంటూరు కారం’ సినిమా గురించి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. హీరోయిన్ పూజా హెగ్డే ఈ మూవీ నుండి తప్పుకుందని, ఆమె స్థానంలో శ్రీలీలను, సెకండ్ హీరోయిన్ గా మీనాక్షీ చౌదరిని తీసుకున్నట్టు టాక్. ఆ తరువాత మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తొలగించారని, ఆ తరువాత సినిమాటోగ్రాఫర్ తప్పుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. వీటిపై చిత్ర యూనిట్ స్పందిస్తే తప్ప ఈ వార్తలు నిజమో, కాదో తెలియదు.
మరో వైపు త్రివిక్రమ్ పై విమర్శలు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. మహేష్ బాబు గుంటూరు కారం మూవీని పక్కన పెట్టి, పవన్ కళ్యాణ్ సినిమాల కోసం పని చేస్తున్నారని ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ బ్రో మూవీకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన విషయం తెలిసిందే. అయితే త్రివిక్రమ్ ఇలా చేయడం వెనుక ఉన్న అసలు నిజం ఇదే అంటూ ఒక ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేశారు.
ఆ పోస్ట్ లో “మహేష్ ఫ్యామిలీ ఫ్రెండ్ నా క్లాస్ మేట్. తను చెపుతుంది, పవన్ మీద ఉన్న అభిమానంతో, పవన్ కి పరోక్షంగా సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో త్రివిక్రంకి బ్రో మీద టైం స్పెండ్ చెయ్యడానికి మహేష్ అనుమతి ఇచ్చాడంట. మహేష్-పవన్ మధ్య ఉన్న బంధం ఎప్పటికీ బలంగానే ఉంది” అంటూ రాసుకొచ్చారు.
భోళా శంకర్ మూవీ నిర్మాత అనిల్ సుంకర ‘ఏజెంట్’ మూవీని నిర్మించారు. యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటించిన ఈ మూవీ ఏప్రిల్ 27న భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దాంతో ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, బయ్యర్లకి భారీ నష్టాలు వచ్చాయి. అయితే ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు ముప్పై కోట్లు తీసుకుని మోసగించారని వైజాగ్ కు చెందిన డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ వారి పై కోర్టులో కేసును వేశారు. ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు.
జెంట్ మూవీకి విశాఖపట్నం జిల్లా వరకే డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఇచ్చి, అగ్రిమెంట్ ను బ్రేక్ చేశారు. మే 1న ఇదే విషయం గురించి గరికపాటి కృష్ణ కిశోర్ని కలవగా, అతను నిర్మాత అనిల్ సుంకరతో మాట్లాడారని, ఏజెంట్ డిజాస్టర్ గా నిలిచిందని, అండర్ టేకింగ్ లెటర్ కూడా ఇస్తామని అన్నారు. ఆ తరువాత ‘సామజవరగమన’ విశాఖపట్నం హక్కులు తనకే ఇచ్చినా, నష్టపోయిన డబ్బులో కొంచెం మాత్రమే వచ్చిందని అన్నారు.
నలబై ఐదు రోజుల్లో లేదా నెక్స్ట్ రిలీజ్ కు 15 రోజుల ముందు మిగతా డబ్బును చెల్లిస్తామని అగ్రిమెంట్ ఇచ్చారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నెక్స్ట్ సినిమా ‘భోళా శంకర్’ గురించి మాట్లాడాలని ప్రయత్నిస్తుంటే వారు తనకు జవాబు చెప్పట్లేదు. ఫిలిం ఛాంబర్ కు చెప్పిన ఎలాంటి ప్రయోజనం కలుగలేదని, తప్పని పరిస్థితుల్లోనే కోర్టుకు వెళ్లాల్సి వచ్చిందని బత్తుల సత్యనారాయణ చెప్పుకొచ్చారు.
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ఈ చిత్రంలో కీలక పాత్రలలో వివిధ ఇండస్ట్రీలకు చెందిన స్టార్ హీరోలు నటించారు. మలయాళ ఇండస్ట్రీ నుండి మోహన్ లాల్, కన్నడ ఇండస్ట్రీ నుండి శివరాజ్ కుమార్, బలివుడ్ నుండి జాకీష్రాఫ్ నటించారు. రజిని కాంత్ భార్య పాత్రలో రమ్యకృష్ణ నటించగా, హీరోయిన్ తమన్నా, టాలీవుడ్ నటుడు సునీల్ కూడా ఈ మూవీలో నటించారు. విలన్ గా మలయాళ నటుడు వినాయకన్ నటించారు.
మొదట ఈ మూవీ పై అంతగా అంచనాలు లేనప్పటికీ, టీజర్, సాంగ్స్, రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ తో మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీలో ‘కావాలయ్యా’ సాంగ్ 100 మిలియన్ పైగా వ్యూస్ వచ్చాయి. ఇప్పటికే షోలు ప్రారంభం కావడంతో జైలర్ మూవీ చూసిన వారు తమ అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తున్నారు. కొందరు నెటిజెన్లు ఫస్ట్ హాఫ్ బాగుందని కామెంట్స్ చేస్తున్నారు.
ఇంటర్వల్ సన్నివేశంలో వింటేజ్ రజినీకాంత్ కనిపిస్తాడని, స్క్రీన్ ను షేక్ చేశాడని అంటున్నారు. మరికొందరు ఈ మూవీ రజినీకాంత్ అభిమానులకి ఫుల్ ఫీస్ట్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే జైలర్ మూవీ రిలీజ్ పై సోషల్ మీడియాలో పలు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఆ మీమ్స్ ఏమిటో మీరు చూసేయండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
దాదాపు రెండు నిముషాల 45 సెకన్ల నిడివి ఉన్న ట్రైలర్ లో విజయ్ దేవరకొండ, సమంత అందంగా కనిపించారు. ఆద్యంతం ఖుషి ట్రైలర్ ఆకట్టుకుంది. సమంత ముస్లింగా, బ్రాహ్మణ యువతిగా రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించింది. విప్లవ్, ఆరాధ్యలు వారి పెద్దలను ఎదిరించి మతాంతర వివాహం చేసుకుని, ఆ తరువాత ఎదుర్కొనే సమస్యలను చూపించారు. అలాగే విజయ్ దేవరకొండ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘భర్త ఎలా ఉండాలో చూపిస్తా’, ‘నేను స్త్రీ పక్షపాతిని’, ‘నా పిల్ల’ అనే డైలాగ్స్ బాగున్నాయి.
అయితే ట్రైలర్ లో విజయ్ దేవరకొండ అక్కడక్కడ అర్జున్ రెడ్డి మూవీలోని తన మార్క్ పెర్ఫార్మెన్స్ ను చూపించాడు. ఇక ట్రైలర్ లో చివర్లో విజయ్ దేవరకొండ ఒక మహిళతో ‘ఎందుకు బయపడుతున్నావమ్మా, మార్కెట్లో నా గురించి అట్లా అనుకుంటున్నారు కానీ, నేను స్త్రీ పక్షపాతిని’ అనే డైలాగ్ చెప్పే సీన్ లో ఉన్న నటి అర్జున్ రెడ్డి మూవీలో కూడా ఉంటుంది. అలాగే ‘నా పిల్ల’ అనే డైలాగ్ కూడా అర్జున్ రెడ్డిలో చెప్పిన డైలాగ్. ఈ ట్రైలర్ ను చూసిన నెటిజెన్లు ఈ రెండు విషయాల పై కామెంట్స్ చేస్తున్నారు.






మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ భోళా శంకర్. ఈ చిత్రంలో తమన్నా. కీర్తి సురేష్, సుశాంత్ నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పాటలు, ట్రైలర్ కి ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ ఆగస్ట్ 11 న రిలీజ్ కానుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అయితే ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఈ మూవీ యావరేజ్ టాక్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరో వైపు సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో తమన్నా, రమ్యకృష్ణ కీలకపాత్రలలో నటించారు. జైలర్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో మొదలయ్యాయి. ఇక మూవీలోని ‘కావాలయ్యా సాంగ్’ తమిళ వెర్షన్ కు 100 మిలియన్ల వ్యూస్ అందుకుంది.
“బ్రో సినిమా ఎలా ఉంది?” అని కోరాలో అడుగగా, దానికి
ఇవన్నీ తెలుగులో పూర్తిగా మార్చారు. కానీ సినిమాలో అవసరమైన ఇంటర్ loods లేవనే చెప్పాలి. సినిమా సంభాషణలు మరియు స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఇచ్చి పెద్ద తప్పు చేశారు. ఆయన దృష్టి అంతా అంతర్లీనంగా భావం ఉండే డైలాగ్స్ మీద. సాధారణ ప్రేక్షకులకు అర్థం కాకుండా మరో అజ్ఞాతవాసి రచన చేశారా? అనిపించింది. ఎంతో హాస్యాన్ని పండించవచ్చు. యమలోకం భూలోకం కాన్సెప్ట్ మీద తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. ఎంతో వినోదాన్ని పంచే ఈ సినిమాలో చాలా అవకాశం ఉంది. దర్శకత్వం సముద్రఖనికి ఇవ్వడం మరో పెద్ద తప్పు.
తెలుగు నేటివిటీకి దూరంగా ఉంటుంది. ఇది హాస్యం పండించగల సీనియర్ తెలుగు దర్శకుడికి గాని లేదా వేరే కొత్త డైరెక్టర్ కి ఇచ్చినా మరింత హాస్యాన్ని పండించేవారు. పాటలు కూడా ఆశాజనకంగా లేవు. సినిమా హాల్లో స్పందన కరువైంది. శ్యాంబాబు పృధ్వి ఎపిసోడ్ అసలు పెద్దగా ఏమీ లేనేలేదు. అయినా సినిమా మొదట్లో వేసిన విజ్ఞాపన disclimer ప్రకారం ఈ సినిమాలో ఏ జంతువుల్ని హింసించడం జరగలేదు అని ముందే రాశారు. మొత్తానికి బ్రో సినిమా ఫ్లాప్ అని అనలేము హిట్ అని అనలేము.
బహుశా ఈ చిత్రానికి పని చేసిన సినీ కళాకారులు మరియు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ హౌస్ లాంటి పెద్ద పెద్ద పేర్లు చూసి మనలో అంతర్లీనంగా ఉన్న ఒక బాధేమో ? స్థూలముగా అంతగా ఆకట్టుకోలేని సినిమా. పదేపదే సినిమాల్లో గతంలో పవన్ కళ్యాణ్ చార్ట్ బస్టర్ పాటలు వినిపించడం తీవ్ర అనారోగ్యనికి లోనయ్యా. ఏదైనా ఒక పాట రెండు సెకండ్లు అలా వచ్చి అలా వెళ్ళిపోతే అభిమానులకి కిక్ ఉంటుంది.
పూర్తి స్థాయిలో పెడితే ఇలాగే ఉంటుందని ఇదొక పెద్ద విఫల ప్రయోగం. చెప్పాలంటే నాకు సినిమా అరగలేదు వేడి చేసింది. అజీర్ణంగా ఉంది. అందుకని ధనియాలు జీలకర్ర నిమ్మకాయ రసం తాగా. సినిమా కాన్సెప్ట్ మూల కథ మంచిదండోయ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు క్షమాపణలతో, ఒకసారి వీక్షణకు ఉపయుక్తం” అంటూ రాసుకొచ్చారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ మూవీలో తమన్నా, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటించగా, సుశాంత్ కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం నాడు జరుగగా, కమెడియన్ హైపర్ ఆది ఇచ్చిన స్పీచ్ ఇంట్రెస్టింగ్ గా సాగింది. ఆది మెగా కుటుంబాన్ని విమర్శించేవారికి తనదైన ప్రాస, పంచ్లతో సమాధానం చెప్పాడు. సహజంగా హీరోలకు అభిమానులు ఉంటారు. కానీ మెగాస్టార్ చిరంజీవికి మాత్రం హీరోలే అభిమనులుగా ఉంటారని అన్నారు. ఆది తన పంచ్ లతో మెగా అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించాడు.
హైపర్ ఆది భోళాశంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ కామెంట్స్ చేసిన తరువాత సదరు ట్విట్టర్ యూజర్ ‘ఈ ట్వీట్ మనం మూడున్నరేళ్ల క్రిందటే వేసాం’ అంటూ ఆ ట్వీట్ ని షేర్ చేయడంతో నెటిజెన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.
1. సూపర్ స్టార్ రజినీకాంత్:
2. ధర్మేంద్ర:
3. మనీషా కోయిరాల:
4. సంజయ్ దత్:
5. ఫర్ధీన్ ఖాన్:
6. పూజా భట్: