ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన చిత్రం బేబీ. విడుదలైన 10 రోజులలోనే 60 కోట్లకు పైగా గ్రాస్ ప్రాఫిట్ వసూలు చేసి తన సత్తా చాటింది. వీక్ డే అయినా ,భారీగా వానలు పడుతున్న బేబీ జోరుకు బ్రేక్ అయితే పడలేదు.
ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విభిన్న ప్రేమ కథ చిత్రం ఇది. ఇందులో హీరో హీరోయిన్గా నటించిన వారికి ఈ మూవీ బాగా క్రేజ్ తెచ్చింది.

అయితే ఇటువంటి మూవీని స్క్రిప్ట్ కూడా చూడకుండా, స్టోరీ ఏంటో తెలుసుకోకుండా ఒక హీరో వదులుకున్నాడు. ఈ మూవీకి డైరెక్టర్ గా వ్యవహరించిన సాయి రాజేష్ ఎవరు ఊహించని విధంగా హృదయ కాలేయం అనే కామెడీ మూవీ తో సంపూర్ణేష్ బాబు లాంటి వ్యక్తిని హీరోగా పరిచయం చేశాడు. ఆ తర్వాత కొబ్బరి మట్ట ,కలర్ ఫోటో ఇలాంటి పలు చిత్రాలకు నిర్మాతగా మరియు రచయితగా వ్యవహరించాడు. అలాంటి వ్యక్తి బేబీ మూవీ తీయాలి అనుకున్నప్పుడు…కామెడీ మూవీస్ తీసే ఇతనికి ఇంత కాన్సెప్ట్ ఉండే మూవీ తీసే సీన్ ఉందా అని అనుకున్న వాళ్ళు ఉన్నారట.

ఈ మాట స్వయంగా సాయి రాజేష్ బేబీ మూవీ సక్సెస్ మీట్ లో తెలిపారు. ఇదే మీట్ లో బేబీ మూవీలో ఆనంద్ క్యారెక్టర్ కి సాయి రాజేష్ ముందుగా ఒక హీరోని సంప్రదిస్తే కనీసం స్టోరీ కూడా చూడకుండా సినిమా చేయను అని అన్నాడని చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఆ సదరు హీరో విశ్వక్ సేన్ అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనికి కారణం బేబీ సినిమా గురించి ‘వద్దు అంటే వద్దు అని అర్థం’అంటూ విశ్వక్ సేన్ పరోక్షంగా పెట్టిన ట్వీట్ కారణం.

దీంతో బేబీ లాంటి మూవీ ని వదులుకొని విశ్వక్ సేన్ తన కెరీర్ లో పెద్ద తప్పు చేశాడేమో అన్న అభిప్రాయం అక్కడక్కడ వ్యక్తం అవుతుంది. యూత్ లో అతనికి మంచి క్రేజ్ ఉంది కాబట్టి బేబీ మూవీ స్థాయి సక్సెస్ అతని ఖాతాలో పడితే ఇమేజ్ మరింత పెరిగేది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ విషయం గురించి అటు డైరెక్టర్ కానీ ఇటు విశ్వక్ సేన్ కానీ ఇంకా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.
ALSO READ : షారుఖ్ ఖాన్ “జవాన్” లో మరొక హీరో..! ఎవరంటే..?




తెలుగు రాష్ట్రాలలో జోరుగా వర్షాలు పడుతున్నప్పటికీ బేబీ మూవీ థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ మూవీ యాబై కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఇందులో హీరోగా అనంద్తో పాటు విరాజ్ అశ్విన్ కూడా నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యల నటన పై ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ‘బేబి’ మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్య యాక్టింగ్ ఫిదా అవుతున్నారు.
ఈ మూవీలో నటించిన యాక్టర్స్ పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ వంటి సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపించారు. ఈ మూవీ దర్శకుడు సాయి రాజేష్ ఒక ఇంటర్వ్యూలో తాజాగా సినిమాకి సంబంధించిన పలు విషయాలను తెలిపారు. సినిమా క్లైమాక్స్లో హీరోయిన్ వైష్ణవి చైతన్య వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు చూపిస్తారు.
హీరో ఆనంద్ హీరోయిన్ గురించిన ఆలోచనలతో తాగుతూ అలాగే ఉండిపోయినట్లు దర్శకుడు చూపించాడు. కానీ రెండవ హీరోగా నటించిన విరాజ్ను చూపించలేదు. ఆ విషయం గూర్చి అడుగగా, ‘క్లైమాక్స్లో విరాజ్ సన్నివేశాన్ని తీశాం. కానీ నిడివి పరంగా ఆ సీన్ ను తొలగించాల్సి వచ్చింది’ అని తెలిపారు. ఆ విధంగా చాలా సన్నివేశాలు కట్ చేశామని, వాటిని ఓటీటీలో చూపిస్తామని వెల్లడించారు.
కన్నడ సినిమా స్థాయి ఏమిటనేది కేజీఎఫ్ తో వెలుగులోకి వచ్చింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్, యష్ కేజీఎఫ్ 2 మూవీతో వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లు సాధించడంతో దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు, మేకర్స్ దృష్టి కన్నడ చిత్రాల వైపు మరలింది. కేజీఎఫ్ చిత్రాలతో పాటుగా కాంతార, విక్రాంత్ రోణ, కిరిక్ పార్టీ, చార్లీ 777, వంటి సినిమాలు కన్నడ ఇండస్ట్రీ స్థాయిని మరింతగా పెంచాయి. వాటి ద్వారా కన్నడ ఇండస్ట్రీ పేరు మార్మోగింది. అయితే ఆ తర్వాత ఆ రేంజ్ లో హిట్ పడలేదు.
చాలా రోజుల తర్వాత ‘హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే’ సినిమాతో కన్నడ ప్రేక్షకులు ఊరట పొందారు. జూలై 21న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా యువతకి ఈ మూవీ కాన్సెప్ట్ కనెక్ట్ కావడంతో యూత్ ఎగబడి సినిమాని చూస్తున్నారు. క్రైమ్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ మూవీతో నితిన్ కృష్ణమూర్తి డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. హీరో రక్షిత్ శెట్టి, ఒకప్పటి హీరోయిన్ రమ్య, ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టిలు అతిథి పాత్రలలో నటించారు. ‘కాంతార’ మ్యూజిక్ డైరక్టర్ అజనీష్ లోక్నాథ్ ఈ మూవీని తన సంగీతంతో నెక్స్ట్ లెవల్కి తీసుకెళ్లాడు.
ఇక ఈ కథ విషయనికి వస్తే, హాస్టల్ లో ఉండే యువకుల మధ్య సాగే కథ ఇది. అయిదుగురు కుర్రాళ్ళు హాస్టల్ లో ఒకే గదిలో ఉంటారు. అయితే అందులో ఒకరికి షార్ట్ ఫిల్మ్ ను తీయాలని అనుకుంటాడు. కానీ వారికి ఎగ్జామ్స్ ఉండటంతో మిగిలిన నలుగురు అందుకు ఒప్పుకోరు. ఆ టైమ్ లోనే హాస్టల్ వార్డెన్ మరణిస్తాడు. కానీ తన చావుకు ఈ అయిదుగురు కుర్రాళ్ళే కారణం అని ఒక లెటర్ రాసిపెట్టి చనిపోతాడు.
ఈ విషయం తెలిసి షాక్ అయ్యి, అందులో నుండి బయటపడడానికి సీనియర్ ను సాయం అడుగుతారు. ఆ తరువాత ఏం జరిగింది? అందులో నుండి అయిదుగురు కుర్రాళ్ళు బయటపడ్డారా? ఆ వార్డెన్ లెటర్ లో వీళ్ళే కారణం అని ఎందుకు రాశాడు? అనేది మిగతా కథ. దర్శకుడు ఈ మూవీ స్క్రీన్ ప్లేను సరదాగా నడిపించారు.





ఈ మూవీలోని ఒక అభ్యంతరకర సన్నివేశంలో సైంటిస్ట్ ఓపెన్హైమర్ భగవద్గీతలోని ఒక శ్లోకం చదువుతారు. అదే వివాదానికి దారి తీసింది. హిందువులకు అత్యంత పవిత్ర గ్రంథం అయిన భగవద్గీతలోని శ్లోకాన్ని అభ్యంతరకర సన్నివేశంలో చదవడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే సైంటిస్ట్ ఓపెన్హైమర్ తనకు ఇష్టమైన పుస్తకాలలో భగవద్గీత ఒకటని చెప్పారు. భగవద్గీతను చదవడం కోసమే ఆయన సంస్కృతం నేర్చుకున్నారని ఒక సందర్భంలో తెలిపారు. న్యూ మెక్సికోలోని ఎడారిలో తొలిసారి 1945లో జులై నెలలో అణుబాంబును పేల్చడానికి 2 రోజుల ముందు ఓపెన్హైమర్ భగవద్గీతలోని శ్లోకాన్ని చదివారట.
కొన్నేళ్లకు ముందు శాస్త్రవేత్త ఓపెన్హైమర్కు బర్క్లీలోని ఒక టీచర్ సంస్కృత భాషని పరిచయం చేశారు. ఆ తరువాత సంస్కృతంలోని భగవద్గీత ఓపెన్హైమర్కు పరిచయమైంది. భగవద్గీతలో మొత్తం 700 శ్లోకాలుంటాయి. భగవద్గీతను వరల్డ్ లోనే అత్యంత దీర్ఘ కవితగా పరిగణిస్తారు. అలాంటి భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని ఓపెన్హైమర్ ప్రపంచ చరిత్రను మార్చే ఒక ఘట్టం మొదలుపెట్టడానికి చదివి తనపై ఉన్న తీవ్రమైన ఒత్తిడిని తొలగించుకున్నాడని తెలుస్తోంది.


కమెడియన్ యాదమ్మ రాజు పటాస్ షో ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత జబర్దస్త్, అదిరింది, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోల ద్వారా మరింత పాపులర్ అయ్యాడు. ప్రేమించి, పెళ్లి చేసుకున్న యాదమ్మ రాజు, తన భార్య స్టెల్లాతో కలిసి యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించాడు. అందులో సరదా వీడియోలను ఆడియెన్స్ తో పంచుకుంటాడు. యాదమ్మ రాజు ప్రస్తుతం జబర్దస్త్ లో టీం లీడర్ గా ఉన్న సంగతి తెలిసిందే.
యాదమ్మ రాజు భార్య తాజాగా ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోని చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఆ వీడియో యాదమ్మ రాజు హాస్పిటల్లో ఉన్నట్టుగా కనిపించాడు. అతని కాలికి దెబ్బ తగిలి, పెద్ద కట్టుతో ఉన్న రాజు నడవలేని స్థితిలో కనిపించారు. అతని భార్య స్టెల్లా అతనిని నడిపిస్తున్నారు. ఈ వీడియో చూసిన అభిమానులు ఆయనకు ఏమైందని అడుగుతున్నారు. దాంతో రాజు భార్య స్టెల్లా ఇలా వివరణ ఇచ్చారు.
యాదమ్మ రాజు చిన్నప్రమాదానికి గురయ్యారని, త్వరలో కోలుకుంటారు. మాపై చూపిస్తున్న మీ ప్రేమకు ధన్యవాదాలు. ఆయన త్వరగా కోలుకోవాలని పంపిన సందేశాలకు కృతజ్ఞతలని స్టెల్లా కామెంట్ చేశారు. గాయపడిన తన భర్తను ఉద్దేశిస్తూ, నీ పక్కన నేను ఉండగా నీకేం కాదు డియర్ అంటూ ఈ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అభిమానులు గెట్ వెల్ సూన్ అని కామెంట్స్ చేస్తున్నారు.
నటుడు మరియు దర్శకుడు సముద్రఖని తెరకెక్కించిన సినిమా బ్రో. తొలిసారిగా మామ, మేనల్లుడు కలిసి నటిస్తున్న మూవీ కావడంతో బ్రో సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన 2 పాటలకు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభించింది.
ఈ మూవీలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. గత కొద్ది రోజుల నుండి మూవీ ప్రమోషన్స్ సాగుతున్నాయి. వాటిలో భాగంగా దర్శకుడు సముధ్రఖని, సాయి ధరమ్ తేజ్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నారు. ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ‘బ్రో’ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను మేకర్స్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ముఖ్య అతిథులుగా హజరయ్యారు. ఈ ఈవెంట్ లో పవర స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ విశేషాల గురించి ఉత్సాహంగా మాట్లాడారు. సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ, ఎమోషనల్ అయ్యాడు.
చీఫ్ గెస్ట్ గా హాజరు అయిన వరుణ్ తేజ్ మాట్లాడుతూ సినిమాల్లో ఉన్నా, పాలిటిక్స్ లో ఉన్నా మా ఫ్యామిలీ అంతా బాబాయి వెనకే ఉంటాం అని చెప్పుకొచ్చారు. ఇది ఇలా ఉంటే బ్రో ప్రీ రిలీజ్ వేడుక పై సోషల్ మీడియాలో పలు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఏమిటో మీరు చూడండి.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.