అప్పటి నుండి ఇప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమను… తనదైన నడకతో, డ్యాన్సులతో కుర్రాళ్ళను షేక్ ఆడించింది ఎవరు అంటే గుర్తొచ్చే హీరో మెగా స్టార్ చిరంజీవి. ఆయన స్ఫూర్తితోనే ఎంతో మంది సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు అంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి.
కానీ మెగాస్టార్ చిరు ఇటీవల కాస్త అనారోగ్యానికి గురయ్యారని… అందుకే ఆపరేషన్ కోసం అమెరికా వెళ్లారని వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

అయితే భోళా శంకర్ మూవీ షూటింగ్ పూర్తయిన తరువాత చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి అమెరికా ట్రిప్ కు సరదాగా వెళుతున్నట్లు చిరంజీవి సోషల్ మీడియా ద్వారా తెలిపిన సంగతి తెలిసిందే. ఈ మేరకు చిరంజీవి నిజానికి వెకేషన్ కి కాదని… ఆయన అమెరికాలో ఆపరేషన్ చేయించుకోడానికి వెళ్లారని వార్తలు వచ్చాయి. ఈ వార్త తెలియగానే మెగా స్టార్ అభిమానులు ఆందోళన చెందారు.

అయితే చిరంజీవి కాలికి కాస్త ఇబ్బందిగా ఉండటంతో… సరి చేసుకునేందుకు అమెరికాలో ఆపరేషన్ చేయించుకున్నారని… ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని తెలుస్తోంది. వాస్తవానికి ప్రత్యేకంగా ఆపరేషన్ కు వెళ్లకపోయినా… సతీమణితో 2 వారాల పాటు వెళ్ళిన వెకేషన్ లో భాగంగా పనిలో పనిగా ఆరోగ్య సమస్యలను చక్కదిద్దుకున్నారని సమాచారం. మొత్తానికి చిరంజీవి ఆరోగ్యంగానే హైదరాబాద్ కు తిగిరి రావడం చూసి అభిమానుల మనసు కాస్త కుదుట పడింది.

ఇక తదుపరి ఆగస్ట్ 11న రిలీజ్ కానున్న భోళా శంకర్ సినిమా ప్రమోషన్స్ కు చిరంజీవి తిరగనున్నారు. ఆచార్య పెద్ద హిట్ ఇవ్వక పోయినా తరువాత వచ్చిన గడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ హిట్స్ సొంతం చేసుకున్నారు. దీంతో భోళా శంకర్ కూడా మంచి హిట్ కానుందని చిరు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు.
ALSO READ : విజయ్ సేతుపతి “విడుదలై-2” లో ఆ హీరోయిన్ కోసమే సీన్ మార్చారా? అసలు ప్లాన్ మారిందా!!








1. స్పైడర్:
2. డియర్ కామ్రేడ్:
3. నాని వి:
4. అమిగోస్:
5. డిస్కో రాజా:
6. సవ్యసాచి:
7. నా పేరు సూర్య:
8. ఎంత మంచివాడవురా:
9. అంతరిక్షం:
10. ఆరెంజ్:
ఈ మూవీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికీ ఈ మూవీ టీవీలో వస్తే చూసేవాళ్లు ఎంతో మంది ఉన్నారు.


దేవుళ్ల పై చిత్రాలు తెరకెక్కించేటపుడు అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ఏం జరుగుతుందో ‘ఆదిపురుష్’ సినిమా ఫలితాన్ని చూస్తే తెలుస్తుంది. ఆ మూవీ ఎన్నో విమర్శలు, వివాదాల మధ్య డిజాస్టర్ గా నిలిచింది. ఆ మూవీ పై పీటీషన్లు కూడా దాఖలు అయ్యాయి. ఆ ఎఫెక్ట్ వల్ల అక్షయ్ కుమార్ శివుడిగా నటిస్తోన్న ‘ఓఎంజీ 2’ సినిమా పై సెన్సార్ బోర్డ్ అభ్యంతరాలు తెలిపినట్లు టాక్. ఆదిపురుష్ సినిమా సమయంలో చేసిన మిస్టేక్ ను ఈ మూవీ విషయంలో రిపీట్ అవకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఈ క్రమంలోనే సెన్సార్ కన్నా ముందు, ఈ సినిమాలో ఆడియెన్స్ మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఏమైనా డైలాగులు, సన్నివేశాలు ఉన్నాయో పరిశీలించాలని సెన్సార్ బోర్డ్ రివ్యూ కమిటీకి సూచించినట్లు సమాచారం. ఆ కమిటీ డిసిషన్ తర్వాత ఈ సినిమాకి సర్టిపికెట్ మంజూరు చేయడం కానీ, ఏమైనా మార్పులు సూచించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అన్నీ పరిశీలించిన ఆనంతరమే సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని తెలుస్తోంది. మూవీ రిలీజ్ ను అప్పటి వరకు నిలిపివేయాలని కోరినట్లు టాక్ వినిపిస్తోంది.
కానీ చిత్రబృందం మాత్రం ఈ విషయన్ని కొట్టిపడేశారు. ఓఎంజీ 2 సెన్సార్ రిపోర్ట్ విషయంలో CBFC ఇంతవరకు తమకు ఎటువంటి అభ్యంతరాలు తెలుపలేదని వెల్లడించారు. ఓఎంజీ 2 సినిమాలో అక్షయ్ కుమార్తో పాటుగా పంజక్ త్రిపాఠి, అరుణ్ గోవిల్, యామీ గౌతమ్, గోవింద్ నమ్దేవ్ కీలక పాత్రలలో నటించారు. అమిత్ రాయ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా, సంగీతం మంగేశ్ దక్డే అందిస్తున్నాడు.
తాజాగా జరిగిన ‘బ్రో’ ప్రి రిలీజ్ వేడుకలో సాయిధరమ్ తేజ్ ప్రసంగిస్తూ ఫ్యాన్స్ కు థ్యాంక్ యు చెప్పబోతుండగా, సరిగ్గా మాట్లాడలేకపోయారు. ఇది చూసిన కొందరు తేజ్ ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. మందు కొట్టి వచ్చడేమో అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే యాక్సిడెంట్ నుండి కోలుకున్న తరువాత సాయిధరమ్ తేజ్ మాట్లాడే విషయంలో ఇబ్బంది పడుతున్నాడు.
ఇంతకుముందులా అతను క్లారిటీగా, గట్టిగా మాట్లాడలేకపోతున్నాడు. దీనికి కారణం అందరికీ తెలిసిందే. రెండేళ్ల క్రితం సాయిధరమ్ తేజ్ రోడ్డు యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడ్డాడు. కోమలోకి వెళ్ళినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆ సమయంలో కొన్ని నెలల పాటు హాస్పటల్ లో ఉన్నాడు. తర్వాత ఇంటికి వచ్చినా కొన్ని నెలల పాటు బయటికి రాలేదు. ఆ తర్వాత కోలుకుని చిత్రాలు చేస్తున్నప్పటికీ తేజులో మునపటి జోష్ లేదు.
స్వయంగా సాయిధరమ్ తేజ్ మునపటిలా, పూర్తి ఆరోగ్యంతో లేనని పలు ఇంటర్వ్యూల్లో ఓపెన్ గా చెప్పాడు. ఆ విషయం తెలిసినప్పటికి కొందరు ట్రోల్ చేస్తున్నారు. కానీ కొందరు సాయిధరమ్ తేజ్ సపోర్ట్ గా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీస్ ఫర్ యూ అనే ఇన్ స్టా పేజీలో ఒక క్లిపింగ్ షేర్ చేసి, ‘అన్నకి యాక్సిడెంట్ అయిన దగ్గర నుండి సరిగ్గా మాట్లాడలేక పోతున్నాడు. దాన్ని పట్టుకుని తాగేసివచ్చాడు అని అంటారెంటిరా?’ అని రాసుకొచ్చారు.
ఇటీవలే ఏడవ సీజన్ కు సంబంధించిన టీజర్ రిలీజ్ అయ్యింది. దీనికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఈ షో అభిమానులు ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే బిగ్ బాస్ షో మొదట్లో వచ్చిన సీజన్లు విజయవంతంగా పూర్తి అయ్యాయి. కానీ ఆ తర్వాత ఈ రియాల్టీ షో పై విమర్శలు ఎక్కువయ్యాయి.
సీపీఐ లీడర్ నారాయణ ‘బిగ్ బాస్’ షో పై పలుమార్లు కౌంటర్స్ కూడా వేశారు. ఈ షో వల్ల యువత, పిల్లలు, చెడిపోతున్నారని ఆరోపించారు. హౌస్ లో పోటీదారుల మధ్య అశ్లీలత, అసభ్యకరమైన సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని కోర్టులో నారాయణ పిటీషన్ వేశారు. ఆ పిటీషన్ తో హైకోర్టు బిగ్ బాస్ షోని ఆపేయాలని తీర్పు ఇచ్చింది.
గతంలో వేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు తాజాగా విచారణ జరిపింది. ఈ క్రమంలోనే హోస్ట్ నాగార్జునకు మరియు షో ప్రసారం అవుతున్న ఛానెల్కి కూడా నోటీసులు ఇచ్చింది. అలాగే ఈ పిటిషన్ మీద కౌంటర్ దాఖలు చేయాలని వెల్లడించింది. ఈ కేసు నెక్స్ట్ విచారణని నాలుగు వారాలకు వాయిదా వేసింది. అయితే గతంలో చాలాసార్లు ఈ షో పై ఇటువంటి పిటిషన్స్ కోర్టులో దాఖలు అయినప్పటికీ ఇంతవరకు ఎటువంటి అడ్డంకి లేకుండా బిగ్ బాస్ షో కొనసాగింది.



