తెలుగు సినీ పరిశ్రమలో అల్లు వారి కుటుంబానికి ప్రత్యేకమైన ఇమేజ్ ఉందని చెప్పవచ్చు. అల్లు రామలింగయ్య నటుడుగా, ఆయన కుమారుడు అల్లు అరవింద్ నిర్మాతగా టాలీవుడ్ లో తమదైన ముద్రను వేశారు. ఆ తరువాత అల్లు ఫ్యామిలీ నుండి వచ్చిన అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ కూడా సమంత నటించిన శాకుంతలం సినిమాతో బాలనటిగా టాలీవుడ్ లో అడుగు పెట్టింది. అర్హ జూనియర్ ఎన్టీఆర్ మూవీలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీలో ఆమె తీసుకుబోతున్న రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
అల్లు అర్జున్, స్నేహ రెడ్డిల ముద్దుల తనయ అల్లు అర్హకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఇప్పటికే స్టార్కిడ్గా సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన శాకుంతలం సినిమాలో భరతుడిగా నటించి ఆడియెన్స్ ను మెప్పించింది. తాజాగా అల్లు అర్హ దేవర సినిమాలో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న ‘దేవర’ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వికపూర్ ఎన్టీఆర్ కు జోడీగా నటిస్తోంది. ఈ చిత్రంలో అల్లు అర్హను హీరోయిన్ జాన్వీకపూర్ చిన్నప్పటి క్యారెక్టర్ కోసం ఎంపిక చేశారని తెలుస్తోంది. ఈ విషయం గురించి స్వయంగా ఎన్టీఆర్ అల్లు అర్జున్ కి ఫోన్ చేసి మరి అడిగారట. దాంతో బన్నీ కూడా అంగీకరించినట్టు సమాచారం.
అల్లు అర్హ తన రెండవ సినిమాకే భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటునట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అర్హ నిమిషానికి 2 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు టాక్. ఇక ఈ మూవీలో అర్హ పాత్ర 10 నిమిషాలు ఉంటుందని, ఆ లెక్కన చూస్తే సుమారు అల్లు అర్హ ఇరవై లక్షల రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ అల్లు అర్హ రేంజ్ వేరు అని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: టమోటాల ధరల గురించి బాలకృష్ణ సినిమాలో అప్పుడే చెప్పారా..?




1. బేబీ:
2. బుట్టబొమ్మ:
3. ఉప్పెన:
4. జూనియర్స్:
5. కొత్త బంగారు లోకం:
6. చిత్రం:
7. ఎటో వెళ్లిపోయింది మనసు:
8. జయం:
9. గంగోత్రి:
10. బస్ స్టాప్:
11. బాయ్స్:
12. నిర్మలా కాన్వెంట్:
13. ప్రేమిస్తే:
14. నువ్వు నేను:
15. సీతాకోక చిలుక:
రామ్ సంగయ్య దర్శకత్వంలో వచ్చిన ‘తందట్టి’ సినిమాలో రోహిణి, పశుపతి రామస్వామి, వివేక్ ప్రసన్న ప్రధాన పాత్రలలో నటించారు. ఈ తమిళ మూవీ థియేటర్లలో జూన్ 23న రిలీజ్ అయ్యింది. తందట్టి తమిళ ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. దాంతో ఈ మూవీ మంచి వసూళ్లు సాధించి అక్కడ సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఆ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది.
ఇక ఈ మూవీ కథ విషయనికి వస్తే, వీరసుబ్రమణియన్ (పశుపతి) పోలీస్ హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తుంటాడు. 10 రోజుల్లో అతని రిటైర్మెంట్ ఉంటుంది. అయితే ఈ క్రమంలో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే కిడారిపట్టి అనే గ్రామంలోని తంగపొన్ను(రోహిణి) అనే వృద్ధురాలు కనిపించకుండా పోతుంది. ఆమె కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తారు. ఆమెను వెతికే పనిని వీర సుబ్రమణియన్కు అప్పగిస్తారు. అతను తంగపొన్ను కనిపెట్టాడా? ఆమె ఏం అయ్యారు? ఆమెను వెతికే క్రమంలో అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనేదే మిగతా కథ.
ఆస్తులు బంధాలను ఎలా ప్రభావితం చేస్తాయనే విషయాన్ని ఈ మూవీలో చక్కగా చూపించారు. ఒక వైపు నవ్విస్తూనే, దర్శకుడు సమాజానికి చురకలు అంటించాడు. ఊరిలోని సంబంధాలు, స్వార్థపూరితమైన మనసులు, ఆస్తి కోసం కన్నవారి పై పిల్లల కపట ప్రేమను అర్థమయ్యేలా చక్కగా మలిచాడు. ఆడియెన్స్ కథతో కనెక్ట్ అవుతారు. కొన్ని సన్నివేశాలు రియల్ లైఫ్ లో జరిగే సంఘటనలలా అనిపిస్తాయి. రోహిణి, పశుపతి తమ క్యారెక్టర్ల లో జీవించారు. మిగతా నటీనటులు ఎవరి పాత్రలకు తగిన విధంగా వారు నటించారు.
టమాటా ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో ఎప్పుడూ లేనిది విచిత్రంగా మొదటిసారి టమాటాల దొంగతనాల వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మొన్నటి దాకా షాపుల్లోని టమాటాలు దొంగలు ఎత్తుకెళ్లడం వినిపించింది. కానీ ప్రస్తుతం టమాటా దొంగలు రూటు మార్చి, టమాటా తోటల్నే లక్ష్యం చేసుకుంటున్నారు. గతంలో టమాటా పండించిన రైతులు భారీగా నష్టపోయేవారు. కిలో టమాటా రూపాయికి అమ్మేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా సార్లు గిట్టుబాటు ధర రాలేదని కొందరు రైతులు కోపంతో టమాటాలను రోడ్ల పై పడేసిన సందర్భాలు ఉన్నాయి.
కానీ ఇప్పుడా సీన్ అంతా రివర్స్ అయ్యింది. ఎన్నో ఏళ్ల తర్వాత టమాటాలు మంచి ధర పలుకుతుండడంతో రైతులు సంతోషంలో ఉన్నారు. టమాటా ధర పెరుగుదల వల్ల రకరకాల సంఘటనలు జరుగుతున్నాయి. ఇటీవల ఒక రైతు టమాటాలను అమ్మి కోటీశ్వరుడు అయిన విషయం వైరల్ గా మారింది. ఇక టమాటా క్రేజ్ సోషల్ మీడియా దాకా చేరింది. టమాటా ధర పై జోక్స్, మీమ్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే కరీంనగర్ కుర్రోడు అనే ఇన్ స్టా పేజీలో ఒక వీడియో షేర్ చేశారు. నందమూరి బాలకృష్ణ నటించిన ఆదిత్య 369లోని సీన్ అది. బాలకృష్ణ టైమ్ మిషన్ లో భావిష్యత్తులోకి వెళ్ళినపుడు బ్రహ్మానందంకు అతని భార్య కాల్ చేసి ‘ఈ రోజూ టమాటాల చాలా చీప్ గా ఉన్నాయట. కిలో 1500 అంట, 2 కిలోలు తీసుకురండి అని చెప్తుంది. ఆ తరువాత అదుర్స్ మూవీలో బ్రహ్మానందం ‘ఆవిడ కరెక్ట్ గానే చెప్పింది రా. చాలా సేపు సస్పెన్స్ తరువాత నాక్కుడా అర్ధం అయ్యింది’ అనే సీన్ వస్తుంది. ఇది చూసిన నెటిజెన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.
శామీర్పేట్ కాల్పుల ఘటనలో నటుడు మనోజ్ అలియాస్ సూర్యతేజ్ ను ఇప్పటికే పోలీసులు కోర్టు ముందు హాజరు పరచడం, రిమాండ్లోకి తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టు షాకింగ్ విషయాలు ఉన్నాయి.
ఆ తరువాత విడాకుల కోసం దరఖాస్తు చేసింది. ఇద్దరు అప్పటి నుంచి వేరుగా ఉంటున్నారు. మానసిక సమస్యలతో, ఒత్తిడితో ఇబ్బంది పడే వారికి స్మిత కౌన్సిలింగ్ ఇస్తుండేదని, ఈ క్రమంలోనే యాక్టర్ మనోజ్ కు స్మితతో ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. సినిమా అవకాశాలు లేక డిప్రెషన్ లో ఉన్న మనోజ్, స్మిత దగ్గరికి కౌన్సిలింగ్కు వచ్చేవాడు. అలా వీరిద్దరి మధ్య పెరిగిన పరిచయం కాస్తా సహజీవనానికి దారి తీసింది. వీరిద్దరు 3 సంవత్సరాలుగా పిల్లలతో కలిసి శామీర్ పేటలో ఉండే సెలబ్రిటీ విల్లాలో ఉంటున్నారు.
మనోజ్ తమన వేధిస్తున్నాడని స్మిత కుమారుడు సీడబ్ల్యూసీకి కంప్లైంట్ చేశాడు. సీడబ్ల్యూసీ వాళ్లు వారి తండ్రి సిద్ధార్థ్ను హైదరాబాద్ పిలిపించారు. సిద్ధార్థ్ దాస్ శనివారం పిల్లల కోసం సెలెబ్రిటీ విల్లాకు వెళ్ళాడు. సిద్ధార్థ్ను చూసిన స్మితా మనోజ్కి చెప్పడంతో ఆగ్రహించిన మనోజ్ ఏయిర్ గన్ తో సిద్ధార్థ్ పై కాల్పులు జరిపాడు. గన్ చూసి భయపడిన సిద్ధార్థ్ బయటికి వచ్చి, డయల్ 100 కు కాల్ చేసి పోలీసులకు కంప్లైంట్ చేయడంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి వెళ్ళి మనోజ్ను అరెస్ట్ చేశారు. ఏయిర్ గన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాజాగా రిలీజ్ అయిన బేబీ మూవీ సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా భారీగానే రాబట్టినట్టు తెలుస్తోంది. సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని ఎస్.కె.ఎన్ ‘మాస్ మూవీ మేకర్స్’ బ్యానర్ పైన నిర్మించారు. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించగా వైష్ణవి హీరోయిన్ గా నటించింది. యాక్టర్ విరాజ్ అశ్విన్ కీలక పాత్రలో నటించాడు. ప్రమోషన్లలో భాగంగా రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ఆనంద్ దేవరకొండ ఈ మూవీతో సాలిడ్ హిట్ అందుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ తర్వాత ఆనంద్ దేవరకొండకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడే ఛాన్స్ ఉందని టాక్. బేబీ హిట్ అవడంలో కీలక పాత్రను హీరోయిన్ వైష్ణవి చైతన్య పోషించింది. ఆమెకు మొదటి మూవీ అయినా, ఎక్కడ తన యాక్టింగ్ లో ఫ్రెషర్ అనే భావన కనిపించలేదు. అద్భుతంగా నటించిదని టాక్. ఇక ఈ మూవీలో వైష్ణవి చైతన్య స్నేహితురాలి పాత్రలో కుసుమ డేగలమర్రి నటించింది.
కుసుమ డేగలమర్రి నటి, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ మరియు మోడెల్. ఆమెకు తెలుగులో బేబీ మొదటి చిత్రం. కుసుమ బిగ్ బాస్ హైదరాబాదీ స్పూఫ్ సీజన్ 1 అని యూట్యూబ్ లో ప్రసారం అయ్యే వీడియోస్ లో నటించింది. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఆమె ప్రకటనలకి, షూటింగ్ కి సంబంధించిన వీడియోలని, ఫోటోలను తరచుగా షేర్ చేస్తుంటుంది. ఆమె ఇన్ స్టా ఖాతాకు 12 వేలమంది ఫాలోవర్స్ ఉన్నారు.








