ఈ ఏడాది(2023) అధిక మాసం ఏర్పడుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. తెలుగు సంవత్సరం ప్రకారం శ్రావణ మాసం ఈసారి రెండు నెలలు వస్తుందని అంటున్నారు. సాధారణంగా శ్రావణం మాసం అంటే శుభకార్యాల నెలగా చూస్తారు.
అయితే ఈ ఏడాది ఆషాఢ మాసం అనంతరం వచ్చే శ్రావణ మాసంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదని చెబుతున్నారు. దానికి కారణం అధిక మాసం రావడం. ఈ నేపథ్యంలో అధికమాసం అని అంటే ఏమిటి? ఈ మాసంలో ఎందుకు శుభకార్యాలు చేయకూడదో ఇప్పుడు చూద్దాం..
జ్యోతిష్య శాస్త్ర పరాక్రమ కాలగణన సూర్య, చంద్రుల ఆధారంగా జరుగుతుంది. సూర్యుణ్ణి ఆధారంగా తీసుకుని లెక్కకట్టే కాలమానాన్ని సౌరమానం అని అంటారు. చంద్రుణ్ణి ఆధారంగా తీసుకునే సంవత్సర గణనాన్ని చాంద్రమానం అని అంటారు. చాంద్రమానంలో నెల అంటే 29.53 రోజులు. దీని ప్రకారం చాంద్రమానంలో సంవత్సరానికి 354 రోజులు. సౌరమానంలో సంవత్సరానికి 365 రోజులు. దక్షిణాదిలో చాంద్రమానాన్ని అనుసరిస్తారు. ఉత్తరాదిలో సూర్యమనాన్ని అనుసరిస్తారు.
చాంద్రమానంలో ప్రతి నెల అవధిగా అమవాస్యను పరిగణిస్తే, సూర్యమనంలో పౌర్ణమిని నెల అవధిగా తీసుకుంటారు. సౌరమానానికి, చాంద్రమానానికి మధ్య ఏడాదిలో పదకొండు రోజుల తేడా ఏర్పడుతుంది. ఈ తేడా సౌరమానం, చాంద్రమానంలో ప్రతీ 4 ఏళ్లలో 31 రోజులు అవుతుంది. అలా అధిక మాసంగా ఏర్పడును. 32 నెలలకు ఒకసారి ఏర్పడే మాసాన్ని అధిక మాసం అని అంటారు.
అధిక మాసము శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేకమైన మాసం. అందుకే అధికమాసానికి పురుషోత్తమ మాసమని కూడా పేరు వచ్చినట్లు చెప్పబడినది. విష్ణుమూర్తి అధిక మాసంలో పురుషోత్తమ పేరుతో ఇంటిఇంటికి తిరుగుతుంటాడు. అందువల్ల ఈ మాసంలో విష్ణుమూర్తిని ఆరాధించాలని, వేరే శుభకార్యాలు చేయకూడదని బ్రహ్మదేవుడు నిషేధించాడు. ఒకవేళ అలా జరుపుకుంటే విష్ణుమూర్తిని పూజించడం మాని సొంతకార్యాలు చేసుకున్న పాపానికి గురై భ్రష్టులవుతారని బ్రహ్మదేవుడు అజ్ఞాపించారని చెబుతారు.
2023లో జూలై 18 నుండి అధిక మాసం మొదలు అవుతుంది. ఈసారి అధికంగా శ్రావణమాసం రానుంది. సాధారణంగా ఆషాఢం మాసం పూర్తి అవగానే శ్రావణ మాసంలో పూజా కార్యక్రమాలు చేస్తారు. అయితే ఈసారి అసలైన శ్రావణ మాసం 2023 ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 15 వరకుఅని జ్యోతిష్యు నిపుణులు చెబుతున్నారు.
Also Read: ఇంట్లో “దుష్ట శక్తులు” ఉంటే కనిపించే సంకేతాలు ఇవే..! అవి ఏంటంటే..?










రావణుడు విష్ణువు కోసం ముల్లోకాలు వెతుకుతూ ఉంటాడు. కానీ అతనికి ఎక్కడా విష్ణువు కనిపించడం లేదు. ఇక విష్ణువు తనేనే వెతుక్కుంటూ వచ్చేలా చేయాలనుకుంటాడు. విష్ణుమూర్తి ధర్మాన్ని పాటిస్తాడని రావణుడికి బాగా తెలుసు. ఎక్కడ చెడు ఉంటే అక్కడికి విష్ణుమూర్తి వస్తాడు. అందుకే తాను ఎప్పటిలాగే అధర్మాన్ని పాటించాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఒక్క ఆలోచనే చరిత్రలో రావణుడు అంతే ఒక గొప్ప రాజు అని కాకుండా ఒక రాక్షసుడు అని ముద్ర పడేలా చేసింది. ఇక అంత్యంత హీనమైన పని చేయాలని నిర్ణయించుకున్నాడు.
అందమైన అమ్మాయిలు ఎక్కడ కనబడితే అక్కడ వారిని అనుభవించేవాడు. అలా ఒక రోజు వేదవతి అనే స్త్రీని బలవంతం చేయడానికి ప్రయత్నించాడు. ఆమె రావణుడి నుండి తప్పించుకు పారిపోయి నువ్వు నా వలనే మరణిస్తావు అని శాపం పెట్టి మంటల్లో దూకి చనిపోయింది. తరువాతి జన్మలో వేదవతి సీతాదేవిగా జన్మిస్తుంది. ఆ తరువాత ఇంద్రుని సభలో ఉండే రంభ తన నాట్యంతో అందరిని ఆకట్టుకుంది. అయితే రావణాసురుడు ఆమె అందాన్ని చూసి ఎలాగైనా ఆమెను సొంతం చేసుకోవాలని భావిస్తాడు.
అందరు చూస్తుండగానే తనతో గడపమని రంభ పై ఒత్తిడి చేస్తాడు. అందుకు రంభ అంగీకరించకపోవడంతో ఆమె వెంటపడి బలవంత పెడతాడు. అదే సమయంలో రంభ ప్రియుడు నలకుబేరుడు రావణాసురుడికి ఒక శాపం పెడతాడు. ఇష్టం లేకుండా ఏ స్త్రీని అయినా బలవంతంగా తాకడానికి ప్రయత్నిస్తే అతని తల పగిలిపోతుందని శాపం పెడతాడు. ఈ శాపం కారణంగా చేసేదేమి లేక రావణాసురుడు రంభ విషయంలో వెనక్కి తగ్గుతాడు. సీతమ్మను ఎత్తుకెళ్లిన తరువాత ఆమెను తాకకపోవడానికి ఇదే కారణం. ఆ తరువాత రాముడు రావణుడితో యుద్దం చేసి హత్యమార్చాడు.




హిందు సనాతన ధర్మంలో మనిషి మృతికి సంబంధించి ఎన్నో నియమాలు ఉన్నాయి. దహన సంస్కారాలు లేదా అంత్యక్రియలకు వెళ్ళిన అనంతరం చేయాల్సిన మరియు చేయకూడని పనుల గురించి పేర్కొన్నారు. ప్రజలు తమ ప్రయోజనం మరియు క్షేమం కోసం పాటించాల్సిన పదహారు సంస్కారాలను సనాతన ధర్మంలో వివరించారు. వీటిలో ఒకటి మనిషి చనిపోయిన తరువాత చేసే కార్యక్రమానికి సంబంధించినది.
ఒక మనిషి మరణం తరువాత అంతిమ సంస్కారాలు, ఆచారాలు పూర్తి అయిన తర్వాత ఆత్మ వెళ్ళి దైవంలో కలిసి పోతుంది. తద్వారా ఆ ఆత్మకి ఈ లోకంతో ఉన్న సంబంధాలు అన్ని తొలగిపోతాయి. గరుడ పురాణంలో అంత్యక్రియలు, ఆత్మ మరణానంతర జీవితం గురించి వివరించారు. గరుడ పురాణం ప్రకారంగా అంత్యక్రియల తరువాత మనిషి తిరిగి వస్తున్నప్పుడు అసలు వెనక్కి తిరిగి చూడకూడదు.
ఒకవేళ అలా చూసినట్లయితే చనిపోయిన వ్యక్తి ఆత్మ చూసిన వారితో ప్రేమలో పడుతుందట. తన మరణం వల్ల ఆ వ్యక్తి ఒక్కరే బాధ పడుతున్నాడని ఆత్మ భావిస్తుందట. అలాంటి స్థితిలో ఆ ఆత్మకు శాంతి కలగదు. ఆత్మ ఆ వ్యక్తితో అనుబంధాన్నిపెంచుకుని, తనతో పాటు ఇంటికి వెళ్లాలని భావిస్తుందంట. ఈ కారణం వల్లనే అంత్యక్రియల అనంతరం వెనక్కి తిరిగి చూడకుండా రావాలని అంటారు.








