News
ఇది కథ కాదు…నిజంగానే జరిగింది..! మీ ఇంట్లో చిన్నపిల్లలుంటే తప్పక చదవండి!
ఒక చిన్న అగ్గిపుల్ల ఒక పెద్ద అడివిని దగ్దం చేయగలదు అదే విధంగా మనం చిన్న పిల్లల మనసుల్లో నాటే కొన్ని ఆలోచనలు వాళ్ల జీవితాలనే చిన్నాభిన్నం చేసే ప్రమాదాలున్నాయి అనడానికి ఈ కథే ఉదాహరణ . ఇది కథకాదు నిజంగా జరిగినది.ఈ సమస్య తీవ్రత తెలియాలంటే ఈ కథ చదివితీరాల్సిందే.

ఇది కథ కాదు…నాలుగేళ్ళ కింద మా మేనత్త కూతురి నుండి నాకొక ఫోన్ వచ్చింది
ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాను, అటు నుండి ఏడుపు..ఏమైంది సునితక్క ఎందుకు ఏడుస్తున్నావ్ అన్నాను.
బిడ్డకు జ్వరం వచ్చింది ఫీట్స్ వస్తున్నాయ్ రా అని కంగారు పడుతూ చెప్పింది
వాళ్ళ ఫ్యామిలీ లో ఎవరు ఎడ్యుకేటెడ్ కాదు తన కడుపులో పాప ఉండగానే భర్త కాలం చేసాడు.. కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం మళ్ళీ పెళ్లి చేసుకోకుండా వాళ్ళ అమ్మ వాళ్ళింట్లోనే ఉంటూ పొలం పనులకు వెళ్లి బిడ్డను చదివించుకునేది..

పాప 5th క్లాస్ అయ్యాక 6th క్లాస్ గురుకుల పాఠశాలలో సీటు వచ్చింది..
ఫోన్ లో ఆమె మాటలు విన్నాక వెంటనే కరీంనగర్ హాస్పిటల్ తీసుకు రమ్మన్నాను.. రెండు గంటల్లో వాళ్ళు కరీంనగర్ వచ్చి కాల్ చేశారు. అప్పటికే నేను హాస్పిటల్లో మాట్లాడి పెట్టాను.. పాప చాలా నీరసంగా విపరీతమైన జ్వరం తో బాధ పడుతుంది హాస్పిటల్ వచ్చాక రెండు సార్లు ఫీట్స్ వచ్చాయి .డాక్టర్లు అన్ని పరీక్షలు చేశారు MRI తో సహా అన్ని రిపోర్టులు నార్మల్..పాపను ICU లో లో అడ్మిట్ చేసి observation పెట్టారు. మూడు రోజుల్లో గంటకి ఒకసారి ఫిట్స్ వచ్చాయి. మూడు రోజుల తరువాత పాప కళ్ళు ఆల్మోస్ట్ కోమ లోకి వెళ్ళింది..

డాక్టర్ పిలిచి పాప ను హైదరాబాద్ తీసుకెళ్లడం బెటర్ అన్నారు.. కానీ ఎలా వాళ్ళ దగ్గర ఆ మూడు రోజుల బిల్లు కట్టడానికే డబ్బులు లేవు ఆలస్యం చేస్తే పాప బతకడం కష్టం అన్నారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నా నిర్ణయం మీద డిపెండ్ అయి ఉన్నారు.ఏదైతే అధైయింది పాప ను ఎలా అయినా బతికించాలి అని వెంటనే మా సునీతక్క వాళ్ళ అన్నదమ్ముళ్లతో మాట్లాడాను. మీరు ఏం చేస్తారో ఎవరి కాళ్ళు పట్టుకుంటారో తెలీదు. మీకు ఉన్నది ఒక్క కోడలు బతికించడం మీ చేతుల్లోనే ఉంది ఎలా అయినా డబ్బులు అరెంజ్ చేయమని చెప్పాను..

మా సొంత బావ కి ఫోన్ చేసి పరిస్థితి చెప్పిన ఆయన వెంటనే 60 వేల వరకు సర్దాడు. మా సునితక్క వాళ్ళ తమ్ముళ్లు కూలి పనులు చేసుకుని బతికే వాళ్ళు . వాళ్లు ఎవరికి ఫోన్ చేసిన రూపాయి దొరకలేదు .
ఇక వాళ్ళ భార్యలు ముందుకు వచ్చి మెడలో ఉన్న పుస్తెలు కొదవ బెట్టి ఇస్తాం. పాప ను హాస్పిటల్ తీసుకుని వేళ్ళు అన్న అన్నారు.. చాలా బాదేసింది. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే హైదరాబాద్ లో అంకుర చిల్డ్రన్స్ హాస్పిటల్ తీసుకు వెళ్ళాను .

నాతో పాప అమ్మ ,వాళ్ళ చిన్న మేనత్త కొడుకు వచ్చారు. అంకుర హాస్పిటల్ లో 12 రోజులు ఉన్నాం. ఎన్ని టెస్టులు చేసిన అసలు ఫిట్స్ ఎందుకు వస్తున్నాయో అర్థం కాక డాక్టర్లు తల పట్టుకున్నారు.
అంకుర హాస్పిటల్ వెళ్ళాక నాలుగవ రోజు పాప కి స్పృహ వచ్చింది. కానీ ఫీట్స్ మాత్రం ఆగలేదు. ఎం చేయాలో అర్థం కాలేదు. లాస్ట్ కి ఒక డాక్టర్ వచ్చి బంజారా హిల్స్ లో ఉన్న సిటీ న్యూరో సెంటర్ కి సెకండ్ ఒపీనియన్ కోసం రిఫర్ చేశారు.

డాక్టర్ అన్ని పరీక్షలు చేసాడు. అన్ని రిపోర్ట్స్ నార్మల్ వచ్చాయి. ఆయన పాప తో మాట్లాడాలి, మీ అందరు బయటే ఉండమని, పాపను ఆయన క్యాబిన్ లోకి తీసుకు వెళ్లి అరగంట తరువాత నన్ను లోపలికి రమ్మన్నాడు .
నేను వెళ్లి సార్ పాప కి ఏమైంది అన్నాను. ఆయన ఏమి మాట్లాడకుండా పాప నానమ్మ ఎవరు ఇక్కడికి వచ్చిందా? అని అడిగాడు .లేదు సార్ అన్నాను .మంచిది వస్తే మాత్రం నా చేతుల్లో సచ్చేది అన్నాడు .ఎందుకు సార్ ఏమైంది? అని అడిగితే అప్పుడు చెప్పాడు పాపకి ఏం జరిగింది అని..జరిగిన విషయం ఏంటంటే పాప ఆడుకోవడానికి రోజు బయటకు వెళ్తే వాళ్ళ నానమ్మ పాప ను దగ్గర తీసుకుని నువ్ ఆడుకోవడానికి బయటకు వెళ్తే నిను కామన భూతం ఎత్తుక పోతాది. బయట భూతాలు ఉన్నయ్ అని రోజు దెయ్యం కథలు చెప్పెదట .

దానికి తోడు పాప హాస్టల్ లో ఉన్న స్నేహితురాలు రోజు దెయ్యాల గురించి మాట్లాడుతుంటే, పాప నిజంగానే దెయ్యాలు ఉన్నట్టు భ్రమలోకి వెళ్ళిపోయింది. పాప వాళ్ళ ఇంటి దగ్గర ఉండే ఒక ముసలామెకు మంత్రాలు వస్తాయి అని పాప ముందే అందరూ మాట్లాడుకోవడం విని ఆ ముసలామేనే దెయ్యం లా ఉహించుకుం.ది ఆ ముసలామేనే రోజు ఆమె మీదకు వచ్చినట్టు ఉహించుకునేది..అలా ఉహించుకున్న ప్రతి సారి ఫీట్స్ లాగ వచ్చి స్పృహ కోల్పోయేది.. ఆమెకు ఒంట్లో ఏ సమస్య లేదు ఉన్న సమస్య అల్లా ఆమె మనసులో పాతుకు పోయిన భయం. ఆ భయమే ఆమె ప్రాణం మీదకు తెచ్చింది అని డాక్టర్ పాప కు జరిగింది మొత్తం వివరించాడు..

మరి సొల్యూషన్ ఏంటి సార్ అన్నాను. సొల్యూషన్ ఏమి లేదు పాప ను డిశ్చార్జ్ చేసుకుని ఇంటికి తీసుకెళ్లి పాప లోని భయాన్ని తీసేస్తే చాలన్నాడు. నేను సరే అని పాప ను హాస్పిటల్ నుండి బయటకు తీసుకు వచ్చి, తిరిగి పాప ను ఒక హోటల్ కి తీసుకెళ్లాను. అక్కడ పాప, నేను ఇద్దరమే ఉన్నాం. పాప సైలెంట్ గా కిందకు చూస్తూ కూర్చుంది. నేను మెల్లగా పాపతో మాట కలిపి ఏమైంది మమ్మి డల్ గా ఉన్నావ్ అని అడిగా పాప నుండి సమాదానం లేదు.
మళ్ళీ అడిగా నో రెస్పాన్స్. భుజం మీద చేయి వేసి ఏమైంది రా ఆకలిగా ఉందా ఏమైనా తింటావా అని అడిగా లేదు అన్నట్టు తల ఊపింది పోనీ ఏమైనా తాగుతావా అని అడిగా పాప సైలెంట్ మళ్ళీ అడిగా నువ్వేం కావలి అన్నా తెస్తా ఏం తాగుతావ్ మమ్మి అని అడిగా పాప సైలెంట్.

నాకు అనుమానం వచ్చి నవ్వుతూ కామెడీగా గా పోనీ రక్తం తాగుతావా అన్నాను. పాప చూపు మారింది. నా అనుమానం బలపడింది నేను మళ్ళీ నవ్వుతూ ఏ రక్తం కావాలిరా కోడి రక్తమా? మేక రక్తమా? అని అడిగా. పాప ఉహు అని తల ఊపింది మరేం కావాలి రా అని అడిగితే పాప మెల్లగా సిగ్గు పడుతూ విచిత్రమైన చూపులు చూస్తూ బాబాయి బాబాయి మరి మల్ల అమ్మకు చెప్పకు నాకు నాకు మనిషి రక్తం తాగాలని ఉంది అని గొణుగుతూ చెప్పింది .అది విని నా రోమాలు నిక్క బొడిచినయ్ కరెక్ట్ గా చెప్పాలి అంటే నాకు కింద తడిసిపోయింది..నేను అయినా కూడా భయం చూపించకుండా సరే మమ్మి ఇంటికి పోయాక తెచ్చి ఇస్తా ముందు టిఫిన్ తిను అని చెప్పి పాప తో ఇక మనసు విప్పి మాట్లాడటం మొదలు పెట్టాను. పాపకు ఏం జరిగిందో పాప కె మొత్తం వివరించి చెప్పిన నీ సిచ్యువేషన్ ఇది ఇందువల్ల నువ్ ఇలా అయ్యావ్ అని చెప్పిన పాప అమాయకంగా మరి బాబాయి నాకేమైన ఆయితదా అని అడిగింది
నేను ఏమి అవదురా, అమ్మ నీ కోసమే బతుకుతుంది. నువ్ బాగుంటే అమ్మ బాగుంటుంది. దెయ్యాలు భూతాలు ఏమి లేవు అని కొన్ని ఉదాహరణలు చెప్పి పాప లోని భయాన్ని తీసేయడానికి ట్రై చేసాను..

నేను తిరుపతి లో కొన్న దండ నా మెడలో నుండి తీసి పాప మెడలో వేసి ఇది ఉంటే ని దగ్గరకు ఏ దయ్యం రాదు ఒకవేళ వచ్చినట్టు నీకు అనిపిస్తే మనసు లోనే ఒక మాట అనుకో ఓ దెయ్యం నువ్ నా దగ్గరకు రాకు చల్ దొబ్బేయ్ అని మనసులోనే తరిమేయ్ అని పాప ను మెల్లగా ట్యూన్ చేసానుపాప నేను చెప్పింది చెప్పినట్టు చేస్తా తల ఊపింది ఆ క్షణం నుండి ఇప్పటి వరకు పాపకు మళ్ళీ ఫీట్స్ రాలేదు ఎప్పటి లాగే నార్మల్ అయింది..కానీ ఆ 12 రోజుల్లో 3 లక్షల రూపాయలు ఖతం..దెయ్యాలు భూతాలు మంత్రాలు అని పిల్లల ముందు మాట్లాడితే ఏమవుతదో ఆ రోజు అర్థం అయింది. చివరికి పాప సేఫ్.

ఇది శ్రీనివాస్ సర్ల అనే వ్యక్తి తన జీవితంలో ఎదురైన అనుభవాన్ని ఫేస్ బుక్ లో శేర్ చేసుకున్నారు . ఇప్పుడు అర్దమైంది కదా మనం ఆషామాషిగా చేసే చిన్న చిన్నపొరపాట్లు జీవితకాలం పాటు సరిదిద్దుకోలేని నష్టాన్ని మిగులుస్తాయి . పిల్లల మెదడులో తెలివిని , ధైర్యాన్ని నింపే కథలు చెప్పాలి కాని భయపెట్టేవి కావు. మారుతున్న సమాజంతో పాటు సమాజానికి అనుగుణంగా పిల్లల్ని మానసికంగా , శారీరకంగా సిద్దం చేయాలి తప్ప మొక్కను చెట్టుగ మలచడానికి చూడాలి కాని మోడు వారేలా చేయకూడదు.
అప్పటి వరకు పెళ్ళిసందడి.. అప్పగింతల వేళ తూలి పడ్డ వధువు..ఉన్నట్లుండి ఏమి జరిగిందంటే..?
ఏ క్షణాన ఏమి జరుగుతుందో ఎవ్వరమూ చెప్పలేము. అప్పటిదాకా సంతోషం గా గడిపిన క్షణాలు ఒక్కసారిగా విషాదాంతం గా మారిపోవచ్చు. పెళ్లి బాజాల నడుమ సందడి నెలకొన్న వేళ నూతన వధువు మృతి చెందిన వైనం గురువారం ఒడిశా రాష్ట్రానికి చెందిన సోనేపూర్ జిల్లా లో చోటు చేసుకుంది. హఠాత్తుగా ఆమె ఎలా మృతి చెందిందో ఎవ్వరికి అర్ధం కాలేదు. ఇంతకీ ఏమి జరిగిందో తెలుసుకుందాం రండి.

గుప్తేశ్వరి సాహూ అనే అమ్మాయి మేనకా, మురళి సాహు దంపతుల సంతానం. వీరు సోనేపూర్ జిల్లా లో నివాసముంటున్నారు. మురళి సాహు దంపతులు తమ కుమార్తె కు రోసీ టెంటులు గ్రామానికి చెందిన బిసికేసన్ ప్రధాన్ అనే వ్యక్తి తో వివాహం నిశ్చయించారు. ఈ వివాహం వేడుక సందర్భం గా అందరు ఉల్లాసం గా ఉన్నారు. ఈ వేడుక గురువారం రాత్రి జరిగింది. అయితే, మరుసటి రోజు అప్పగింతల సమయం వచ్చింది. అప్పటిదాకా వేడుక హుషారు లోనే ఉన్న పెళ్లి కూతురు అప్పగింతల సమయం లో కన్నీరు ఆపుకోలేకపోయింది.

తల్లి తండ్రులకు దూరం అవుతున్నానన్న బాధలో గుక్క పెట్టి ఏడ్చేసింది. కొంతసేపటికి ఆమె తూలిపడింది. మొదట అందరు ఆమె నీరసం వలన పడిపోయిందని అనుకున్నారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, ఆమె అప్పటికే మరణించిందని వైద్యులు తేల్చి చెప్పారు. ఆమె గుండెపోటు కారణం గా మృతి చెందిందని తెలిపారు. ఎక్కువ గా ఏడ్చి ఏడ్చి ఉండడం వలన, ఆమె గుండె పై భారం పెరిగి మరణించింది. పెళ్లి జరిగిన కొన్ని గంటల వ్యవధి లోనే ఇలా చోటు చేసుకోవడం తో పెళ్లి కి వచ్చిన బంధువులంతా విషాదం లో మునిగిపోయారు.
శుభలేఖలు కూడా ముద్రించారు…ఇంతలో అమెరికాలో తెలుగమ్మాయి ఆత్మహత్య.! ఏమైందా అని ఆరాతీస్తే.?
అమెరికాలో ఒక తెలుగు యువతి ఆత్మహత్య కి పాల్పడ్డ ఒక సంఘటన చర్చలకు దారి తీసింది. న్యూస్ 18 కథనం ప్రకారం చిత్తూరులోని పోలీస్ కాలనీకి చెందిన శ్రీహరి కుమార్తె సుష్మా అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. పూతలపట్టు మండలం బందార్లపల్లె గ్రామానికి చెందిన మురళి కొడుకు భరత్ అమెరికా లో ఉద్యోగం చేస్తున్నారు.

వారిద్దరి కుటుంబ సభ్యులు చర్చించుకొని వారికి పెళ్లి ఖాయం చేశారు. మార్చి 3వ తేదీన అంటే గురువారం తెల్లవారు మూడు గంటలకి వారికి వివాహం నిశ్చయించారు. శుభలేఖలు ముద్రించారు. పెళ్లి ఏర్పాట్లు కూడా జరిగాయి. వారం రోజుల క్రితం భరత్ ఈ వివాహానికి నిరాకరించారు. ఈ విషయంపై సుష్మా కి భరత్ కి మధ్య చర్చ జరిగింది. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసింది. అంతా సర్దుకుంటుంది అనుకున్నారు. కానీ సుష్మా ఆత్మహత్య వార్త విని బాధకి గురయ్యారు.
మీరు టూత్ పేస్ట్ కరెక్ట్ గానే వాడుతున్నారా..? టీవీలో చూపించినట్టు ఆ తప్పు చేయకండి..!
మీ టూత్ పేస్ట్లో ఉప్పుందా ? మీ టూత్ పేస్టులో బొగ్గుందా ? అంటూ సినిమా హీరోయిన్స్ , మోడల్స్ అడిగే సరికి కంగారు పడిపోయి , ఎడాపెడా టూత్ పేస్టలని వాడేస్తున్నారా ? పేస్టుతో బ్రెష్ చేసుకో , ఇంత కొంచెమేనా , బ్రష్ నిండుగా పేస్ట్ పెట్టుకో అంటూ కిలో కిలోలు పేస్టు పెట్టేసుకుంటున్నారా ? మీ టూత్ పేస్ట్ లో ఉప్పున్నా లేకపోయినా పర్లేదు . కానీ టూత్ పేస్ట్ వాడే విషయంలో మాత్రం మనకి ఖచ్చితంగా అవగాహన ఉండాల్సిందే .
ఉదయం లేవగానే బ్రష్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన పనే . దానికోసం పేస్ట్ వాడడం కూడా మంచిదే కానీ ఎంత పేస్ట్ వాడాలన్నదే అసలైన సమస్య . టివిల్లో యాడ్ చూడగానే బ్రష్ నిండుగా పెట్టుకుని వాడేస్తుంటాం . కొందరైతే ఒకసారి మాత్రమే కాదు రెండు సార్లు పెట్టుకుని చేస్తుంటారు . కానీ ఈ పేస్ట్ చిన్నపిల్లలకి హానికరం అని మీకు తెలుసా? ఆకలి వేయకుండా చేస్తుందని మీలో ఎంతమందికి తెలుసు?
చిన్నపిల్లలు పేస్ట్ టేస్టీగా ఉందని చప్పరిస్తుంటారు . పెద్దవాళ్లు వారించినప్పటికి వారు వినరు . కానీ పేస్ట్ పరిమాణం విషయంలో మనకి ఖచ్చితంగా అవగాహన ఉండాలి . కావాలంటే ఈ సారి టూత్ పేస్ట్ తెచ్చుకున్నప్పుడు కవర్ పైన ఏముందో చదవండి . పిల్లల పట్ల జాగ్రత్త తీస్కోండి.
ఆ జిల్లాలోని గ్రామాల్లో అందరి ఇళ్లకు అమ్మాయిల పేర్లే.. ఎందుకో మీరే చూడండి..!
మహిళా సాధికారత గురించి ఇప్పుడు చెప్పే మాటలన్నీ ఒట్టి కబుర్లే తప్ప ఆచరణలో అంతగా కనిపించడం లేదు. మహిళా దినోత్సవం అంటూ మహిళలకు ఓ ప్రత్యేక రోజుని కేటాయించి ఆరోజు మాత్రం ఆమె ను ఆకాశానికెత్తేస్తుంటారు. ఆ మరుసటిరోజునుంచి షరా మామూలే అన్నట్లు ఉంటుంది. ఈరోజుకి కూడా చాలా మంది ఇళ్లల్లో ఆడ పిల్లను ఒకలా, మగపిల్లాడిని ఒకలా చూస్తూ ఉంటారు.

అయితే, ఆడపిల్లల కోసం ఓ కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు మిషాసింగ్. మిషాసింగ్ మధ్యప్రదేశ్ షాజాపూర్ జిల్లా పంచాయితీ విభాగం సీఈఓ గా పని చేస్తున్నారు. ఆమె ఆలోచన ప్రకారం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు మంజూరు అయినా లబ్ధిదారులకు ఆడపిల్లల పేర్లతో ఇంటిని అందిస్తున్నారు.

అన్ని రంగాలలో ఆడపిల్లలు కూడా సమానం గా అవకాశాలు పొందాలన్న ఉద్దేశ్యం తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ “భేటీ బచావో భేటీ పడావో” కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2015 లోనే ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. మిషాసింగ్ ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశ్యం తో ఇల్లు మంజూరు అయిన వారికి.. వారి ఇంట్లోని ఆడబిడ్డల పేర్లను ఆ భవనానికి పెట్టి ఇస్తున్నారు.

అయితే, ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి మిషాసింగ్ చాలానే కష్టపడాల్సి వచ్చింది. ముందుగా, ఆమె గ్రామ సర్పంచ్ లను కలిసి తన ఆలోచనను వివరించి అమలు చేయడానికి సాయం కావాలని కోరారు. ఆమె ఆలోచనకు అనూహ్య రీతిలో స్పందన వచ్చింది. ఆ జిల్లాలోని గ్రామాలలో చాలా మంది తమ ఆడపిల్లల పేర్లను తమకు రాబోయే ఇళ్లకు పెట్టుకోవడానికి ముందుకొచ్చారు.

జన్ పడ్ పంచాయితీ కి చెందిన ఓ తండ్రి తనకు కొడుకైనా.. కూతురైనా ఒకటేనని, ఇద్దరినీ సమానం గా చదివిస్తున్నానని, తనకు మంజూరైన ఇంటికి “మోనికా నివాస్” అని తన పదేళ్ల కూతురి పేరే పెట్టుకున్నానని గర్వం గా చెబుతున్నాడు. ఇలా గర్వం గా చెప్పుకునే తండ్రులు చాలా మందే ఉన్నారు. “రేఖా భవన్”, “వందనా నివాస్”, “కవితా భవన్”.. ఇలా ఏ ఇల్లు చూసినా ఆడపిల్లల పేర్లే దర్శనమిస్తూ ఉంటాయి. దాదాపు వేయి ఇళ్లకు పైగా ఇలానే ఆడపిల్లల పేర్లు పెట్టుకున్నారు.

ఈ విషయమై మిషా సింగ్ మాట్లాడుతూ “ఇలా ఇన్ని ఇళ్లకు ఆడపిల్లల పేర్లను పెట్టి నామఫలకం ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి అనుకుంటున్నా.. ఇప్పటి వరకు వేయి ఇళ్ళు పూర్తి చేసాం. మొత్తం నాలుగు వేల ఇళ్లను లక్ష్యం గా పెట్టుకున్నాం. మహిళా సాధికారత, బాలికా విద్య, లింగ సమానత్వం, అమ్మాయిల ప్రాధాన్యత, ఆర్ధిక సాధికారత వంటి అంశాలపై అవగాహనా కల్పించాల్సి ఉన్నది. ఇది కేవలం ఆరంభం మాత్రమే” అని పేర్కొన్నారు. ఎంతైనా ఈ మేడం ఆలోచనకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
A 1000 shout out to “बेटी है गृह लक्ष्मी.” Villages of Shajapur decide to name #Pmay-g houses after their girl child. An initiative of Zila Panchayat.1000 houses in ten days & counting. @ShajapurZila @CMMadhyaPradesh @mopr_goi @PMOIndia @MinistryWCD @smritiirani @JansamparkMP pic.twitter.com/JNP2OY1lsi
— Misha singh (@Mishasinghms) February 25, 2021
“రంగ స్థలం” లో కుమార్ బాబు చనిపోయిన సీన్ లో ఈ రెండు షాట్ లు ఎప్పుడైనా గమనించారా..?
దర్శకులలో సుకుమార్ ది ప్రత్యేక శైలి అని కొత్తగా చెప్పక్కర్లేదు. సినిమా కి తగ్గట్లు సున్నితమైన ఎమోషన్స్ ను పండించగలగడం లో సుకుమార్ దిట్ట. తన ప్రతి సినిమాలోనూ తనదైన మార్క్ ని ప్రత్యేకం గా చూపిస్తూ ఉంటాడు. ప్రతి సినిమాలో క్యారెక్టర్ లను ఎంత పధ్ధతి గా చెక్కుతాడో, చుట్టూ ఉండే పరిసరాలను అందుకు తగ్గట్లు చూపించడం లో కూడా సుకుమార్ శ్రద్ధ తీసుకుందాం. ఉదాహరణగా, రంగస్థలం లోని ఓ సన్నివేశం గురించి తెలుసుకుందాం.

“రంగస్థలం” సినిమా లో చిట్టిబాబు కి అన్నగా నటించిన కుమార్ బాబు ని హత్య చేస్తారు కదా.. ఆ సీన్ లో చిట్టిబాబు కుమార్ బాబు ని తన భుజం పై ఎక్కించుకుని నడుచుకుంటూ వస్తాడు. ఆ సీన్ లో ఓ పక్కాగా మీరూ జాగ్రత్తగా గమనిస్తే..మీకు ఓ గోడ పై కుమార్ బాబు పోస్టర్ కనిపిస్తుంది. లాంతరు గుర్తుకే మీ ఓటు అంటూ కుమార్ బాబు ఫోటో ఉన్న పోస్టర్ ను ఓ చిన్న పిల్లాడు అంటిస్తూ ఉంటాడు.

చిట్టిబాబు..కుమార్ బాబు శవాన్ని భుజం పై మోసుకొస్తూ ఉండగా.. ఈ పోస్టర్ కూడా కిందకి జారిపోతూ ఉంటుంది. అంటే కుమార్ బాబు నెలకొరిగాడని, ఇక ప్రాణాలతో లేదని అర్ధం వచ్చేలా సింబాలిక్ గా చూపించడానికి దర్శకుడు సుకుమార్ ఇలా చూపిస్తాడు. ఇది ఎంతో సున్నితమైన విషయం. దానిని కూడా కథ కి అనుగుణం గా ఎంతో హృద్యం గా చూపించాడు సుకుమార్.
చనిపోయిన తన భార్య అంత్యక్రియలు జరుపుతుండగా భర్తకు ఫోన్ కాల్…ఆ దారుణమైన నిజం విని.?
పశ్చిమగోదావరి జిల్లాలో ఇటీవల జరిగిన ఒక సంఘటన చర్చలకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే న్యూస్ 18 తెలుగు కథనం ప్రకారం, బూబత్తుల వెంకటేశ్వరరావు, రమణ దంపతులు పశ్చిమగోదావరి జిల్లాలోని పెదవేగి మండలం లక్ష్మీపురం పంచాయతీ పరిధిలోని వీరుంపాలెంకు చెందిన వారు. వారికి ఒక కుమార్తె ఒక కుమారుడు ఉన్నారు. వారిద్దరూ రోజువారీ ఉద్యోగులు.

ఇటీవల గాలాయగూడెంలో జరిగిన శ్రీ అచ్చమ్మ తల్లి ఉత్సవాలకు వారు వెళ్లి వచ్చారు. ఉత్సవాలకి వెళ్లి వచ్చిన రెండు రోజుల తర్వాత రమణ అనారోగ్యానికి గురయ్యారు. రమణ ని ఏలూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళి చికిత్స చేయించారు. చికిత్స జరుగుతున్నప్పుడు తొమ్మిదో తరగతి చదువుకుంటున్న వారి కూతురు 13 సంవత్సరాల శ్రావణి కూడా తీవ్ర అనారోగ్యానికి గురయ్యింది. ఆరోగ్యం విషమించడంతో శ్రావణిని గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్లి చికిత్స చేయించారు.

చికిత్స పొందుతూ రమణ సోమవారం తెల్లవారుజామున మరణించారు. వైద్యులు కామెర్లు ఇంకా కిడ్నీ సంబంధిత కారణాలు ఆమె మరణానికి కారణం అని చెప్పారు. రమణ పార్థివ శరీరాన్ని ఇంటికి తీసుకువెళ్లి సాయంత్రం అంత్యక్రియల ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు వెంకటేశ్వరరావుకు గుంటూరు ఆసుపత్రిలో తన కుమార్తె వద్ద ఉన్న బంధువులు ఫోన్ చేసి శ్రావణి మరణించింది అని తెలిపారు.
భార్య పోయిన దుఃఖంలో ఉన్న వెంకటేశ్వరరావు ఈ వార్త విని చాలా బాధ పడ్డారు. బంధువులు వెంకటేశ్వరరావు ని ఓదార్చి జరగాల్సిన కార్యక్రమాలను చూసుకున్నారు. సోమవారం సాయంత్రం రమణకు అంత్యక్రియలు నిర్వహించారు. మంగళవారం ఉదయం శ్రావణికి అంత్యక్రియలు నిర్వహించారు.
నాలుగు నెలల పిల్లాడిని మంచం పై వదిలేసిన తల్లి.. వెతికి చూస్తే బావిలో శవమై..ఏం జరిగిందంటే..?
అర్ధరాత్రి సమయం లో పసి పిల్లాడిని మంచం పై వదిలేసి ఓ తల్లి బావి లోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. ఎంతో అందమైన కుటుంబం. ఆమె భర్త హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్ళై ఏడాదిన్నర కాలమైంది. ప్రసవం కోసం పుట్టింటికి వచ్చిన ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడింది.
వివరాల్లోకి వెళితే, సమయం కధనం ప్రకారం మజ్జిలిపేటకు చెందిన పైడి ఝన్సీ ని ఆమె తల్లి తండ్రులు శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కింతలి గ్రామానికి చెందిన గిరిబాబు కి ఇచ్చి పెళ్లి చేసారు. వీరికి పెళ్లి అయి ఏడాదిన్నర కాలం గడిచింది. గిరిబాబు హైదరాబాద్ లోనే ఓ బ్యాంకు లో పని చేస్తున్నాడు. ప్రసవం కోసం ఝాన్సీ దాదాపు ఎనిమిది నెలల క్రితమే పుట్టింటికి వచ్చింది. నాలుగు నెలల క్రితమే ఆమె పండంటి బాబుకి జన్మనిచ్చింది. ఆమె భర్త కూడా అడపాదడపా వస్తూ ఆమెను చూసుకుంటున్నాడు.

అంతా సవ్యం గా ఉందన్న టైం లో ఆ అమ్మాయి అకస్మాత్తు గా విగత జీవి గా మారింది. శుక్రవారం అర్ధరాత్రి సమయం లో పసి పిల్లాడు గుక్క పెట్టి ఏడవడం తో.. ఇంట్లో వాళ్ళు ఆమె గదిలోకి వచ్చి చూసారు. మంచం పై తల్లి కనపడకపోవడం తో బాబు ఏడుస్తున్నదని అర్ధమైంది. ముందు బాత్ రూమ్ కి వెళ్ళిందేమో అనుకున్నారు. ఎంత పిలిచినా పలకకపోవడం తో అనుమానం వచ్చి.. చుట్టుపక్కల వెతికారు. ఎక్కడ చూసినా కనపడకపోవడం తో అనుమానం వచ్చి బావి దగ్గరకు వెళ్లి చూడగా.. బావిలో ఆమె విగత జీవి గా పడి ఉంది.

ఈ దుర్ఘటన గురించి పోలీసులకు తెలియగానే శనివారం కేసు నమోదు చేసుకున్నారు. ఆమె మృతదేహాన్ని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులనుంచి వివరాలు సేకరించారు. ఝాన్సీ కొన్ని రోజుల నుంచి తీవ్ర మైన కడుపునొప్పితో బాధపడుతోంది. ఈ నొప్పి భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుందేమోనని కుటుంబసభ్యులు అనుమానించారు. అయితే, ఆమె ఆత్మహత్యకు మరే ఇతర కారణమైనా ఉందేమోనని పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఒక్క ఫోన్ కాల్ కొడితే మీకోసం కొత్త కారు వస్తుంది కదా…మీరెందుకు టైర్ మారుస్తున్నారు.? కలెక్టరమ్మ ఆన్సర్ కి హ్యాట్సాఫ్ అనాల్సిందే.!
కలెక్టర్ అంటే ఓ పెద్ద స్థాయి ఉద్యోగం.. ఎవరైనా సరే ఎంతో కష్టపడి ఆ స్థాయికి చేరుకుంటారు. కానీ, ఒకసారి ఆ స్థాయి కి వచ్చేసాక చాలా మంది లెవెల్ ను మైంటైన్ చేస్తూ ఉంటారు. నేను కలెక్టర్ ని.. నా స్థాయి కి ఈ పనులేంటి అన్నట్లు చాలా మంది బిహేవ్ చేస్తారు. కానీ మైసూర్ జిల్లా కలెక్టర్ రోహిణి సింధూరి మటుకు ఇందుకు పూర్తి గా డిఫరెంట్.. ఆమె ఎవరో.. ఆమె స్టోరీ ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం..

మైసూరు కలెక్టర్ రోహిణి సింధూరి గత శనివారం వారాంతపు సెలవు కావడం తో బయటకు వచ్చారు. అయితే, ఆమె కారు టైర్ పంక్చర్ అయింది. ఆమె స్కార్పియో ఎస్యూవీ వాహనానికి టైర్ పంక్చర్ అయితే.. ఆమె స్వయం గా టైర్ ను మార్చుకున్నారు. ఆమె టైర్ ను మారుస్తున్న సమయం లో దారిన వెళ్లే ఓ వ్యక్తి మేడం.. మీరు కలెక్టర్ రోహిణి సింధూరి కదా..? మీరెందుకు టైర్ మారుస్తున్నారు.. ఒక్క ఫోన్ కాల్ కొడితే మీకోసం కొత్త కారు వస్తుంది కదా.. అని అడిగితే.. “నాకు ఊరి సమస్యలే కాదు.. నా కారు సమస్యలు కూడా పరిష్కరించుకోవడం తెలుసు” అంటూ ఆమె నవ్వుతు బదులిచ్చారట.

అక్కడ స్థానికులు ఆమె నిజాయితీ కి, నిరాడంబరత కు ముగ్ధులవుతున్నారు. ఓ వ్యక్తి ఆమె టైర్ మారుస్తున్న సమయం లో వీడియో ను తీసి నెట్టింట్లో పెట్టారు. సాధారణం గా ఆమె ఏమైనా చేయగలిగే అధికారం ఉండి కూడా నిజాయతీ గా వ్యవహరించారు. దీనితో, ఆమెకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఆమె టైర్ మారుస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ఓ సాధారణ అమ్మాయి కూడా తన కారు టైర్ తాను మార్చుకోలేదేమో.. కానీ, అంత హోదా ఉండి కూడా నిరాడంబరం గా వ్యవహరిస్తున్న ఈ యువ కలెక్టర్ వ్యక్తిత్వానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.
watch video:


