ఆరోగ్యం క్షీణించడంతో తాను ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు, సహాయం చేయమని కోరారు నటులు పొన్నాంబళం. పొన్నాంబళం ఎన్నో తెలుగు తమిళ చిత్రాల్లో ఎక్కువగా విలన్ పాత్రలలో నటించారు. అయితే పొన్నాంబళం గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం చెన్నైలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పొన్నాంబళం కిడ్నీ మార్పిడి చికిత్సకు సిద్ధమవుతున్నారు.

సాక్షి కథనం ప్రకారం పొన్నాంబళం శుక్రవారం రోజు ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో తనకి కిడ్నీ ఇవ్వడానికి తన సోదరి కొడుకు ముందుకు వచ్చినట్టు తెలిపారు. ప్రస్తుతం తనకు ఎలాంటి ఆదాయం లేదు అని అన్నారు. దాంతో తన కుటుంబం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ఇప్పటికే రజనీకాంత్, శరత్ కుమార్, ధనుష్, రాఘవ లారెన్స్, కె ఎస్ రవికుమార్ వంటి పలువురు ప్రముఖులు ఆర్థిక సహాయం చేసినట్టు తెలిపారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం డబ్బులు అవసరం అని, దాతలు, దక్షిణ భారత నటీనటుల సంఘం, తెలుగు మా అసోసియేషన్ తరపున తనకిిి ఆర్థిక సహాయం చేయమని కోరారు పొన్నాంబళం.

























భార్య పోయిన దుఃఖంలో ఉన్న వెంకటేశ్వరరావు ఈ వార్త విని చాలా బాధ పడ్డారు. బంధువులు వెంకటేశ్వరరావు ని ఓదార్చి జరగాల్సిన కార్యక్రమాలను చూసుకున్నారు. సోమవారం సాయంత్రం రమణకు అంత్యక్రియలు నిర్వహించారు. మంగళవారం ఉదయం శ్రావణికి అంత్యక్రియలు నిర్వహించారు.

