టీమ్ ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఇండియా ఓటమి చెందిన తర్వాత రోహిత్ శర్మ ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే ఎప్పుడు సౌత్ ఆఫ్రికా తో టెస్ట్ సిరీస్ జరగనున్న నేపథ్యంలో రోహిత్ శర్మ ఎమోషనల్ గా ఒక పోస్ట్ పెట్టాడు.

వరల్డ్ కప్పు ఓడిపోయిన తర్వాత స్టేడియంలోకి ఎలా అడుగు పెట్టాలో తెలియడం లేదని, వరల్డ్ కప్ ఓటమి బాధనుండి బయట పడేందుకు తన ఫ్యామిలీ,ఫ్రెండ్స్ ఎంతగానో సహకరించారని చెప్పుకొచ్చాడు. తమను ఎంతగానో ఎంకరేజ్ చేసిన అభిమానులను చూస్తే బాధేస్తుందని, కానీ జీవితంలో గెలుపు ఓటమి సహజమని వాటిని దాటుకుని ముందుకు వెళ్లాలని చెప్పాడు.
https://www.instagram.com/reel/C0yJGIINfQH/
రోహిత్ పోస్ట్ చూసిన అభిమానులందరూ కూడా భావోద్వేగానికి గురవుతున్నారు. ఇండియా ఒకపక్క టి20 సీరియస్ లో నెగ్గుతుందని మాటే గాని ఆస్ట్రేలియాలో ఓటమి నుండి ఇంకా పూర్తిగా బయటపడలేదు. అభిమానుల గుండెల్లో ఆ ఓటమి ఇంకా మెదులుతూనే ఉంది. అయితే రోహిత్ శర్మ పోస్టుతో భారత్ అభిమానులు కూడా ఎమోషనల్ అవుతున్నారు. రోహిత్ కి మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు. గెలిచిన ఓడిపోయిన ఎప్పుడు ఇండియన్ టీం వెనకాల మేము ఉంటామంటూ మద్దతు కనిపిస్తున్నారు. రాబోయే టి20 ప్రపంచ కప్ లో భారత్ తిరిగి పుంజుకోవాలని ఆశిస్తున్నారు.



ఐపీఎల్ 2008లో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈ సీజన్ వేలంలో ఎంఎస్ ధోనీ అత్యధిక రేటు పలికిన ప్లేయర్ గా నిలిచాడు. ఆ సమయంలో ధోనీ దాదాపు ఆరు కోట్ల ధర పలికాడు. ధోనీని సొంతం చేసుకోవడం కోసం అన్ని ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. వాటిలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మరియు ఆర్సీబీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) లు తీవ్రంగా పోటీపడ్డాయి.
కొన్ని పరిస్థితుల వల్ల ఆర్సీబీ ధోనీని దక్కించుకోలేకపోయిందని అప్పటి వేలంపాటదారుడు రిచర్డ్ మాడ్లీ తాజగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘ఆ సమయానికి ఆర్సీబీ తమ ఫ్రాంచైజీ పేరును ఫిక్స్ చేసుకోలేదు. అందువల్ల బెంగళూరు పేరిట వేలంలో పాల్గొంది. బిడ్డింగ్ రూల్స్ కారణంగా ధోనీని సొంతం చేసుకునే విషయంలో ఆ జట్టు వెన్నక్కి తగ్గాల్సి వచ్చింది’ అని మాడ్లీ పేర్కొన్నాడు.
రూల్ ప్రకారం, జట్టు ఐకాన్ ప్లేయర్ కన్నా ఎక్కువ ఫీజు వేరే ప్లేయర్ కి ఉండకూడదు. ఆ జట్టు రాహుల్ ద్రవిడ్ను అప్పటికే టీమ్ ఐకానిక్ ప్లేయర్గా సెలెక్ట్ చేసుకుంది. అందువల్ల అత్యధిక ధర పలికిన ధోనీని జట్టులోకి తీసుకోలేకపోయింది. ముంబై ఇండియన్స్ సైతం ఈ కారణం వల్లే ధోనీని దక్కించుకోలేకపోయింది. ఆ జట్టు అప్పటికే సచిన్ టెండూల్కర్ను ఐకానిక్ ప్లేయర్గా తీసుకుంది.


కాటలున్యా జాగ్వార్ టీం తరపున ఆడుతున్న హంజా సలీమ్ దార్ ప్రతి బాల్ను బౌండరీ దాటించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. 43 బాల్స్లో 193 పరుగులు చేసి ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. టీ10 మ్యాచ్ లలో ఇప్పటికీ ఇదే అత్యధిక స్కోరు.టీ20ల్లో కూడా ఈ స్థాయిలో వ్యక్తిగత స్కోరు నమోదు కాలేదు. ఇప్పటివరకు టీ10 క్రికెట్లో అత్యధిక స్కోరుగా ఉన్న 163 పరుగుల రికార్డును హంజా సలీమ్ దార్ బ్రేక్ చేశాడు.






